Latest Updates
-
తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.! -
లంచ్ తర్వాత విపరీతంగా నిద్ర మత్తు.. వీటిని అలవాటు చేసుకుంటే ఇక కునుకు మాటే ఉండదు.! -
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక
మిగిలిన అన్నంతో 10 నిమిషాల్లోనే మెత్తని పూరీలు..ఆంధ్రా స్పెషల్ కూరతో తింటే స్వర్గమే..ఎలా చేసుకోవాలంటే
ఇళ్లల్లో అన్నం మిగిలిపోవడం అనేది సర్వసాధారణం. చాలామంది ఈ మిగిలిపోయిన అన్నాన్ని పడేస్తుంటారు లేదా చద్దన్నంగా తింటుంటారు. మరికొందరు అయితే రుచికరమన పకోడీ, వడలు వంటివి కూడా తయారుచేస్తుంటారు. అయితే మిగిలిపోయిన అన్నాన్ని ఉపయోగించి ఎంతో రుచికరమైన పూరీలను తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? ఎప్పుడూ ఒకే రకమైన టిఫిన్స్ కాకుండా మిగిలిపోయిన అన్నంతో పూరీలు చేయడం వల్ల ఆహారంలో వైవిధ్యాన్ని తీసుకురావచ్చు. మిగిలిపోయిన అన్నంతో చేసే పూరీలు..సాధారణ పూరీలకు భిన్నమైన రుచిని, మెత్తదనాన్ని అందిస్తుంది.
టేస్ట్ అద్భుతంగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. మరోవైపు, ఇది ఆహారాన్ని వృథా చేయకుండా ఉంటుంది. ఈ రెసిపీ చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అన్నం ఇప్పటికే ఉడికినందున పిండి కలపడం, వేయించడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. ఇది పొద్దున్నే బ్రేక్ ఫాస్గ్ గా అయినా లేదా అకస్మాత్తుగా వచ్చే అతిథులకు త్వరగా సిద్ధం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. మిగిలిపోయిన అన్నంతో పూరీలు ఎలా చేయాలో ఇక్కడ చూడండి.

మిగిలిపోయిన అన్నంతో పూరీ తయారీకి కావాల్సిన
పదార్థాలు
-అన్నం
-ఆయిల్
-ఉప్పు
-గోధుమ పిండి
మిగిలిపోయిన అన్నంతో పూరీ తయారీ విధానం
-ముందుగా మిక్సీ గిన్నెలొ 1 కప్పు మిగిలిపోయిన అన్నం వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
-గ్రైండ్ చేసిన అన్నం మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసుకోండి. ఇందులోనే అన్నం తీసుకున్న కప్పుతోనే 1 కప్పు గోధుమ పిండి వేయండి..కొద్దిగా ఉప్పు,2 టేబుల్ స్పూన్ల నూనె, కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తం కలిసేలా కలుపుకోండి. మిశ్రమం కొంచెం గట్టిగా ఉండేలానే కలుపుకోవాలి.
-కలిపిన మిశ్రమన్ని పావు గంట సేపు పక్కన ఉంచేయాలి.
-తర్వాత కలిపిన పిండి మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని పూరీ కర్రతో వత్తుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద బాండీలో పూరీలను వేయించడానికి సరిపడా ఆయిల్ వేసి వేడి చెయ్యాలి.
-ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్క పూరీను అందులో వేసి గరిటతో ఆయిల్ ని దానిమీదకు నెడుతూ మంచిగా పొంగనిచ్చి దించేయాలి.
-ఓ ప్లేట్ లో టిష్యూ పేపర్లు పెట్టి దానిమీద పూరీలను వేయండి. దీంతో అది అదనపు నూనెను పీల్చుకుటుంది. అంతే మిగిలిపోయిన అన్నంతో టేస్టీ పూరీ రెడీ.
-దీనిని ఆంధ్రా స్టైల్ పూరీ కురతో తిన్నా, తెలంగాణ స్టైల్ పూరీ కూరతో తిన్నా నోటికి స్వర్గమే. కొంతమందికి, ముఖ్యంగా పెద్దలకు చద్దన్నం లేదా పులిసిన అన్నం జీర్ణక్రియకు మంచిదని చెబుతారు. మిగిలిపోయిన అన్నాన్ని పూరీలలో ఉపయోగించడం వల్ల సులభంగా జీర్ణం అవుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications