Latest Updates
-
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.!
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
ఎండాకాలంలో తెలుగు లోగిళ్లలో వడియాలు, పచ్చళ్ల సందడి మొదలవుతుంది. మండుతున్న ఎండలను చూస్తే మనకు ముందుగా గుర్తొచ్చేవి ఎండబెట్టే వడియాలే. అన్నంలోకి నంజుకోవడానికి వడియాలు ఉంటే ఆ భోజనం రుచే వేరు. అందులోనూ సగ్గుబియ్యం, బంగాళాదుంప కలిపి చేసే వడియాలు చాలా కరకరలాడుతూ, నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేలా ఉంటాయి.

పిల్లలు వీటిని పాప్ కార్న్ లాగా ఎంతో ఇష్టంగా తింటారు. అచ్చం పాప్ కార్న్ సైజులో చిన్నచిన్నగా పెట్టడం వల్ల, నూనెలో వేయగానే ఇవి పువ్వుల్లా విచ్చుకుంటాయి. అందుకే వీటిని సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు అని ముద్దుగా పిలుచుకుంటారు. ఈ వడియాలను చాలా సులువుగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు తయారీకి కావాల్సిన పదార్థాలు
సగ్గుబియ్యం - 1 కప్పు
బంగాళాదుంపలు- 2
పచ్చిమిర్చి - 5
జీలకర్ర - 1 టీస్పూన్
అల్లం - చిన్న ముక్క
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - సుమారు 5 కప్పులు
సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు తయారీ విధానం
-ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకుని నీళ్లతో శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత సగ్గుబియ్యం మునిగేలా నీళ్లు పోసి రాత్రంతా బాగా నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం బాగా నానితే వడియాలు గుల్లగా వస్తాయి.
-తర్వాత తొక్క తీసేసి బంగాళదుంపలను సన్నగా తురుముకోవాలి.
-నానిన సగ్గబియ్యంలో బంగాళదుంప తురుము వేయండి,ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, 1 టీస్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టీస్పూన్ తెల్ల నువ్వులు, 1 టీస్పూన్ జీలకర్ర వేసి, 1 కప్పు నీళ్లు పోసి బాగా కలుపుకొని దీనిని స్టవ్ మీద పెట్టి 2 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించాలి. మిశ్రమం జారుగా కాకుండా, పాప్ కార్న్ సైజులో పెట్టుకోవడానికి వీలుగా కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
-వడియాల మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు, డాబా మీద ఒక ప్లాస్టిక్ కవర్ లేదా మందపాటి కాటన్ వస్త్రం ఎండలో పరుచుకోవాలి. లేదా ప్లేట్ లో అయినా సగ్గుబియ్యం మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా చేతుల్లోకి తీసుకొని పాప్ కార్న్ లాగా పెట్టుకోండి. వీటిని ఫ్యాన్ కింద కానీ లేదా ఎండలో కానీ 2 రోజులు బాగా ఎండనివ్వాలి.
-మొదటి రోజు సాయంత్రానికి వడియాలు కవర్ నుండి సులువుగా ఊడి వస్తాయి. వాటిని రివర్స్ చేసి రెండో రోజు ఆరనివ్వాలి. అంతే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు రెడీ.
-పూర్తిగా గలగలా శబ్దం వచ్చేలా ఎండిన తర్వాత, గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే సంవత్సరం పాటు పాడవకుండా ఉంటాయి.
-తినాలనుకున్నప్పుడు స్టవ్ మీద కడాయిలో నూనె వేడి చేయ్యాలి. కడాయిలో నూనె బాగా వేడయ్యాక, ఈ ఎండిన వడియాలను వేస్తే చాలు, మల్లెపూవుల్లా తెల్లగా రెట్టింపు సైజులో విచ్చుకుంటూ కరకరలాడే పాప్ కార్న్ వడియాలు రెడీ. పప్పు, సాంబార్, రసం అన్నంలోకి ఇవి అద్భుతమైన కాంబినేషన్. స్నాక్స్ లా కూడా తినేయవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications