Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
మన పూర్వీకులు తిన్న ఆరోగ్యకరమైన స్వీట్ ఇదే..అందుకే అంత ఎనర్జీ,ఎలా చేసుకోవాలంటే..
ఇప్పుడంటే వందల రకాల స్వీట్లు అందుబాటులో ఉన్నాయి కానీ పూర్వకాలంలో కొన్ని రకాల స్వీట్లు మాత్రమే తరుచుగా తింటుండేవాళ్లు. అది కూడా ఆరోగ్యకరమైన స్వీట్లు తినేవాళ్లు కాబట్టే వాళ్లకి రోగాలు కూడా తక్కువ ఉండేవి. కొండలు అయినా పిండి చేసేటంతటి బలం ఉండేది. అలాంటి ఆరోగ్యకరమైన పాతకాలం నాటి సంప్రదాయ స్వీట్ లలో తిమ్మనం ఒకటి. ఇది తింటుంటే ఎంత తిన్నాం అని కూడా ఆలోచించరు. నోట్లో ఐస్ క్రీమ్ లా కరిగిపోయే పాలకాలంనాటి ఆరోగ్యకరమైన తిమ్మనం స్వీట్ ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
తిమ్మనం తయారీకి కావాల్సిన పదార్థాలు
-బియ్యం
-పచ్చి కొబ్బరి
-బెల్లం
-యాలకల పొడి
-జీడిపప్పు
-బాదంపపప్పు
-పాలు
-నెయ్యి
-ఎండుద్రాక్ష

తిమ్మనం తయారీ విధానం
-అరకప్పు అన్నం వండుకునే బియ్యాన్ని కడిగి గంట సేపు నానబెట్టండి.
-తర్వాత మిక్సీ గిన్నెలో గంటసేపు నానిన బియ్యం, 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, అక కప్పు నీళ్లు పోసి మరీ మెత్తగా కాకుండా, మరీ రవ్వలా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి రెండున్నర కప్పుల పాలను మరిగించాలి.
-పాలు మరగడం మొదలైన తర్వాత అందులో గ్రైండ్ చేసుకున్న బియ్యం పేస్ట్ వేసి మంటను లో ప్లేమ్ లో ఉంచి 10 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి.
-బాగా ఉడికి దగ్గరపడి క్రీమ్ లా అయిన తర్వాత దించేసి పక్కనపెట్టుకోండి
-ఇప్పుడు స్టవ్ మీద ఓ గిన్నె పెట్టి అందులో అరకప్పు బెల్లం, అరకప్పు నీళ్లు పోసి బెల్లం కరిగిన తర్వాత అరస్పూన్ యాలకల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి.
-ముందుగా ఉడికించి పక్కనపెట్టుకున్న పాలు బియ్యం మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ బెల్లం పాకం అందులో పోసి కలపండి. ఇందులోనే నెయ్యిలో వేయించిన జీడిపప్పు,ఎండుద్రాక్ష,బాదం పలుకులు వేసి కలపండి. అంతే టేస్టీ,హెల్తీ తిమ్మనం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications