Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
మన పూర్వీకులు తిన్నది ఇదే..చుక్క ఆయిల్ అక్కర్లేదు,బరువు కూడా తగ్గొచ్చు..ఎలా చేసుకోవాలంటే
రాగి పిండితో అనేక రకాల వంటకాలు తయారుచేస్తుంటారు. సాధారణంగా మనోళ్లు రాగి ఉప్మా, రాగి సంగటి, రాగి జావ వంటివి ఎక్కువగా తయారుచేస్తుంటారు. అయితే మీరెప్పుడైనా రాగి ధలియా తిన్నారా?సామ బియ్యం, రాగి పిండితో కలిపి తయారుచేసే ఈ వంటకం చాలా రుచికరంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా అనేక రకాలుగా ఇది మేలు చేస్తుంది. బీపీ, షుగర్ ఉన్నోళ్లకు ఇది మంచి ఫుడ్. అలాగే బరువు తగ్గాలనుకునేవాళ్లకి కూడా ఇది బెస్ట్ ఫుడ్. రాగి ధలియాను ఇంట్లోనే తయారుచేసుకోడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
రాగి ధలియా తయారీకి కావలసిన పదార్థాలు
-రాగి పిండి
-సామ బియ్యం
-పొడి కందులు
-జీలకర్ర
-ధనియాలు
-పచ్చిమిర్చి
-తోటకూర
-ఉప్పు
-కరివేపాకు
-వెల్లుల్లి
-పల్లీలు
-నీరు
-నిమ్మరసం
-నెయ్యి
-ముందుగా 3 స్పూన్ల సామ బియ్యం నానబెట్టుకోవాలి.
-తర్వాత ఓ కప్పులో 3 టేబుల్ స్పూన్ల రాగి పిండి వేసి జారుగా ఉండేలా ఇందులో నీళ్లు పోసి కలిపి 15 నిమిషాలు నానబెట్టుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద బాండీ లేదా పాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి లో ఫ్లేమ్ మీద వేయించి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు అదే పాన్ లో 3 టేబుల్ స్పూన్ల పొడి కందులు వేసి లో ప్లేమ్ మీద వేయించి అందులోనే 1 టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ ధనియాలు, 1 రెబ్బ కరివేపాకు వేసి, 4 వెల్లుల్లి రెబ్బలు వేసి 2 నిమిషాలు వేయించుకొని మొత్తం చల్లారక వీటిని మిక్సీలో వేసి ముందు వేయించిన పల్లీలు కూడా వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకొని పక్కనపెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి అందులో 300 ml నీళ్లు పోసి మరిగించాక అందులో అర చెంచా జీలకర్ర, 2 గంటలు నానబెట్టిన 3 చెంచాల సామ బియ్యం, 1 పచ్చిమిర్చి తరుగు, 1 కట్ట తోటకూర తరుగు వేసి కలిపి మూతపెట్టి 3-4 నిమిషాలు ఉడికించుకోవాలి.
-తర్వాత మూత తీసి అందులో రాగిపిండి మిశ్రమాన్ని పోసి బాగా కలిపి 3 నిమిషాలు ఉడకనివ్వాలి. కాస్త దగ్గరపడ్డాక అందులో మిక్సీలో వేసి చేసుకున్న పొడి వేస మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి మూతపెట్టి లో ప్లేమ్ మీద 3-4 నిమిషాలు అది మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి.
-తర్వాత మూతతీసి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, అరచెక్క నిమ్మరసం పిండి కలుపుకొని దించేసుకోవాలి. అంతే రాగి ధలియా రెడీ
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications







