Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
sankranti special recipe: సంక్రాంతి రోజు తప్పక తినాల్సిన వంటకం..ఎలా చేసుకోవాలో చూడండి
సంక్రాంతి పర్వదినాన చాలామంది ఖిచిడి తినే సంప్రదాయాన్ని పాటిస్తారు. మకర సంక్రాంతి రోజున మినపప్పుతో చేసే ఖిచిడి తినే సంప్రదాయానికి ప్రత్యేక మతపరమైన, జ్యోతిష్య ప్రాముఖ్యత కూడా ఉంది. బియ్యం, పప్పు, నెయ్యి, పసుపు, సుగంధ ద్రవ్యాలు, ఆకుపచ్చ కూరగాయలు వంటి ఖిచిడి ప్రధాన పదార్థాలు తొమ్మిది గ్రహాలతో సంబంధం కలిగి ఉన్నాయని నమ్ముతారు. వాటి వినియోగం శుభ ఫలితాలను తెస్తుందని వివ్వసిస్తారు. అయితే ఖిచిడిని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలి, ఖిచిడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇక్కడ చూడండి.
మినపప్పు ఖిచిడి తయారీకి కావలసిన పదార్థాలు
-అరకప్పు బియ్యం
-1/4 కప్పు మినపప్పు
-అరకప్పు పచ్చి బఠానీలు
-అర అంగుళం అల్లం ముక్క
-4 ఎండుమిర్చి
-3 చెంచాల నెయ్యి
-2 పచ్చిమిర్చి
-1 టమోటా
-1 దాల్చిన చెక్క
-2 లవంగాలు
-చిటికెడు ఇంగువ
-ఏలకులు
-జీలకర్ర
-పసుపు
-ఉప్పు
ఖిచిడి తయారీ విధానం
-మినపప్పు ఖిచిడి చేయడానికి ముందుగా కుక్కర్ లో 2-3 స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయండి.
- ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర, ఇంగువ, దాల్చిన చెక్క, లవంగాలు, ఎండుమిర్చి, యాలకులు వేసి చిన్న మంటపై వేయించాలి.
-మసాలాలు కాస్త వేగిన తర్వాత అందులో టమోటో ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, పచ్చిబఠానీలు వేసి వేయించాలి.
-టమాటోలు మగ్గిన తర్వాత పసుపు వేసి కలిపి అందులో మినపప్పు, బియ్యం వేసి కలపాలి.
-ఇప్పుడు అందులోనే ఎర్ర కారం, ఉప్పు వేసి అన్నీ కలిసేలా కలపండి.
- 2 నిమిషాలు కొద్దిగా ఉడికించిన తర్వాత కుక్కర్ లో 1.5 కప్పుల నీరు వేసి మూసివేయండి.
-1 విజిల్ వచ్చేదాకా అధిక మంట మీద ఉడికించాలి, ఆపై మీడియం మంట మీద మరో 1 విజిల్ వచ్చే దాకా ఉడికించుకోండి.
-ప్రెజర్ విడుదలయ్యే వరకు కుక్కర్ తెరవవద్దు. కుక్కర్ తెరిచినప్పుడు కిచిడీని కలపండి.
-అందులో కాస్త పచ్చి కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే రుచికరమైన మినపప్పు ఖిచ్డీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












