Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
రాగి సంగటిని వారానికి ఒక్కసారైనా తిందాం.. చేయడం చాలా సింపుల్..!
రాగి సంగటి ఈ కాలంలో తినడం చాలా అరుదుగా అయిపోయింది. కొన్నేళ్ల క్రితం వరకు చాలా మంది తమ ఇళ్లల్లో రాగి సంగటిని చేసుకొని తినేవారు. రాగిసంగటికి కాంబెనేషన్గా ఏ కూరనైను తీసుకోవచ్చు. ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలను కూడా రాగిసంగటిలో నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మారిన జీవన విధానంలో ప్రతీ రోజు రాగిసంగటిని తినడానికి చాలా మంది ఇష్టపడ్డం లేదు. కనీసం వారానికి ఒకసరైనా రాగిముద్దను తినడం అలవాటు చేసుకోవాలి.
రాగి సంగటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వుండవు. ఐరన్ కంటెంట్ కూడా సంమృద్ధిగా వుంటుంది. ఈ ఎండాకాలంలో రాగి జావ, లేదంటే రాగి సంగటి తినడం వల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా వుంటుంది. ప్రతీ రోజు ఒక గ్లాసు రాగి జావ తాగితే శరీరం చలవగా ఉండడం వల్ల వడదెబ్బను తట్టుకునే శక్తి వుంటుంది.
ముందుగా అర కప్పు బియ్యాన్ని ఒక బౌల్ లో తీసుకోవాలి. బియ్యాన్ని బాగా కడగాలి. అందులో కొన్ని నీళ్లు పోసి 1 గంట వరకు బియ్యాన్ని నానబట్టాలి. తరువాత ఒక కప్పు రాగి పిండిని తీసుకోవాలి. స్టవ్ వపై ఒక ప్యాన్లో ఒక కప్పు నీళ్లు తీసుకొని బాగా మరిగించాలి. నీళ్లు కాగిన తరువాత అందులో నానబెట్టుకున్న రైస్ను యాడ్ చేసుకోవాలి. రైస్ ను ఉడికేంత వరకు చూసుకోవాలి. రైస్ మొత్తం అన్నంగా మారకముందు ఇంతకు ముందు తీసుకున్న రాగిపిండిని ఇందులో వేసుకోవాలి. రాగి పిండిని వేసిన తరువాత కలపకుండా అలాగే వుంచాలి. ఒక ఐదు నిమిషాల పాటు అలాగే ఉడికిన తరువాత మూత తీసి గరిటతో మొత్తం బాగా కలపాలి. ఇప్పుడు రైస్, రాగి రెండింటినీ బాగా కలుపుకోవాలి. ఉండలు కాకుండా ఉండడానికి బాగా కలుపుతూనే వుండాలి. ప్యాన్ను స్టవ్ పై నుంచి కిందకు దింపుకోవాలి.
రాగి ముద్దలు చేసుకోవాడానికి అరచేయికి కొంత నెయ్యిని రాసుకోవాలి. నెయ్యికి బదులుగా నీళ్లకు కూడా రాసుకోవచ్చు. చేతికి అతుక్కోకుండా రాగి ముద్ద ఇంకా బాగా రావడానికి హెల్ప్ అవుతుంది. ఒక పిడికెడు రాగి ముద్దను తీసుకొని దాన్ని లడ్డూల్లా చేసుకోవాలి. దీంతో రాగి సంగటి తయారైనట్టే.
రాగి సంగటికి కాంబినేషన్గా నాటుకోడి పులుసు లేదా..
రాగి సంగటిని అలాగే తినవచ్చు. సమయం వుంటే మాంసాహారులైతే నాటుకోడిపులుసు చేసుకొని దాంట్లో నంచుకొని తినవచ్చు. చాలా మంది రాగిసంగటిని నాటుకోడిపులుసుతో తినడానికి ఇష్టపడతారు. మాంసం తినని శాఖాహారులైతే ఏదైనా కూరగాయల రసం, పప్పుతో తినవచ్చు.
రాగిసంగటిలో పోషకాలు
రాగిసంగటిలో క్యాల్షియం సంమృద్ధిగా వుంటుంది. ఇది ఖనిజాల భాండాగారమని చెప్పుకోవచ్చు. కేవలం 100 గ్రాముల రాగిలోనే సుమారు 350 నుంచి 400ల క్యాలరీలు వుంటాయ్. క్యాల్షియం 26 శాతం, పొటాషియం 27 శాతం, ఫైబర్ 14 శాతం, ప్రొటీన్ 10 శాతం వరకు వుంటుంది. గర్భిణులు డెలివరీ తరువాత పాలను ఉత్పత్తి చేయడానికి ఈ రాగి చాలా దోహదపడుతుంది. హెమోగ్లోబిన్ స్థాయిని కూడా రాగి పెంచుతుంది. అటు లివర్, చర్మాన్ని కూడా ఆరోగ్యంగా వుంచుతుంది. కాబట్టి ప్రతి రోజు కనీసం ఒక టీ కప్పు రాగి జావనైనా తాగడానికి అలవాటు చేసుకోండి, ఎందుకంటే మూడు నుంచి 4 కప్పుల కాఫీ, టీ తాగడం మనకు అలవాటు సహజం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












