Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
చిలకలూరిపేట స్పెషల్ స్వీట్ రెసిపి..వేళ్లు కూడా జుర్రుకొని తింటారు,ఎలా చేయాలంటే
పాలతాళికలు ఎప్పుడైనా తిన్నారా? తెలుగు రాష్ట్రాలలోని చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా పండుగల సమయంలో వీటిని ఎక్కువగా ఇళ్లల్లో చేస్తుంటారు. వినాయకచవితి సందర్భంగా ప్రత్యేకంగా దీనిని ఇంట్లో చేస్తారు. చిలకలూరిపేట, కోనసీయ ఏరియాల్లో అయితే దాదాపు ప్రతి ఇంట్లో దీనిని చేస్తుంటారు. వీటి టేస్ట్ ఒక్కసారి తింటే జన్మలో మర్చిపోరు. దీనిని తయారుచేయడం కూడా చాలా ఈజీ. చాలా రుచికరంగా ఉండే పాలతాళికలను ఇంట్లోనే ఈజీగా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
పాలతాళికలు తయారీకి కావాల్సిన పదార్థాలు
బియ్యంపిండి
యాలకలు
పాలు
బెల్లం
సగ్గుబియ్యం
నీళ్లు

పాతతాళికలు తయారీ విధానం
-పావు గ్లాస్ సగ్గు బియ్యం 1 గంటపాటు నానబెట్టుకోవాలి.
-తర్వాత ఓ బౌల్ లో రెండు గ్లాసుల బెల్లం వేసి అందులో 1 గ్లాసు నీళ్లు, నాలుగు యాలకలు వేసి కలుపి ఈ బౌల్ ని స్టవ్ మీద పెట్టి బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ పాకం పూర్తిగా చల్లారనివ్వాలి.
-తర్వాత స్టవ్ మీద ఓ పాన్ పెట్టి అందులో ఒకటిన్నర గ్లాసు నీళ్లు పోసి అందులో రెండు స్పూన్ల బెల్లం, 1 స్పూన్ నెయ్యి వేసి నీళ్లు బాగా మరిగిన తర్వాత మంట తగ్గించి ఇందులో 1 గ్లాసు బియ్యం పిండి వేసి ఉండలు లేకుండా దగ్గరపడేవరకు కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
-చల్లారిన తర్వాత దానిని చపాతి పిండి కలిపినట్లు కలుపుకోవాలి.
-తర్వాత చేతికి ఆయిల్ తీసుకొని కొంచెం కొంచెంగా పిండి తీసుకొని తాళికలుగా(పొడవుగా తీగలా) చేసుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ లో మూడు గ్లాసుల పాలు పోసి బాగా కాగిన తర్వాత అందులో నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం పైకి తేలితే ఉడికినట్లే.
-తర్వాత అందులో తాళికలు వేసేయాలి. అసలు కలపకూడదని గుర్తుంచుకోండి. మంటలను సిమ్ లో పెట్టి 7-8 నిమిషాలు ఉడికించుకోవాలి.
-ఈలోగా ఓ బౌల్ లో 1 స్పూన్ల బియ్యం పిండి, కొంచెం పాలు పోసి ఉండలు లేకుండా కలిపి ఈ మెత్తాన్ని స్టవ్ మీద ఉన్న తాళికలలో కొంచెం కొంచెంగా వేసుకోండి. 2 నిమిషాలు ఉడికించి తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి.
-2 నిమిషాల తర్వాత అందులో ముందుగా రెడీ చేసిన బెల్లం పాకం వేసి కలపండి. తర్వాత ఇందులో వేయించిన జీడిపప్పు, కిస్మిస్ వేసి కలపండి. అంతే పాలతాళికలు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications