Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఇడ్లీ,దోశ, పూరీ వద్దు..ఓ కప్పు పొద్దున్నే ఇది తింటే ఏ రోగాలు రావు,ఎలా చేయాలంటే
ఈ రోజుల్లో ఏది ఉన్నా లేకున్నా ఆరోగ్యం ఉంటే చాలు రా బాబు అనుకుంటున్నారు అంతా. అందుకే చాలామంది ఏది పడితే అది తినకుండా ఆరోగ్యకరమైన ఫుడ్ నే తింటున్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆరోగ్యంగా ఉండటానికి అవి తినండి, ఇవి తినండి అని ప్రజలకు సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఫుడ్ అంటే అందరికీ గుర్తుకొచ్చేది మిల్లెట్స్. ఎండాకాలం ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది.
వేసవిలో చలువచేసి నీరసం రాకుండా రోజంతా యాక్టివ్ గా ఆరోగ్యంగాఉండడానికి ఉదయాన్నే ఒకకప్పు రాగులతో చేసిన రైస్ తినాల్సిందే. అయితే దీనిని ఇంట్లో తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
రాగులతో బ్రేక్ ఫాస్ట్ చేయడానికి కావాల్సిన పదార్థాలు
రాగులు
పెసరపప్పు
నీళ్లు
ఉప్పు
పచ్చిమిర్చి
జీలకర్ర
ఇంగువ
జీడిపప్పు
మిరియాలు
జీడిపప్పు
తయారీ విధానం
-ముందుగా 1 టీగ్లాసు రాగులను శుభ్రంగా కడిగా రాత్రంతా నానబెట్టుకోవాలి.
-తర్వాత 1 కప్పు పెసరప్పుని కలుపుతూ ఆయిల్ లేకుండా మంచి వాసన వచ్చేదాకా వేయించి పక్కనపెట్టాలి. చల్లారిన తర్వాత వీటిని నీళ్లు పోసి 1 గంటపాటు నానబెట్టాలి.
-తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి 8 గ్లాసుల నీళ్లు పోసి నీళ్లు కొంచెం వేడయ్యాక అందులో నానబెట్టిన రాగులను వేయాలి.
-రాగులు సగం ఉడికిన తర్వాత అందులో వేయించి నానబెట్టిన పెసరపప్పు వేసి కలిపి నెమ్మదిగా ఉడకనివ్వాలి.
-ఉడికి దగ్గరపడిన తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి.
-రాగులు, పెసరపప్పు ఉడికిన తర్వాత స్టవ్ మీద నుంచి దించి పక్కపెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ లో 1 స్పూన్ నెయ్యి వేడి చేసి అందులో గుప్పెడు జీడిపప్పు, పావు టీస్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కచ్చాపచ్చాగా దంచిన మిరియాలు, రెండు పచ్చిమిర్చి చీలికలు, సన్నగా కట్ చేసిన 1 స్పూన్ అల్లం ముక్కలు,పావు స్పూన్ ఇంగువ, కరివేపాకు వేసి వేయించుకోవాలి.
-తర్వాత ఈ తిరగమాతను రాగులు, పెసరపప్పుతో చేసిన మిశ్రమంలో వేసి కలిపితే తినడానికి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












