Latest Updates
-
కంచంలో ఎన్ని కూరలున్నా సరే.. ఈ మామిడి అల్లం చారు ముందు దిగదుడుపే! -
పల్లెటూరి స్టైల్ పానీపూరి ఇలా చేస్తే.. బయట దొరికే రుచిని మించిపోతుంది, ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలనిపిస్తుంది! -
బంపరాఫర్..షూరిటీ లేకుండానే రూ.10 లక్షల లోన్..ఫుల్ డీటెయిల్స్ మీకోసం.. -
ఎండల వేళ దంపతుల మధ్య గొడవలు ఎందుకు? మీ బంధాన్ని కాపాడుకోవడానికి ఈ 7 విషయాలు తప్పక తెలుసుకోండి! -
గ్యాస్, ఎసిడిటీ సమస్యలకు చెక్.. ఉదయాన్నే ఈ సింపుల్ పనులు చేయండి చాలు! -
ఫైబర్, కాల్షియం వంటి పుష్కలంగా రాగి సమోసా..ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి -
ఇడ్లీ, దోశ, పెసరట్టు,అన్నం దేనికైనా అదిరిపోయే అల్లం మామిడి పచ్చడి..ప్లేట్లు ప్లేట్లు ఖాళీ చేస్తారు! -
తెలియని వ్యక్తులతో చాటింగ్ చేస్తున్నారా? హనీ ట్రాప్ ముఠాల వలలో పడితే జీవితమే నాశనం! -
బిర్యానీని మించిన రుచితో మటన్ కీమా రైస్.. ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టరు! -
వృషభం, కర్కాటక, సింహ రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 20 నుండి 26 మే 2026 వరకు
చుక్క నీరు,ఉల్లి,వెల్లుల్లి లేకుండానే..జార్ఖండ్ ఫేమస్ అత్తే మటన్..దీని రుచికి ఫిదా అవ్వాల్సిందే!
మటన్.. ఈ పేరు వినగానే మాంసాహార ప్రియుల నోట్లో నీళ్లు ఊరడం ఖాయం. వీకెండ్ వచ్చిందంటే చాలు, చాలామంది ఇళ్లలో ఘుమఘుమలాడే మటన్ కూర ఉడికిపోవాల్సిందే. మటన్ తో రకరకాల వంటకాలు చేస్తుంటారు. అయితే, సాధారణంగా మటన్ వండాలంటే బోలెడంత ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రేవీ కోసం నీళ్లు వాడటం మనకు అలవాటు. కానీ, మీరు ఎప్పుడైనా జార్ఖండ్ లోని డియోఘర్ ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ అత్తా మటన్ రుచి చూశారా?
ఈ అత్తే మటన్ తయారీ విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇందులో చుక్క నీరు కూడా పోయరు. ఉల్లిపాయ, వెల్లుల్లి కూడా వాడరు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, పాతకాలం నాటి సాంప్రదాయ పద్ధతిలో వండే ఈ మటన్ రుచి మాత్రం జన్మలో మర్చిపోలేరు. కేవలం స్వచ్ఛమైన నెయ్యి, నిండు మసాలా దినుసులతో మాత్రమే దీనిని వండుతారు. డియోఘర్ స్పెషల్ అత్తే మటన్ ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

అత్తే మటన్ తయారీకి కావాల్సిన పదార్థాలు
లేత మటన్ - 1 కిలో
నెయ్యి - 400 గ్రాములు
బిర్యానీ ఆకు
పచ్చ యాలకులు
నల్ల యాలకులు
లవంగాలు
జీలకర్ర
దాల్చినచెక్క
జాపత్రి
నల్ల మిరియాలు
దంచిన పచ్చిమిర్చి
దంచిన అల్లం
ఉప్పు
అత్తే మటన్ తయారీ విధానం
-ముందుగా ఒక కిలో తాజా, లేత మటన్ తెచ్చుకోవాలి. దానిని రెండు మూడు సార్లు శుభ్రమైన నీటిలో బాగా కడిగి, నీరు మొత్తం పోయేలా వడకట్టి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి మందపాటి ఇనుప కడాయిని పొయ్యి మీద పెట్టండి. ఇనుప పాత్రలో వండటం వల్ల మటన్ కు అద్భుతమైన రుచితో పాటు మంచి రంగు కూడా వస్తుంది. కడాయి వేడెక్కాక అందులో 400-500 గ్రాముల నెయ్యి వేయాలి.
-నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత అందులో ఘుమఘుమలాడే మసాలా దినుసులన్నింటినీ (బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క తదితరాలు) వేసి వేయించాలి.
-మసాలా దినుసులు చక్కగా వేగిన తర్వాత, కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలను అందులో వేయాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి, సుమారు 45 నిమిషాల పాటు నేతిలోనే మటన్ ను ఓపికగా వేయించాలి. ఈ సమయంలో మటన్ తనలోని సహజసిద్ధమైన రసాలతో నేతిలో ఉడుకుతుంది.
-45 నిమిషాల తర్వాత, దంచిన పచ్చిమిర్చి, అల్లం పొడి లేదా దంచిన అల్లం వేసి మళ్లీ వేయించడం కొనసాగించాలి.
-మటన్ ముక్కలు పూర్తిగా మెత్తబడి, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా తయారయ్యే వరకు నెమ్మదిగా వేయించాలి. మాంసం చక్కగా ఉడికింది అనిపించాక, చివరగా మీ రుచికి తగినట్లుగా ఉప్పును జోడించండి. ఉప్పు వేసిన తర్వాత మటన్ ముక్కలకు పట్టేలా మరో ఐదు నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆపేయండి.
-అంతే ఎంతో రుచికరమైన, నోరూరించే డియోఘర్ స్పెషల్ అత్తే మటన్ రెడీ. వేడివేడి అన్నం, రోటీ లేదా నాన్ తో దీనిని వడ్డిస్తే ఆ రుచికి ఫిదా అవ్వాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications











