Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
రాగి గోధుమ దోస హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ ఫాస్ట్
Ragi Godhi Dosa Recipe రోజు ప్రారంభించడానికి ముందు ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ చాలా ముఖ్యం. అందుకోసం వివిధ రకాల బ్రేక్ ఫాస్ట్ లు తయారుచేసుకుంటాం. రోజూ ఒకే రకమైన అల్పాహారాలు బోరు అనిపిస్తాయి. కాస్త భిన్నంగా తినాలంటే అప్పుడప్పుడు మెనూ మార్చాలి. అలాంటి బ్రేక్ ఫాస్ట్ మెనులో రాగి గోధుమ దోసె ఒకటి.
ఇది పులియబెట్టిన రాగి గోధుమ దోస మరియు రాగి పిండి, గోధుమ పిండి, ఉద్ది పప్పు, మెంతి గింజలు మరియు అటుకులు ఉపయోగించి తయారుచేస్తారు. ఈ రెసిపీని ఉపయోగించి లేదా ఈ పిండిని ఉపయోగించి మనం క్రిస్పీ మరియు సాఫ్ట్ దోసెలను తయారు చేసుకోవచ్చు. రాగి మరియు గోధుమ దోసను కొబ్బరి చట్నీ లేదా సాంబార్తో వడ్డించవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఈ రాగి గోధుమ దోసె హెల్తీగా ఎలా తయారుచేయాలో ఇక్కడ తెలుసుకోండి. రుచి చూసి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి.

కావలసిన పదార్థాలు:
1 కప్పు రాగి పిండి
1 కప్పు గోధుమ పిండి
1/2 కప్పు ఉద్దిపప్పు
1 tsp మెంతులు
1/4 కప్పు గట్టి అటుకులు
దోసె చేయడానికి నెయ్యి లేదా నూనె
2 కప్పుల నీరు (పిండిని కలుపుకోవడానికి)
రుచికి సరిపడా ఉప్పు.
రాగి గోధి దోస ఎలా తయారు చేయాలి:
1. ముందుగా ఒక పాత్రలో ఉద్ది పప్పు, అటుకులు , మెంతులూ కడిగి 3 - 4 గంటలు నాననివ్వాలి.
2. తర్వాత పప్పు గ్రైండ్ చేయడానికి ముందు, మరొక పాత్రలో రాగి పిండి మరియు గోధుమ పిండిని తీసుకోండి.
3. ఇప్పుడు అందులో కావలసినన్ని నీళ్లు పోసి ఉంటలు లేకుండా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.
4. తర్వాత ముందుగా నానబెట్టిన ఉద్ది పప్పు, అటుకులు, మెంతులు మిక్సీలో తీసుకుని అవసరమైనంత నీరు పోసి గ్రైండ్ చేసుకోవాలి.
5. మెత్తగా రుబ్బిన తర్వాత ఈ పిండిని, రాగి మరియు గోధుమ పిండి మిశ్రమం ఉన్న గిన్నెలో వేయాలి.
6. ఈ మొత్తం పిండిని బాగా కలపండి, మూత మూసివేసి, పిండిని 8-10 గంటలు పులియనివ్వండి.
7. పులియబెట్టిన తర్వాత పిండిలో రుచికి ఉప్పు వేసి బాగా కలపాలి. దోసె పిండి లాగా ఉండనివ్వండి.
8. దోస పాన్ వేడి చేయండి. నూనె రాసి పిండి పోసి దోసె చేసుకోవాలి.
9. మూత మూసివేసి ఉడికించాలి.
10 మూత తీసి నూనె లేదా నెయ్యి వేయాలి. దోసె ఒకవైపు సరిపోతుంది. కొబ్బరి చట్నీ లేదా సాంబార్తో సర్వ్ చేయండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications