Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
రాగి సంగటిని వారానికి ఒక్కసారైనా తిందాం.. చేయడం చాలా సింపుల్..!
రాగి సంగటి ఈ కాలంలో తినడం చాలా అరుదుగా అయిపోయింది. కొన్నేళ్ల క్రితం వరకు చాలా మంది తమ ఇళ్లల్లో రాగి సంగటిని చేసుకొని తినేవారు. రాగిసంగటికి కాంబెనేషన్గా ఏ కూరనైను తీసుకోవచ్చు. ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలను కూడా రాగిసంగటిలో నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మారిన జీవన విధానంలో ప్రతీ రోజు రాగిసంగటిని తినడానికి చాలా మంది ఇష్టపడ్డం లేదు. కనీసం వారానికి ఒకసరైనా రాగిముద్దను తినడం అలవాటు చేసుకోవాలి.
రాగి సంగటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వుండవు. ఐరన్ కంటెంట్ కూడా సంమృద్ధిగా వుంటుంది. ఈ ఎండాకాలంలో రాగి జావ, లేదంటే రాగి సంగటి తినడం వల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా వుంటుంది. ప్రతీ రోజు ఒక గ్లాసు రాగి జావ తాగితే శరీరం చలవగా ఉండడం వల్ల వడదెబ్బను తట్టుకునే శక్తి వుంటుంది.

ముందుగా అర కప్పు బియ్యాన్ని ఒక బౌల్ లో తీసుకోవాలి. బియ్యాన్ని బాగా కడగాలి. అందులో కొన్ని నీళ్లు పోసి 1 గంట వరకు బియ్యాన్ని నానబట్టాలి. తరువాత ఒక కప్పు రాగి పిండిని తీసుకోవాలి. స్టవ్ వపై ఒక ప్యాన్లో ఒక కప్పు నీళ్లు తీసుకొని బాగా మరిగించాలి. నీళ్లు కాగిన తరువాత అందులో నానబెట్టుకున్న రైస్ను యాడ్ చేసుకోవాలి. రైస్ ను ఉడికేంత వరకు చూసుకోవాలి. రైస్ మొత్తం అన్నంగా మారకముందు ఇంతకు ముందు తీసుకున్న రాగిపిండిని ఇందులో వేసుకోవాలి. రాగి పిండిని వేసిన తరువాత కలపకుండా అలాగే వుంచాలి. ఒక ఐదు నిమిషాల పాటు అలాగే ఉడికిన తరువాత మూత తీసి గరిటతో మొత్తం బాగా కలపాలి. ఇప్పుడు రైస్, రాగి రెండింటినీ బాగా కలుపుకోవాలి. ఉండలు కాకుండా ఉండడానికి బాగా కలుపుతూనే వుండాలి. ప్యాన్ను స్టవ్ పై నుంచి కిందకు దింపుకోవాలి.
రాగి ముద్దలు చేసుకోవాడానికి అరచేయికి కొంత నెయ్యిని రాసుకోవాలి. నెయ్యికి బదులుగా నీళ్లకు కూడా రాసుకోవచ్చు. చేతికి అతుక్కోకుండా రాగి ముద్ద ఇంకా బాగా రావడానికి హెల్ప్ అవుతుంది. ఒక పిడికెడు రాగి ముద్దను తీసుకొని దాన్ని లడ్డూల్లా చేసుకోవాలి. దీంతో రాగి సంగటి తయారైనట్టే.
రాగి సంగటికి కాంబినేషన్గా నాటుకోడి పులుసు లేదా..
రాగి సంగటిని అలాగే తినవచ్చు. సమయం వుంటే మాంసాహారులైతే నాటుకోడిపులుసు చేసుకొని దాంట్లో నంచుకొని తినవచ్చు. చాలా మంది రాగిసంగటిని నాటుకోడిపులుసుతో తినడానికి ఇష్టపడతారు. మాంసం తినని శాఖాహారులైతే ఏదైనా కూరగాయల రసం, పప్పుతో తినవచ్చు.
రాగిసంగటిలో పోషకాలు
రాగిసంగటిలో క్యాల్షియం సంమృద్ధిగా వుంటుంది. ఇది ఖనిజాల భాండాగారమని చెప్పుకోవచ్చు. కేవలం 100 గ్రాముల రాగిలోనే సుమారు 350 నుంచి 400ల క్యాలరీలు వుంటాయ్. క్యాల్షియం 26 శాతం, పొటాషియం 27 శాతం, ఫైబర్ 14 శాతం, ప్రొటీన్ 10 శాతం వరకు వుంటుంది. గర్భిణులు డెలివరీ తరువాత పాలను ఉత్పత్తి చేయడానికి ఈ రాగి చాలా దోహదపడుతుంది. హెమోగ్లోబిన్ స్థాయిని కూడా రాగి పెంచుతుంది. అటు లివర్, చర్మాన్ని కూడా ఆరోగ్యంగా వుంచుతుంది. కాబట్టి ప్రతి రోజు కనీసం ఒక టీ కప్పు రాగి జావనైనా తాగడానికి అలవాటు చేసుకోండి, ఎందుకంటే మూడు నుంచి 4 కప్పుల కాఫీ, టీ తాగడం మనకు అలవాటు సహజం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications