Latest Updates
-
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి!
మన పూర్వీకులు తిన్నది ఇదే..చుక్క ఆయిల్ అక్కర్లేదు,బరువు కూడా తగ్గొచ్చు..ఎలా చేసుకోవాలంటే
రాగి పిండితో అనేక రకాల వంటకాలు తయారుచేస్తుంటారు. సాధారణంగా మనోళ్లు రాగి ఉప్మా, రాగి సంగటి, రాగి జావ వంటివి ఎక్కువగా తయారుచేస్తుంటారు. అయితే మీరెప్పుడైనా రాగి ధలియా తిన్నారా?సామ బియ్యం, రాగి పిండితో కలిపి తయారుచేసే ఈ వంటకం చాలా రుచికరంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా అనేక రకాలుగా ఇది మేలు చేస్తుంది. బీపీ, షుగర్ ఉన్నోళ్లకు ఇది మంచి ఫుడ్. అలాగే బరువు తగ్గాలనుకునేవాళ్లకి కూడా ఇది బెస్ట్ ఫుడ్. రాగి ధలియాను ఇంట్లోనే తయారుచేసుకోడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
రాగి ధలియా తయారీకి కావలసిన పదార్థాలు
-రాగి పిండి
-సామ బియ్యం
-పొడి కందులు
-జీలకర్ర
-ధనియాలు
-పచ్చిమిర్చి
-తోటకూర
-ఉప్పు
-కరివేపాకు
-వెల్లుల్లి
-పల్లీలు
-నీరు
-నిమ్మరసం
-నెయ్యి

-ముందుగా 3 స్పూన్ల సామ బియ్యం నానబెట్టుకోవాలి.
-తర్వాత ఓ కప్పులో 3 టేబుల్ స్పూన్ల రాగి పిండి వేసి జారుగా ఉండేలా ఇందులో నీళ్లు పోసి కలిపి 15 నిమిషాలు నానబెట్టుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద బాండీ లేదా పాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి లో ఫ్లేమ్ మీద వేయించి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు అదే పాన్ లో 3 టేబుల్ స్పూన్ల పొడి కందులు వేసి లో ప్లేమ్ మీద వేయించి అందులోనే 1 టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ ధనియాలు, 1 రెబ్బ కరివేపాకు వేసి, 4 వెల్లుల్లి రెబ్బలు వేసి 2 నిమిషాలు వేయించుకొని మొత్తం చల్లారక వీటిని మిక్సీలో వేసి ముందు వేయించిన పల్లీలు కూడా వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకొని పక్కనపెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి అందులో 300 ml నీళ్లు పోసి మరిగించాక అందులో అర చెంచా జీలకర్ర, 2 గంటలు నానబెట్టిన 3 చెంచాల సామ బియ్యం, 1 పచ్చిమిర్చి తరుగు, 1 కట్ట తోటకూర తరుగు వేసి కలిపి మూతపెట్టి 3-4 నిమిషాలు ఉడికించుకోవాలి.
-తర్వాత మూత తీసి అందులో రాగిపిండి మిశ్రమాన్ని పోసి బాగా కలిపి 3 నిమిషాలు ఉడకనివ్వాలి. కాస్త దగ్గరపడ్డాక అందులో మిక్సీలో వేసి చేసుకున్న పొడి వేస మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి మూతపెట్టి లో ప్లేమ్ మీద 3-4 నిమిషాలు అది మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి.
-తర్వాత మూతతీసి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, అరచెక్క నిమ్మరసం పిండి కలుపుకొని దించేసుకోవాలి. అంతే రాగి ధలియా రెడీ
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications