Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Poori Without Oil: నూనె లేకుండా పూరీలు..ఎలా చేసుకోవాలో చూడండి
పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ లోకి ఎక్కువగా తీసుకునే ఐటమ్స్ లో పూరీ ఒకటి. పూరీ పేరు వినగానే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది వేడి వేడిగా కాగిన నూనెలో నుంచి బుసబుసా పొంగుతున్న చిత్రం మన కళ్ల ముందు మెదులుతుంది. అయితే ఆయిల్ ఫుడ్ కి దూరంగా ఉండాలనే కారణంతో చాలామందికి పూరీలు తినాలని కోరిక ఉన్నా కూడా వెనుకాడుతుంటారు. అలాంటి వారందరికీ ఒక గుడ్ న్యూస్. ఇకపై రుచికి రాజీ పడకుండా, ఆరోగ్యాన్ని పణంగా పెట్టకుండా రుచికరమైన నూనె చుక్క అవసరం లేని పూరీని ఆస్వాదించవచ్చు.
నూనె చుక్క అవసరం లేని సగ్గుబియ్యం పూరీ..సాంప్రదాయ పూరీల రుచిని మరిపించే ఈ అద్భుతమైన వంటకం, మీ ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ ముందుంటుంది. నూనెలో వేయించకపోవడం వల్ల ఇందులో కేలరీలు చాలా తక్కువ. కొలెస్ట్రాల్ గురించి ఆందోళన చెందాల్సిన పనే లేదు. బరువు తగ్గాలనుకునే వారికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారికి ఇది ఒక వరం లాంటిది. కేవలం 25-30 నిమిషాల్లోనే రెడీ చేసుకోగల ఈ పూరీలు ఉపవాస దీక్షలో ఉన్నవారికి లేదా లైట్ బ్రేక్ ఫాస్ట్ కోరుకునే వారికి బెస్ట్ ఆప్షన్. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవడం ఖాయం. చుక్క నూనె అవసరం లేని పూరీలు ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
-సగ్గుబియ్యం - 1 కప్పు
-బంగాళాదుంపలు - 2
-పచ్చిమిర్చి - 2
-ఉప్పు - సరిపడా
-కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు
-జీలకర్ర పొడి - అర టీస్పూన్
-బొంబాయి రవ్వ లేదా గోధుమ పిండి - 2 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం
-ముందుగా సగ్గుబియ్యన్ని శుభ్రంగా కడిగి కనీసం 4-5 గంటలు లేదా వీలైతే రాత్రంతా నానబెట్టాలి. సబ్బయ్యం మెత్తగా, పువ్వుల్లా వికసించాలి. ఆ తర్వాత అందులోని నీటిని పూర్తిగా వంపేసి, చేత్తో గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు బంగాళదుంపలను ఉడికించి వాి పొట్టు తీసి, ఉండలు లేకుండా మెత్తగా మెదపాలి.
-ఇప్పుడు మెత్తగా మెదిపిన బంగాళుంపలో నానబెట్టిన సగ్గుబియ్యం, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి.

-ఒకవేళ పిండి మరీ జిగటగా అనిపిస్తే, ఆకృతి కోసం కొద్దిగా బొంబాయి రవ్వ లేదా గోధుమ పిండిని చేర్చుకోవచ్చు. ఇది పూరీలు విరిగిపోకుండా, సులభంగా ఒత్తడానికి సహాయపడుతుంది.
-కలిపిన పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, చపాతీ కర్రతో కాస్త మందంగా, గుండ్రంగా పూరీల్లా ఒత్తుకోవాలి.
-స్టవ్ మీద నాన్ స్టిక్ పెనం పెట్టి వేడి చేయాలి. నూనె వేయకుండా ఒత్తుకున్న పూరీలను పెనంపై వేసి, మీడియం మంట మీద రెండు వైపులా బంగారు రంగులోకి మారేంత వరకు కాల్చాలి.
-పూరీలు మాడిపోకుండా మధ్యమధ్యలో తిప్పుతూ ఉండాలి. అంతే వేడివేడి, ఆరోగ్యకరమైన సగ్గుబియ్యం పూరీలు రెడీ. ఈ పూరీలను చల్లటి పెరుగు, పచ్చిమిర్చి చట్నీ లేదా మీకు ఇష్టమైన రైతాతో కలిపి తింటే ఆ రుచే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications