ఓట్స్ పొంగల్..తినకపోతే హెల్దీ బ్రేక్ ఫాస్ట్ మిస్ అయినట్లే..ఎలా చేసుకోవాలంటే

Posted By:

ఓట్స్ పొంగలి ఒక ఆరోగ్యకరమైన, రుచికరమైన,తేలికపాటి అల్పాహారం. ఇది దక్షిణ భారత సంప్రదాయ వంటకం పొంగలికి ఓట్స్ ను ప్రత్యామ్నాయంగా ఉపయోగించి తయారు చేయబడుతుంది. ఓట్స్ పోషకాలతో నిండి ఉండటం వల్ల ఈ వంటకం మరింత ఆరోగ్యకరంగా మారుతుంది. పెరుగుతున్న పిల్లలకు, క్రీడాకారులకు,శాఖాహారులకు ఇది ఒక అద్భుతమైన ప్రోటీన్ వనరు. ఓట్స్ పొంగలి తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

ఓట్స్ పొంగలి తయారీకి కావాల్సిన పదార్థాలు

-రోల్డ్ ఓట్స్: 1 కప్పు
-పెసరపప్పు: 1/2 కప్పు
-నీరు: 3-4 కప్పులు
-నెయ్యి: 2-3 టేబుల్ స్పూన్లు
-ఆవాలు: 1/2 టీస్పూన్
-జీలకర్ర: 1 టీస్పూన్
-ఇంగువ: 1/4 టీస్పూన్
-పచ్చిమిర్చి: 2-3
-అల్లం: 1 అంగుళం ముక్క
-కరివేపాకు: 1 రెమ్మ
-జీడిపప్పు: 10-15
-ఉప్పు: తగినంత
-కొత్తిమీర తరుగు: 2 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం

-ముందుగా ఒక గిన్నెలో పెసరపప్పును తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి.

-కడిగిన పెసరపప్పును ప్రెషర్ కుక్కర్ లో వేసి 1.5 కప్పుల నీటిని పోసి కుక్కర్ మూత పెట్టి 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. పప్పు మెత్తగా కానీ మరీ పేస్ట్ లా కాకుండా ఉండాలి.

-ప్రెషర్ తగ్గిన తర్వాత మూత తీసి పక్కన పెట్టుకోవాలి.

-ఒక కడాయి లేదా మందపాటి అడుగున ఉన్న గిన్నెను స్టవ్ మీద పెట్టి ఓట్స్ ను కడాయిలో వేసి సుమారు 3-4 నిమిషాల పాటు వేయించాలి. ఓట్స్ రంగు మారకుండా, మంచి సువాసన వచ్చేవరకు వేయించాలి. క్విక్ ఓట్స్ కూడా వాడొచ్చు, కానీ రోల్డ్ ఓట్స్ అయితే పొంగలికి మంచి రుచి, ఆకృతి వస్తుంది.

-వేయించిన ఓట్స్ ను ఒక ప్లేట్\u200cలోకి తీసి పక్కన పెట్టుకోవాలి.

-అదే కడాయిని మళ్ళీ స్టవ్ మీద పెట్టి 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడైన తర్వాత ఆవాలు వేయాలి. ఆవాలు చిటపటలాడటం ప్రారంభించిన తర్వాత జీలకర్ర వేయాలి. జీలకర్ర వేగిన తర్వాత ఇంగువ, సగం చేసిన జీడిపప్పు ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం తరుగు, కరివేపాకు వేసి 1-2 నిమిషాలు వేయించాలి. అల్లం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి.

నో మిల్క్, నో షుగర్..ఎక్కువ రోజులు నిల్వ ఉండే సూపర్ టేస్టీ రవ్వ లడ్డు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే

-తాలింపులోకి వేయించిన ఓట్స్ ను వేసి బాగా కలపాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసి మిగిలిన నీరు (1.5 - 2.5 కప్పులు) పోయాలి.

-నీరు మరగడం ప్రారంభించిన తర్వాత మంట తగ్గించి మూత పెట్టి ఓట్స్ మెత్తబడే వరకు ఉడికించాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి.

-ఓట్స్ పూర్తిగా ఉడికి నీరు ఎక్కువగా లేని స్థితికి చేరుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పును ఓట్స్ మిశ్రమంలో వేసి బాగా కలపాలి.

-అవసరమైతే కొద్దిగా వేడి నీటిని కలుపుకోవచ్చు. పొంగలి మరీ చిక్కగా అనిపిస్తే,కాస్త నీరు పోసి మంటపై 1-2 నిమిషాలు ఉడికించవచ్చు. పొంగలి మీకు నచ్చిన విధంగా చిక్కదనం ఉండేలా చూసుకోండి.

-అన్నీ బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. పొంగలిని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైన తరిగిన కొత్తిమీరతో అలంకరించాలి.

-వేడి వేడి ఓట్స్ పొంగలిని కొబ్బరి చట్నీ, సాంబార్ లేదా పచ్చడితో తింటే నోట్లో బ్లాస్టే.

[ of 5 - Users]
Story first published: Friday, May 30, 2025, 18:08 [IST]
Desktop Bottom Promotion