Latest Updates
-
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.?
రాగి మటన్ ఖీమా, అబబబ్బ ఒక్క ముద్ద తింటే జీవితంలో మళ్ళీ మర్చిపోరు, సింపుల్గా ఎలా చేసుకోవాలంటే?
రాగి జావా, రాగి బిస్కెట్స్, రాగి రోటి ఇలా ఎన్నో రకాల వంటలను రుచి చేసే ఉంటారు. కానీ మీరెప్పుడైనా రాగి మటన్ ఖీమా ట్రై చేశారా? ఒక్క స్పూన్ ఈ రాగి మటన్ ఖీమా నోట్లో వేసుకుంటే లాలాజలం ఆ ఊరి రావాల్సిందే. ఇప్పుడిప్పుడే మన హైదరాబాద్లో దీనికి సంబంధించిన రెస్టారెంట్లు వస్తున్నాయి. రెస్టారెంట్లలో కంటే ముందే, ఈ రాగి మటన్ ఖీమాను ట్రై చేయాలనుకునే వారికోసం రాగి మటన్ ఖీమా ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
మటన్ ఖీమా - 1/2 కిలో
రాగి పిండి - 1/2 కప్పు
ఉల్లిపాయలు - 2 (సన్నగా తరిగినవి)
టమోటాలు - 2 (సన్నగా తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి - 2 (సన్నగా తరిగినవి)
కొత్తిమీర - కొద్దిగా (సన్నగా తరిగినది)
నూనె - 3 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
కారం - 1 టీస్పూన్
పసుపు - 1/2 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
గరం మసాలా - 1/2 టీస్పూన్

తయారుచేసే విధానం:
- ముందుగా, మటన్ ఖీమాను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
- ఒక పాన్ లో నూనె వేడి చేసి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
- తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
- తర్వాత టమోటాలు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
- ఇప్పుడు మటన్ ఖీమా, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి బాగా కలపాలి.
- కొద్దిగా నీరు పోసి ఖీమాను మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి.
- ఖీమా ఉడికిన తర్వాత, రాగి పిండిని కొద్దిగా నీటిలో కలిపి పాన్ లో వేసి బాగా కలపాలి.
- కొత్తిమీర, గరం మసాలా వేసి బాగా కలిపి, రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే రాగి మటన్ ఖీమా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications