Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్తో చపాతీ కంటే సాఫ్ట్గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కరకరలాడే సగ్గుబియ్యం వడలు..తింటే అద్భుతం అంటారు,ఎలా చేసుకోవాలో చూడండి
వడల్లో అనేక రకాల వెరైటీలు ఉంటాయి. వీటిలో సగ్గుబియ్యం వడలు ఒకటి. ఇవి క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయి. బ్రేక్ ఫాస్ట్ లేదా సాయంత్నం స్నాక్ లోకి ఎలా తీసుకున్నా అదిరిపోతుంది. ఒక్కటి తిని ఆగరు. ఇంకా కావాలి అని అడుగుతంటారు. అంత రుచికరంగా ఉంటాయి. క్రిస్పీగా ఉండే ఈ సగ్గుబియ్యం వడలు ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకోవచ్చు. దీనికి పెద్ద ప్రాసెస్ కూడా ఉండదు. సగ్గుబియ్యం వడలు తయారుచేసుకోడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
సగ్గుబియ్యం వడలు తయరీకి కావలసిన పదార్థాలు
-సగ్గుబియ్యం
-జీలకర్ర
-పచ్చిమిర్చి
-కొత్తిమీర
-ఉప్పు
-చక్కెర
-పల్లీలు
-బంగాళదుంప
-పుదీనా
-ఆయిల్

సగ్గుబియ్యం వడలు తయారీ విధానం
-ముందుగా పావు కేజీ సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి అందులో ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి.
-తర్వాత స్టవ్ మీద ఓ పాన్ పెట్టి అందులో 1 కప్పు పల్లీలు వేసి ఆయిల్ లేకుండానే వేయించి పక్కనపెట్టుకోవాలి. చల్లారిన తర్వాత పొట్టు తీసేయాలి. ఇందులో నుంచి సగం కప్పు పల్లీలు తీసుకొని మిక్సీలో వేసి పలుకులు పలుకులుగా గ్రైండ్ చేసి పక్కనపెట్టుకోవాలి.
-తర్వాత చట్నీ కోసం మిగిలిన అరకప్పు పొట్టు తీసిన పల్లీలు మిక్సీ గిన్నెలో వేసి,ఇందులోనే 1 కట్ట కొత్తిమీర, గుప్పెడు పుదీనా, 4 పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగి ఉప్పు, కొద్దిగా చక్కెర, కొద్దిగా నిమ్మరసం వేసి మధ్య మధ్యలో కొంచెం నీళ్లు పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. చెట్నీ రెడీ. దీన్ని పక్కనపెట్టుకోండి.
రాయలసీమ పల్లెల స్పెషల్ బెండకాయ బజ్జీ..టేస్ట్ లో తిరుగుండదు అంతే..ఎలా చేసుకోవాలంటే..
-ఇప్పుడు రెండు బంగాళదుంపలను ఉడికించుకోవాలి.
-తర్వాత నానిన సగ్గుబియ్యంలో కచ్చాపచ్చగా గ్రైండ్ చేసిన పల్లీలు, 1 టీస్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసిన 4 పచ్చిమిర్చి, ఉడికించిన బంగాళదుంపల తురుము, రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. నీళ్లు అస్సలు వేయకూడదని గుర్తుంచుకోండి.
-తర్వాత చేతికి ఆయిల్ రాసుకొని సగ్గుబియ్యం మిశ్రమాన్ని ముద్దలుగా చేతిలోకి తీసుకొని వడలుగా వత్తి వాటిని వేడి వేడిగా కాగే నూనెలో వేయించుకోవాలి. అంతే కరకరలాడే సగ్గుబియ్యం వడలు రెడీ. వీటిని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చట్నీతో నంజుకొని తింటే ఆ మజానే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications