Latest Updates
-
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.?
సంవత్సరమైనా పాడవకుండా ఉండే బియ్యం వడియాలు.. సింపుల్గా ఎలా చేసుకోవాలంటే?
మన తెలుగు ప్రజలకు పచ్చళ్ళు, అప్పడాలు, రోటి పచ్చలు, వడియాలు అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. అందుకే నెలల ముందే పచ్చళ్ళు పెట్టుకొని నిలువ ఉంచుకొని తింటుంటారు. వాటిలో ముఖ్యమైనది వడియాలు. వీటిని చాలామంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. అలాగే దీనిని చేసుకోవడం కూడా చాలా సులభం. ఒక రెండు రోజులు జోరుగా ఎండ కాసిందంటే చాలు వడియాలు వేసేసి ఇంటి మేడపైన ఆరబెట్టేస్తారు. ఒకసారి చేసుకుంటే ఏడాదిపాటు వచ్చే ఈ వడియాలు ఎన్ని రోజులైనా పాడవకుండా, రుచికరంగా ఉండేలా ఎలా చేసుకోవాలో మేము ఇక్కడ వివరించాము. మేము చెప్పిన విధంగా ఓసారి ట్రై చేసి.. మీ ఫ్రెండ్స్, అండ్ కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోండి.
ముందుగా బియ్యం వడియాలు తయారీకి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం
- మూడు కప్పుల బియ్యం
- తొమ్మిది కప్పుల నీళ్లు
- ఒక స్పూన్ వాము
- రెండు స్పూన్ల జీలకర్ర
- పావు కప్పు నువ్వులు
- రుచికి సరిపడా ఉప్పు

బియ్యం వడియాలు తయారీ విధానం
ఈ బియ్యం వడియాలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు బియ్యానికి మూడు కప్పుల నీళ్లు వేసి ఉడికించాలి. మనం మూడు కప్పుల బియ్యం తీసుకున్నాం కాబట్టి.. తొమ్మిది కప్పుల నీళ్లు గిన్నెలో పోసుకోవాలి. ఆ నీటిని సలసలా మరిగే వరకు మరిగించుకోవాలి. నీళ్లు బాగా మారిగాకా అందులో మూడు కప్పుల బియ్యం వేసుకోవాలి. అలాగే అదే నీళ్లలో రుచికి సరిపడా ఉప్పును కూడా జత చేసుకోవాలి.
ఇప్పుడు అందులో వాము, జీలకర్ర, నువ్వులు కూడా వేసుకొని బాగా కలుపుకొని గిన్నెపైన మూత పెట్టుకోవాలి. బియ్యం, నీళ్లు అన్ని చిక్కగా, గట్టిగా, మందంగా అయ్యే వరకు మరిగించుకోవాలి. ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసి బియ్యంను చల్లారేవరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక చీరను బాగా ఎండ తగిలే ప్రాంతంలో పరుచుకొని.. బియ్యం మిశ్రమాన్ని వడియాల మాదిరిగా పరుచుకోవాలి. అలాగే జంతికల యంత్రంలో ఉంచుకొని జంతికల మాదిరిగా వచ్చే విధంగా కూడా ఈ వడియాలు వేసుకోవచ్చు.
ఇంకొందరు తెల్లని వస్త్రంపై అప్పడాల మాదిరిగా ఉంచుకొని ఎండబెట్టుకుంటారు. ఈ విధంగా కూడా వడియాలు రుచికరంగా ఉంటాయి. అలా వివిధమైన వస్త్రాలపై ఈ వడియాలు రెండు రోజుల పాటు ఎర్రటి ఎండలో ఎండబెడితే వడియాలు సిద్ధమైనట్లే. ఎండిన వడియాలు గిన్నెలో వేసుకున్నప్పుడు గలగలామని శబ్దం వినిపిస్తుంది. అప్పుడే వడియాలు ఎండినట్లు అర్ధం చేసుకోవాలి. వీటిని గాలి దూరని డబ్బాలో ఉంచుకొని నిలువ చేసుకుంటే ఎన్ని నెలలైనా పాడవకుండా అలానే ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications