Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
పెరుగువడ..ఇలా చేసుకున్నారంటే స్పాంజీలా మెత్తగా నోట్లో కరిగిపోతాయ్
పెరుగు వడని ఇష్టపడనివాళ్లు ఎవరుంటారు. ముఖ్యంగా సమ్మర్ వచ్చిందంటే చాలు మూడు పూట్ల పెరుగువడే తినోటోళ్లు చాలామందే ఉంటారు. అయితే పెరుగు వడ చేయడం అందరికీ కుదరదు. చేసే విధానంలోనే దీని అసలు రుచి దాగి ఉంటుంది. పెరుగు వడలు మెత్తగా స్పాంజీగా ఉండి తింటుటంటే నోట్లోకి అలా జారిపోతున్నట్లు రావాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. టేస్టీగా జ్యూసీగా పెరుగు వడలు రావాలంటే ఏం చేయాలో ఇక్కడ చూడండి.
పెరుగు వడ తయారీకి కావాల్సిన పదార్థాలు
-మినపప్పు
-పెరుగు
-ఆవాలు
-జీలకర్ర
-కరివేపాకు
-శెనగపప్పు
-ఎండుమిర్చి
-పచ్చిమిర్చి
-అల్లం
-ఉప్పు
పెరుగు వడ తయారీ విధానం
-పావు కిలో మినపప్పుని 4 గంటలపైనే నానబెట్టాలి.
-తర్వాత ఇందులో ఉప్పు వేసి కలిపి మిక్సీలో వేసి ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి. ఇడ్లీ పిండి ఉన్నట్లుగా జారుగా ఉండేలా చూసుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసి అందులో 1 టీస్పూన్ జీలకర్ర,1 టీస్పూన్ మినపప్పు, 1 టీస్పూన్ శెనగపప్పు, 1 టీస్పూన్ ఆవాలు వేసి 80 శాతం ఫ్రై అయ్యాక అందులో రెండు కట్ చేసిన ఎండుమిర్చి, 1పచ్చిమిర్చి తరుగు, కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం తరుగు వేసి కలిపండి.
-తర్వాత 1 లీటర్ చిలికిన పెరుగులో ఈ తిరగమాతని వేసి కలపండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేయండి.
-ఇప్పుడు ఇంకో గిన్నెలో 1 లీటరు నీళ్లు పోసి ఇందులో కొంచెం ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల పెరుగు మిక్చర్ వేసి బాగా కలిపి పక్కనపెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద ఆయిల్ పోసి వేడి చేసి అందులో ముందుగా గ్రైండ్ చేసిన పిండితో వడలు వేసుకోవాలి.
-బాండీలో నుంచి తీసిన వడలను పక్కనపెట్టుకున్న నీళ్ల గిన్నెలో వేసి 5 నిమిషాలు అలాగే ఉండనివ్వండి.
-తర్వాత వడలను పిండకుండా అలానే తీసి ఇంకో బౌల్ లో వేసి దాని మీద ముందుగా రెడీ చేసుకున్న పెరుగు మిక్చర్ మొత్తం పోసి అరగంట పాటు అలా వదిలేయండి. అంతే టేస్టీ పెరుగు వడ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












