Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
Diwali Special Recipe: దీపావళి స్పెషల్..జస్ట్ 10 నిమిషాల్లో నోట్లో వేస్తే కరిగిపోయే మధురమైన మిల్క్ పెడా
అక్టోబర్ నెల వచ్చిందంటే చాలు పండుగల సందడి మొదలవుతుంది. వీధివీధినా దీపకాంతులు, ఇంటా బయటా ఆనంద కోలాహలాలు, మనసు నిండా ఉత్సాహం నిండిపోతాయి. ముఖ్యంగా అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూసే దీపావళి పండుగ ఈ నెలకే ప్రత్యేక ఆకర్షణను తెస్తుంది. పండుగ అంటేనే బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడపడం, నోటిని తీపి చేసుకోవడం. ఈ సమయంలో ప్రతి ఇంట్లోనూ రకరకాల పిండివంటలు, స్వీట్ల సువాసనలు గుబాళిస్తుంటాయి.
అయితే హడావుడి జీవితంలో గంటల తరబడి స్వీట్లు చేయడానికి సమయం ఉండకపోవచ్చు. అలాంటి వారికోసం అతి తక్కువ పదార్థాలతో, చాలా తక్కువ సమయంలో చేసుకోగలిగే ఒక అద్భుతమైన స్వీట్ ఉంది. అదే మిల్క్ పెడా లేదా పాలకోవ పెడా. దీని పేరు వినగానే చాలామందికి నోట్లో నీళ్లూరతాయి. దుకాణాల్లో కొనే పెడాల కన్నా మన చేతులతో స్వచ్ఛంగా ఇంట్లో తయారుచేసుకుంటే ఆ రుచే వేరు. దీని తయారీ చాలా సులభం. ఈ దీపావళికి మీ ఇంటిల్లిపాదినీ ఆశ్చర్యపరిచేలా ఈ మధురమైన పెడాలను ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.
మిల్క్ పెడా తయారీకి కావలసిన పదార్థాలు
-పాలపొడి - 1 కప్పు
-కాచి చల్లార్చిన పాలు - పావు కప్పు
-చక్కెర - అర కప్పు
-యాలకులు - 3 లేదా 4
-నెయ్యి - 2 నుండి 3 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం
-ముందుగా ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని అర కప్పు చక్కెర, యాలకులు వేసి సువాసన వచ్చేలా మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు ఒక గిన్నెలో ఒక కప్పు పాలపొడి వేయండి. దానికి కాచి చల్లార్చిన పావు కప్పు పాలను కొద్దికొద్దిగా పోస్తూ ఎక్కడా ఉండలు కట్టకుండా చిక్కని, మృదువైన పేస్టులా కలపాలి.
-తర్వాత అడుగు మందంగా ఉన్న ఒక పాన్ ను స్టవ్ మీద పెట్టి సన్నని మంట మీద 2 చెంచాల నెయ్యి వేసి వేడిచేయాలి. నెయ్యి కరిగాక మనం ముందుగా సిద్ధం చేసుకున్న పాలపొడి మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలపాలి.
-ఇప్పుడు మిక్సీ పట్టుకున్న చక్కెర-యాలకుల పొడిని కూడా పాన్ లో వేసి మిశ్రమం మొత్తం బాగా కలిసేలా గరిటెతో తిప్పుతూ ఉండాలి. మంటను తక్కువలో ఉంచి మిశ్రమాన్ని అస్సలు ఆపకుండా కలుపుతూనే ఉండాలి.
-సుమారు 3-4 నిమిషాల్లో మిశ్రమం చిక్కబడి పాన్ అంచులను వదిలి ముద్దలా దగ్గరపడుతుంది. ఆ సమయంలో స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఒక ప్లేట్ లోకి మార్చండి.
-మిశ్రమం కాస్త చల్లారి, గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని, దాన్ని రెండు నిమిషాల పాటు మెత్తగా కలపండి. ఇప్పుడు చిన్న నిమ్మకాయంత ఉండలు తీసుకుని, గుండ్రంగా చేసి,మధ్యలో బొటనవేలితో కొద్దిగా నొక్కి పెడా ఆకృతిలో ఒత్తుకోవాలి.
-మీకు నచ్చితే వాటిపై బాదం లేదా పిస్తా పలుకులతో అలంకరించుకోవచ్చు. అంతే ఎంతో రుచికరమైన, నోట్లో వేసుకుంటే కరిగిపోయే మిల్క్ పెడాలు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications






