Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
ఇంట్లో ఉండే వాటితోనే.. మడత కాజాని మించిన రుచితో సూపర్ స్వీట్!
ఎప్పుడూ ఓకే రకమైన స్వీట్లు తిని తిని బోర్ కొట్టేసిందా? అయితే మీ ఇంట్లో కప్పు గోధుమ పిండి ఉంటే ఓ అద్భుతమైన స్వీట్ రెడీ చేసుకోండి. టేస్ట్ అదిరిపోతుంది.
దీని తయారీకి ఎక్కువ సమయం పట్టదు. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీ జ్యూసీగా టేస్ట్ భలే ఉంటాయి. ఈ స్వీట్ ని ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-గోధుమ పిండి
-మైదా పిండి
-చక్కెర
-నూనె
-యాలకల పొడి
-నెయ్యి
తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో అర కప్పు మైదా పిండి, అర కప్పు గోధుమ పిండి వేసి ఇందులోనే చిటికెడు ఉప్పు వేసి కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. గట్టిగా కలుపుకున్నాక గిన్నెపై మూతపెట్టి దీనిని పక్కన పెట్టుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో 1కప్పు చక్కెర, 1కప్పు నీళ్లు పోసి చక్కెర పూర్తిగా కరిగేదాకా మరిగించాక ఇందులో అర టీస్పూన్ యాలకల పొడి వేసి కలిపి గులాబ్ జామ్ కి పాకం ఎలా చేసుకుంటామో అలా అయ్యాక స్టవ్ ఆపేసి గిన్నెపై మూతపెట్టి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు ముందుగా కలుపుకున్న మరొకసారి చేత్తో కలుపుకున్నాక పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. తర్వాత ఒక్కో పిండి ముద్దను తీసుకొని మరీ పల్చగా కాకుండా,మరీ మందంగా కాకుండా పల్చగా, చిన్న చపాతీలా రెడీ చేసుకోవాలి.
-తర్వాత వత్తుకున్న ఒక్కో చపాతీని పీట మీద పెట్టి 3 చుక్కల నెయ్యిని ఆ చపాతీ మీద వేసుకొని దాన్ని చేత్తో మొత్తం పరుచుకున్నట్లు చేశాక, దీని మీద పొడి మైదా పిండి చల్లుకొని దీని మీద వేరొక చపాతీ పర్చుకోవాలి.
-ఇలా ప్రతి ఒక్క చపాతీపై 3 చుక్కల నెయ్యి వేసుకొని తర్వాత పొడి మైదా పిండి చల్లుకొని దానీ మీద మరో చపాతీ పెట్టడం చేసుకోవాలి. ఒకదానిపై ఒకటి ఇలా వేసుకున్న తర్వాత దీనిని గొట్టంలా మడుచుకోవాలి.
-సన్నగా రోల్ లాగా చేసుకున్న తర్వాత చాకుతో దానిని అర ఇంచు వదులుతూ ముక్కలుగా కట్ చేసుకోవాలి.
-ఆ తర్వాత కట్ చేసిన ముక్కలను చేతితో రౌండ్ గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
-రౌండ్ గా చేసుకున్న తర్వాత దానిపై పొడి పిండి చల్లుకుంటూ పల్చని పూరీలా కర్రతో వత్తుకోవాలి. మరీ గట్టిగా వత్తుకోకూడదు..అలా చేస్తే లేయర్స్ పోతాయి.
-అన్నీంటినీ వత్తుకొని ఓ ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేశాక అందులో వత్తుకున్న ఒక్కో పూరీని అందులో వేసి మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా లేత బంగారు రంగు వచ్చేదాకా వేయించి ఓ ప్లేట్ లోకి తీసుకోవాలి. అన్నింటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆపేయాలి.
-ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్ చక్కెర పాకంలో రెడీ చేసుకున్న ఒక్కో పూరీని వేసి రెండు వైపులా అర నిమిషం డిప్ చేసి ఓ ప్లేట్ లోకి తీసి పెట్టుకోవాలి.
-ప్లేట్ లో రెడీ అయి ఉన్న పూరీలపై కొంచెం చక్కెర చల్లుకోండి. అంతే క్రిస్పీ, జ్యూసీ గోధుమ పిండి స్వీట్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications













