Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
కూరగాయలు లేనప్పుడు సింపుల్ గా మసాలా కర్రీ..రుచి అద్భుతం..రైస్, చపాతీలోకి కేక..ఎలా చేసుకోవాలంటే
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు సింపుల్ గా చేసుకునే టేస్టీ వంటకం మసాలా కర్రీ. రైస్, చపాతీలోకి ఇది అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా దీనిని తయారుచేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇంటికి సడెన్ గా చుట్టాలు వచ్చినప్పుడు టేస్టీగా చేసిపెట్టడానికి ఇది సూపర్ గా ఉంటుంది. కూరగాయలు అక్కర్లేని టేస్టీ మసాలా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-పల్లీలు
-యాలకలు
-దాల్చిన చెక్క
-లవంగాలు
-యాలకలు
-జీలకర్ర
-ఉల్లిపాయ
-పచ్చిమిరపకాయ
-కరివేపాకు
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-ఆవాలు
-ఉప్పు
-పసుపు
-ధనియాల పొడి
-గరం మసాలా
-చింతపండు రసం
తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో రెండున్నర టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి మీడియం మంట మీద బాగా ఫ్రై చేసుకున్నాక అందులోనే రెండున్నర టేబుల్ స్పూన్ల నువ్వులు, రెండున్నర టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసి కొబ్బరి పొడి కలర్ మారేదాకా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి.
-చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసి ఇందులోనే 1 ఇంచు దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు,2 యాలకలు వేసి ఒకసారి మిక్సీ వేసుకోవాలి. తర్వాత ఇందులో పావు గ్లాసు నీళ్లు పోసుకొని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో అర టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చి మిరపకాయ ముక్కలు, 1 రెమ్మ కరివేపాకు వేసి వేపుకోవాలి.
-ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అందులో అర టీస్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి.
-ఇప్పుడు ఇందులో మిక్సీలో వేసుకున్న మసాలా పేస్ట్ వేసి బాగా కలపండి. రుచికి సరిపడా ఉప్పు, అర టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ కారం, 1 టీస్పూన్ ధనియాల పొడి, అర టీస్పూన్ గరం మసాలా పొడి వేసి ఆయిల్ సైడ్స్ కి వచ్చేదాకా మీడియం మంట మీద కలుపుకోవాలి.
-తర్వాత అందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం, ముప్పావు గ్లాస్ నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. గ్రేవీ పలుచగా కావాలనుకుంటే మరికొన్ని నీళ్లు పోసుకుండి. 10 నిమిషాలు మీడియం మంట మీద ఉడికించుకోండి. చివర్లో కొత్తిమీర తరుగు చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications






