Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
నోరూరించే పల్లీ ఉండలు..ఏ స్వీట్ అయినా దీని ముందు జుజుబీ..ఎలా చేసుకోవాలంటే..
మనందరి ఇళ్లలో సాయంత్రం వేళల్లో పిల్లలు ఇష్టంగా తినేందుకు రకరకాల స్నాక్స్ తయారు చేస్తుంటారు. వాటిలో తీపి వంటకాలకు ఉండే స్థానం ప్రత్యేకం. అలాంటి కోవకే చెందింది ఈ వేరుశెనగ ఉండ. దీనిని పల్లీ ఉండ అని కూడా పిలుస్తారు. పల్లీ ఉండ పేరు వినగానే చాలు, చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చి అందరి నోళ్లలో నీళ్లూరుతాయి. ఈ రోజుకీ బేకరీలు, చిన్న చిన్న షాపులల్లో గాజు సీసాలలో భద్రంగా కనిపించే ఈ వేరుశెనగ, బెల్లం ఉండలు పిల్లలను ఎంతగానో ఆకర్షిస్తాయి. కేవలం రుచిలోనే కాదు, ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది.
వేరుశెనగలోని ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి శక్తినివ్వగా.. బెల్లంలోని ఐరన్ రక్తహీనతను దూరం చేస్తుంది. ఇది పిల్లలకు ఎలాంటి దుష్ప్రభావాలు లేని ఒక సంపూర్ణమైన, బలవర్థకమైన ఆహారం. పైగా దీనిని ఒకసారి చేసి పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ అద్భుతమైన, కరకరలాడే పల్లీ ఉండలను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
పల్లీ ఉండలు తయారీకి కావాల్సిన పదార్థాలు
వేరుశెనగలు (పల్లీలు) - 2 కప్పులు
తురిమిన బెల్లం - 1 కప్పు
నెయ్యి - 2 టీస్పూన్లు
నీళ్లు - పావు కప్పు
పల్లీ ఉండలు తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద ఒక మందపాటి పాన్ పెట్టి, తక్కువ మంట మీద వేరుశెనగలను దోరగా, మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. అవి చల్లారిన తర్వాత పొట్టు తీసి, ప్రతీ గింజను రెండు బద్దలుగా చేసుకోవాలి.
-ఇప్పుడు మరొక పాత్రను స్టవ్ మీద పెట్టి అందులో తురిమిన బెల్లం, పావు కప్పు నీళ్లు పోసి కరిగించాలి. బెల్లం పూర్తిగా కరిగాక దానిని వడకట్టి మళ్లీ అదే పాత్రలో పోసి పాకం పట్టాలి. ఇందులో ఒక టీస్పూన్ నెయ్యి వేసి కలపాలి.
-పాకం చిక్కబడుతున్నప్పుడు దానిని పరీక్షింఛాలి. ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో ఈ పాకం చుక్క వేస్తే అది కరిగిపోకుండా గట్టి ఉండలా మారాలి (దీనిని ఉండ పాకం అంటారు). అప్పుడే పాకం సరైన దశకు వచ్చినట్లు.
-పాకం సిద్ధమవ్వగానే వెంటనే స్టవ్ ఆపి అందులో వేయించి పెట్టుకున్న పల్లీలను వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. బెల్లం పాకం పల్లీలకు పూర్తిగా పట్టేలా కలపాలి.
-ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే, చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని, కావలసిన పరిమాణంలో గట్టిగా నొక్కుతూ ఉండలుగా చుట్టుకోవాలి. పూర్తిగా చల్లారితే ఉండలు చుట్టడం కష్టమవుతుంది.
-అంతే కరకరలాడే తియ్యటి వేరుశెనగ ఉండలు రెడీ. వీటిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే నెల రోజులైనా ఫ్రెష్ గా ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications









