Latest Updates
-
ఒకసారి స్టెంట్ వేశాక మరోసారి గుండెపోటు వస్తుందా.. చేదు నిజాలివే.! -
నోరూరించే కాజు చికెన్ పకోడీ.. ఇలా చేస్తే ఎంత తిన్నా తృప్తి తీరదు! -
ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కోసం భార్యాభర్తలు ఎలా కలవాలి.? -
తల్లిపాల వారోత్సవాలు.. బిడ్డే కాదు బాలింత కోసం కుటుంబీకులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా.. ఈ వడను తిన్నారంటే మినప గారెలను మరిచిపోతారు.! -
బుధాదిత్య యోగం.. ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం ఇంటి ముంగిటే.! -
గంటల తరబడి ఫ్రిజ్లో పెట్టాల్సిన పనిలేదు.. అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టంట్ ఫిష్ ఫ్రై.! -
రెస్టారెంట్ స్టైల్ తవా చికెన్..వేళ్లు నాకుతూ తినడం గ్యారెంటీ..ఈజీగా చేసుకోండిలా.. -
35 ఏళ్లకే కోరికలు తగ్గిపోయాయా.. దాంపత్య సుఖం కోసం తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన టిప్స్.! -
తెలంగాణలో వైభవోపేతంగా ఆషాఢ బోనాలు.. రంగంలో భవిష్యవాణి చెప్పిన సంగతులివే.!
చపాతీలో ఫేవరెట్ పనీర్ మెంతి కర్రీ.. రెస్టారెంట్ స్టైల్లో ఇలా అదరగొట్టేయండి.!
పనీర్ కాంబో స్పెషల్స్.. వెజ్ ప్రియులతో పాటు నాన్ వెజ్ లవర్స్ కూడా ఎగబడి తినేస్తారు. రోటీ, చపాతీ, బటర్ నాన్ వీటిలోకి పనీర్ కర్రీ ఫేమస్. ఇక రెస్టారెంట్ స్టైల్లో పనీర్ కాంబో స్పెషల్స్కి లెక్కే లేదు. అందులో ఒకటి పనీర్ మెంతి కర్రీ. ప్రొటీన్ పుష్కలంగా అందడంతో పాటు ఫిట్నెస్ కోసం డిన్నర్ టైంలో చపాతీలోకి ఈ పనీర్ మెంతి కర్రీ అదిరిపోతుంది. ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం..

పనీర్ మెంతి కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు
మెంతి కూర- పెద్ద కట్ట(కొంచెం పెద్ద ఆకులున్న మెంతి)
తాజా పనీర్- 200 గ్రాములు
పచ్చి బఠాణీలు- పావు కప్పు
గ్రేవీ కోసం
వెన్న- మూడు టీ స్పూన్లు
నూనె- మూడు టేబుల్ స్పూన్లు
మసాలా దినుసులు- టీస్పూన్
మిరియాలు- పావు టీస్పూన్
పచ్చిమిర్చి- మూడు
జీడిపప్పు- 15
ఉల్లిపాయలు- రెండు మీడియం సైజు
అల్లం, వెల్లుల్లి ముక్కలు- రెండు టీస్పూన్లు
పచ్చిమిర్చి- రెండు
ఉప్పు- రుచికి సరిపడా
పసుపు- అరటీస్పూన్
కారం- రెండు టీస్పూన్లు
ధనియాల పొడి- టీస్పూన్
గరం మసాలా- అర టీస్పూన్
తాజా క్రీమ్- టేబుల్ స్పూన్
పనీర్ మెంతి కర్రీ తయారీ విధానం
ముందుగా మెంతి ఆకులను శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి. పనీర్ ముక్కలను డైమండ్ ఆకారంలో కట్ చేసి పెట్టుకోవాలి.
నోరూరించే కాజు చికెన్ పకోడీ.. ఇలా చేస్తే ఎంత తిన్నా తృప్తి తీరదు!
ఇప్పుడు గ్రేవీ కోసం స్టవ్పైన మందపాటి పాన్ పెట్టుకుని అందులో టీస్పూన్ వెన్న, టీస్పూన్ నూనె వేసి మసాలా దినుసులు, మిరియాలు, మూడు పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు పలుకులు వేసి దోరగా వేయించాలి. వేగిన తర్వాత చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీలో ఐదు పనీర్ ముక్కలను కలిసి మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి.

అదే పాన్లో మరో టీస్పూన్ వెన్న, టీస్పూన్ నూనె వేసి పనీర్ ముక్కలను దోరగా రంగు మారే వరకు వేయించుకోవాలి. తర్వాత వీటిని చల్లటి నీళ్లలో కడగాలి. కాసేపటికి ఇవి స్పాంజ్లాగా అవుతాయి. నీళ్లను వేరు చేయాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిని కచ్చాపచ్చాగా చిన్న రోట్లో దంచుకోవాలి.
కూర కోసం అదే పాన్ని స్టవ్పైన పెట్టి మిగిలిన నూనె వేసి వేడయ్యాక అల్లంవెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ను వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి.
తర్వాత కడిగి పెట్టుకున్న బఠాణీ, మెంతి కూర వేసి బాగా వేయించుకోవాలి. ఉడికిన తర్వాత గ్రేవీ వేసి కలుపుకోవాలి.
చిన్నారుల ఫేవరెట్.. లంచ్ బాక్స్లోకి అదిరిపోయే రసం రైస్.. కొత్తగా ఇలా చేయండి.!
గ్రేవీ చిక్కగా అయిన తర్వాత కారం, పసుపు రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకుని మరోసారి కలుపుకోని ఉడికించుకోవాలి.
చివరిగా పనీర్ ముక్కలను వేసి కలిపి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. మిగిలిన వెన్నను వేసి మరికాసేపు ఉడికించి చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. రెస్టారెంట్ స్టైల్ పనీర్ మెంతి కర్రీ ఇంట్లోనే రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications