Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
కనుమ చేపల పులుసు.. ఒక్కసారి రుచి చూస్తే జీవితంలో మర్చిపోరు.. సింపుల్గా ఎలా చేసుకోవాలంటే?
సంక్రాంతిలో మూడో రోజైన కనుమ నాడు మాంసాహారంతో ఇంటికి వచ్చిన అతిథులకు విందు ఇస్తారు. ఈ విందులో నాన్ వెజ్ వంటలు అధికంగా చేస్తుంటారు. వాటిలో ముఖ్యమైనది నాటుకోడి పులుసు, చేపల పులుసు. సాధారణ రోజుల్లో చేపల పులుసుకు, కనుమ రోజున చేసే చేపల పులుసును చాలా తేడా ఉంటుంది. కనుమ రోజున చేసే చేపల పులుసు చాలా రుచికరంగా ఉంటుంది. ఆ రుచి ఎలా వస్తుందో తెలియదు కానీ, ఓసారి తింటే ఆ కమ్మదనంలో మైమరచిపోతాము అంతే. ఇంతకీ కనుమ స్పెషల్ చేపల పులుసు ఎలా చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:
చేప ముక్కలు (మీ ఇష్టమైన చేప)
ఉల్లిపాయ - 2
తోటకూర - కొద్దిగా
చింతపండు రసం
అల్లం - చిన్న ముక్క
వెల్లుల్లి - 5 రేబలు
పసుపు - 1/2 టీస్పూన్
మిరియాల పొడి - 1 టీస్పూన్
కారం పొడి - రుచికి తగినంత
కొత్తిమీర తాలూకు - 1 టేబుల్ స్పూన్
కరివేపాకు - కొద్దిగా
కొబ్బరి తురుము - 1/4 కప్
నిమ్మరసం - 1 నిమ్మకాయ
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి తగినంత
కసూరి మేతి - కొద్దిగా (ఐచ్ఛికం)
తయారీ విధానం:
చేపలను శుభ్రం చేసి, ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తరువాత చేపలకు పసుపు, ఉప్పు, మిరియాల పొడి వేసి వాటిని ముద్దగా చేసుకొని చేపలకు బాగా పట్టే విధంగా బాగా రుద్దుకోండి.
ఇప్పుడు ఒక పాత్రలో నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తరువాత అందులో అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేసుకోవాలి. అలాగే అందులోని కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకొని.. ఉల్లిపాయ ముక్కలు బంగారు రంగులోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి.
ఆ తరువాత ఆ మిశ్రమంలో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకోవాలి. ఓసారి చేపను కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. ఆ తరువాత అందులో చింతపండు రసం పోసుకోవాలి. అలాగే గరం మసాలా, మిరియాల పొడి, కారం పొడి వేసుకొని గరిటె పెట్టి కలపకుండా గిన్నెను తిప్పుతూ కలుపుకొని పొయ్యి సన్నటి మంట మీద ఉడికించుకోవాలి.
ముక్కలు బాగా ఉడికినట్లు నిర్ధారించుకున్న తరువాత అందులో కొంచెం కొత్తిమీర చల్లుకొని, నిమ్మకాయ కూడా పిండుకొని ఓసారి మళ్ళీ కలుపుకొని దించుకుంటే ఎంతో రుచికమైన కనుమ చేపల పులుసు సిద్ధమైనట్లే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications