Latest Updates
-
లివ్-ఇన్ రిలేషన్షిప్లో విడిపోవడం నేరమా? సుప్రీంకోర్టు తీర్పుతో జంటలకు ఊరట! -
పెరుగన్నంలోకి ఈ కరకరలాడే బంగాళదుంప ఫ్రై ఉంటే.. ఒక్క ముద్ద కూడా మిగల్చరు! -
లైవ్-ఇన్ రిలేషన్షిప్లో విడిపోవడం నేరం కాదా? సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో మారనున్న సమీకరణాలు! -
మామిడి టెంకలను పారేస్తున్నారా? ఈ ఉపయోగాలు తెలిస్తే షాక్ అవుతారు! -
బ్రేక్ ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా..ఈ సొరకాయ ఊతప్పం రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
గజకేసరి యోగం పేరుతో సోషల్ మీడియాలో మోసపోతున్నారా? అసలు నిజం ఇదే! -
బిర్యానీ, పులావ్ లోకి అదిరిపోయే కాంబినేషన్..కమ్మని పైనాపిల్ రైతా ఎలా చేసుకోవాలంటే.. -
బుద్ధ పూర్ణిమ రోజున ఈ పనులు చేస్తున్నారా? శాంతి, సౌభాగ్యం కోసం తప్పక పాటించాల్సిన నియమాలివే! -
కన్యా రాశిలో చంద్రుడి సంచారం: ఈ పనులు చేస్తే మీ ఆర్థిక కష్టాలు మటుమాయం! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - మంగళవారం, 28 ఏప్రిల్ 2026
Dahipuri: నార్త్ ఇండియన్స్ ఎక్కువగా తినేది ఇదే, రుచి అమోఘంగా ఉంటుంది, ఎలా చేసుకోవాలంటే?
మన దేశంలో ఎన్నో రకాల వంటకాలు ఉన్నాయి. గల్లీకో పేరు ఉన్నట్లుగా.. వీధికొక వంట ఫేమస్గా ఉంటుంది. అవి కూడా చాలా రుచిగా తింటే నోట్లో కరిగిపోయే విధంగా ఉంటాయి. ఆ వంటలను చేసుకోవడం కూడా చాలా సులభం. ఇంట్లోనే వాటిని తయారుచేసుకోవచ్చు కూడా. అలాంటి వంటల్లో ఒకటే దహీపూరి. దీనిని ఉత్తర భారత దేశంలో ఎక్కువ ఇష్టంగా తింటూ ఉంటారు. పెరుగు, పూరీల కాంబినేషన్లో ఈ వంటకం ఉంటుంది. దీని రుచి కూడా అమోఘంగా ఉంటుంది. ఈ స్టోరీలో ఈ దహీపురి ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
పూరీలు: 12-15
పెరుగు: 2 కప్పులు
ఉడికించిన బంగాళదుంపలు: 2
ఉడికించిన శనగలు: 1/2 కప్పు
ఉల్లిపాయలు: 1 చిన్నది
టమోటాలు: 1 చిన్నది
కొత్తిమీర: కొద్దిగా
చింతపండు చట్నీ: 2 టేబుల్ స్పూన్లు
పుదీనా చట్నీ: 2 టేబుల్ స్పూన్లు
కారం: 1/2 టీస్పూన్
జీలకర్ర పొడి: 1/2 టీస్పూన్
చాట్ మసాలా: 1/2 టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
సేవ్: గార్నిష్ కోసం
తయారీ విధానం:
ముందుగా, ఉడికించిన బంగాళదుంపలను మెత్తగా చేసి, అందులో ఉడికించిన
శనగలు, తరిగిన ఉల్లిపాయలు, టమోటాలు, కొత్తిమీర, కారం, జీలకర్ర పొడి,
చాట్ మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి.
పెరుగును బాగా చిలికి, అందులో కొద్దిగా ఉప్పు వేసి కలపాలి.
పూరీలను చిన్న రంధ్రాలు చేసి, అందులో బంగాళదుంప మిశ్రమాన్ని
నింపాలి.
పూరీలపై పెరుగు, చింతపండు చట్నీ, పుదీనా చట్నీ వేయాలి.
చివరగా, సేవ్, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
దహీపూరి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
ప్రోబయోటిక్స్: పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి,
ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
కాల్షియం: పెరుగులో కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలను
బలంగా ఉంచుతుంది.
ప్రోటీన్: బంగాళదుంపలు, శనగలలో ప్రోటీన్ ఉంటుంది,
ఇది కండరాలను బలంగా ఉంచుతుంది.
విటమిన్లు, ఖనిజాలు: ఉల్లిపాయలు, టమోటాలు,
కొత్తిమీరలో విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని
పెంచుతాయి.
ఫైబర్: శనగలలో ఫైబర్ ఉంటుంది, ఇది మలబద్ధకాన్ని
నివారిస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












