Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
రాయలసీమ ఎగ్ కారం దోశ..జిందగీలో మర్చిపోలేని టేస్ట్,రోజూ ఇదే కావాలంటారు..ఎలా చేసుకోవాలంటే
దక్షిణ భారతదేశంలో దోశ ఒక ప్రముఖ బ్రేక్ ఫాస్ట్. ఇది రుచికి, పోషక విలువలకు ప్రసిద్ధి చెందింది. దోశలో అనేక రకాలున్నాయి వాటిలో ఎగ్ కారం దోశ ఒక ప్రత్యేకమైన వంటకం. ఇది దోశ పిండికి గుడ్డు, కారం పొడి, ఇతర మసాలాలు కలిపి తయారుచేయబడుతుంది. ఎగ్ కారం దోశ రుచిగా ఉండటమే కాకుండా పోషక విలువలు కూడా ఎక్కువగా ఉంటాయి. రాయలసీమ స్టైల్ లో ఎగ్ కారం దోశ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
ఎగ్ కారం దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు
-మినపప్పు
-దోశల బియ్యం
-అటుకులు
-మెంతులు
-ఉప్పు
-వెల్లుల్లి రెబ్బలు
-ఎండుమిర్చి
-చింతపండు
-ఆయిల్
-కోడిగుడ్డు
ఎగ్ కారం దోశ తయారీ విధానం
-ముందుగా 1 కప్పు మినపప్పు, 2.5 కప్పుల దోశల బియ్యం, అరకప్పు అటుకులు, 1 టీస్పూన్ మెంతులను కడిగి విడిగా కనీసం నాలుగు గంటలు నానబెట్టుకోవాలి.
-తర్వాత వీటన్నింటిని మిక్సీ గిన్నెలో వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని కనీసం 12 గంటలు పులియబెట్టాలి.
-తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసి కలిపి పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో 100 గ్రాముల ఎండుమిర్చి వేసి ఇందులోనే నిమ్మపండు సైజు అంత చింతపండు, 15 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా కల్లు ఉప్పు,కొంచెం నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
టేస్టీ సొరకాయ హల్వా..ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే..ఎలా చేసుకోవాలంటే
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి 75ml ఆయిల్ పోసి వేడి చేసి అందులో అర టీస్పూన్ ఆవాలు, రెండు రెబ్బల కరివేపాకు, మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఎర్ర కారం వేసి చట్నీని నూనె పైకి తేలేంతవరకు కలుపుతూ వేయించాలి.
-తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి వేడి చేసి మంట తగ్గించి దానిమీద పెద్ద గరిటతో పిండిని తీసుకొని దోశను పోయండి.
-దోశమీద ,దోశ అంచుల వెంట 2.5 టీస్పూన్ల ఆయిల్ పోసుకోండి. తర్వాత అట్టు మధ్యలో కొంచెం కారం చట్నీ, తర్వాత ఎగ్ కొట్టి వేసి దానిని బాగా పరిచి రెండు వైపులా బాగా కాల్చాలి. అంతే ఎగ్ కారం దోశ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications











