Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
ఇవి తింటే కొండంత బలం..వినాయకుడికి కూడా ఇష్టమైన వంటకం..ఎలా చేసుకోవాలంటే
రాగి లేదా మిల్లెట్.. మన పూర్వీకులు తరచుగా తమ ఆహారంలో ఉపయోగించే ఒక శక్తివంతమైన ధాన్యం. ఇది కేవలం రుచిలో మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ రోజుల్లో రాగిని మళ్లీ ఆహారంలో భాగంగా చేసుకోవడం ఒక ఆరోగ్యకరమైన అలవాటుగా మారింది. రాగి పిండితో చేసే కుడుములు లేదా కజ్జికాయలు ఒక అద్భుతమైన అల్పాహారం లేదా స్నాక్ గా ఉపయోగపడతాయి. వీటిని తినడం వల్ల ఐరన్, కాల్షియం, పొటాషియం అందించి ఎముకల బలాన్ని పెంచి రక్తహీనతను పొగొడతాయి.
ఇవి పండుగలకు, ప్రత్యేక సందర్భాలకు కూడా సరైనవి. వినాయకచవితి రోజున స్వామికి నైవేద్యంగా కూడా వీటిని సమర్పిస్తారు. పండుగలకే కాకుండా సాధారణ రోజుల్లో కూడా ఈ ఆరోగ్యకరమైన వంటకాన్ని తయారుచేసుకుని ఆస్వాదించండి. రాగి కుడుములు ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

రాగికుడుములు తయారీకి కావాల్సిన పదార్థాలు
-రాగిపిండి
-బెల్లం
-ఉప్పు
-నెయ్యి
-వేయించిన నువ్వులు
-వేయించిన పల్లీలు
-జీడిపప్పు
-పచ్చి కొబ్బరి తురుము
-వేయించిన శెనగపప్పు
రాగి కుడుములు తయారీ విధానం
-ముందుగా మిక్సీ జార్ లో అర కప్పు వేయించిన నువ్వులు, వేయించి పొట్టు తీసిన అరకప్పు పల్లీలు, వేయించిన శెనగపప్పు వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి వేడి చేసి అందులో గ్రైండ్ చేసిన పొడిని, 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 2 కప్పుల బెల్లం తురుము వేసి తక్కువ మంట మీద 5 నిమిషాలు వేయించుకోవాలి.
-బెల్లం కరిగి కాస్త ముద్దయ్యాక అందులో1 టేబుల్ స్పూన్ నెయ్యి, వేయించిన జీడిపప్పు,గసగసాలు వేసి కలిపి మిశ్రమాన్ని పక్కన పెట్టి చల్లారనివ్వాలి.
-తర్వాత స్టవ్ మీద మరో కడాయి పెట్టి అందులో 1కప్పు నీళ్లు పోసి వేడి చేసి అందులో 1 స్పూన్ బెల్లం, కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ నెయ్యి వేసి వేడి చేశాక అందులో 1కప్పు రాగిపిండి వేసి తక్కువ మంటమీద కలుపుతూ 2 నిమిషాలు ఉడికించాలి.
-పిండి ఉండలు కట్టకుండా ఒక చెక్క గరిటెతో వేగంగా కలుపుతూ ఉండాలి. పిండి అంతా నీళ్లను పీల్చుకుని ఒక ముద్దలా మారిన తర్వాత స్టవ్ ఆపేయాలి.
-ఉడికించిన మిశ్రమం చల్లారాకా దానిని చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి. ఆ బాల్స్ ను కజ్జికాయల్లా వత్తుకొని దాని మధ్యలో ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న నువ్వులు,కొబ్బరి మిశ్రమాన్ని కొంచెం మధ్యలో పెట్టాలి. దాని అంచులను జాగ్రత్తగా మూసి,కుడుము ఆకారం (ముద్ద ఆకారం) లేదా కజ్జికాయ ఆకారం (అర్ధచంద్రాకారం) ఇవ్వాలి.
-అన్నింటిని ఇలాగే తయారుచేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి.
- తర్వాత వీటన్నింటిని ఇడ్లీ పాత్రలో పెట్టి 15 నిమిషాలు ఉడికించాలి. అంతే రాగి కుడుములు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications