Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
రాగి మటన్ ఖీమా, అబబబ్బ ఒక్క ముద్ద తింటే జీవితంలో మళ్ళీ మర్చిపోరు, సింపుల్గా ఎలా చేసుకోవాలంటే?
రాగి జావా, రాగి బిస్కెట్స్, రాగి రోటి ఇలా ఎన్నో రకాల వంటలను రుచి చేసే ఉంటారు. కానీ మీరెప్పుడైనా రాగి మటన్ ఖీమా ట్రై చేశారా? ఒక్క స్పూన్ ఈ రాగి మటన్ ఖీమా నోట్లో వేసుకుంటే లాలాజలం ఆ ఊరి రావాల్సిందే. ఇప్పుడిప్పుడే మన హైదరాబాద్లో దీనికి సంబంధించిన రెస్టారెంట్లు వస్తున్నాయి. రెస్టారెంట్లలో కంటే ముందే, ఈ రాగి మటన్ ఖీమాను ట్రై చేయాలనుకునే వారికోసం రాగి మటన్ ఖీమా ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
మటన్ ఖీమా - 1/2 కిలో
రాగి పిండి - 1/2 కప్పు
ఉల్లిపాయలు - 2 (సన్నగా తరిగినవి)
టమోటాలు - 2 (సన్నగా తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి - 2 (సన్నగా తరిగినవి)
కొత్తిమీర - కొద్దిగా (సన్నగా తరిగినది)
నూనె - 3 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
కారం - 1 టీస్పూన్
పసుపు - 1/2 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
గరం మసాలా - 1/2 టీస్పూన్

తయారుచేసే విధానం:
- ముందుగా, మటన్ ఖీమాను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
- ఒక పాన్ లో నూనె వేడి చేసి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
- తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
- తర్వాత టమోటాలు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
- ఇప్పుడు మటన్ ఖీమా, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి బాగా కలపాలి.
- కొద్దిగా నీరు పోసి ఖీమాను మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి.
- ఖీమా ఉడికిన తర్వాత, రాగి పిండిని కొద్దిగా నీటిలో కలిపి పాన్ లో వేసి బాగా కలపాలి.
- కొత్తిమీర, గరం మసాలా వేసి బాగా కలిపి, రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే రాగి మటన్ ఖీమా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications