Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
రాయలసీమ ఎగ్ కారం దోశ..జిందగీలో మర్చిపోలేని టేస్ట్,రోజూ ఇదే కావాలంటారు..ఎలా చేసుకోవాలంటే
దక్షిణ భారతదేశంలో దోశ ఒక ప్రముఖ బ్రేక్ ఫాస్ట్. ఇది రుచికి, పోషక విలువలకు ప్రసిద్ధి చెందింది. దోశలో అనేక రకాలున్నాయి వాటిలో ఎగ్ కారం దోశ ఒక ప్రత్యేకమైన వంటకం. ఇది దోశ పిండికి గుడ్డు, కారం పొడి, ఇతర మసాలాలు కలిపి తయారుచేయబడుతుంది. ఎగ్ కారం దోశ రుచిగా ఉండటమే కాకుండా పోషక విలువలు కూడా ఎక్కువగా ఉంటాయి. రాయలసీమ స్టైల్ లో ఎగ్ కారం దోశ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
ఎగ్ కారం దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు
-మినపప్పు
-దోశల బియ్యం
-అటుకులు
-మెంతులు
-ఉప్పు
-వెల్లుల్లి రెబ్బలు
-ఎండుమిర్చి
-చింతపండు
-ఆయిల్
-కోడిగుడ్డు

ఎగ్ కారం దోశ తయారీ విధానం
-ముందుగా 1 కప్పు మినపప్పు, 2.5 కప్పుల దోశల బియ్యం, అరకప్పు అటుకులు, 1 టీస్పూన్ మెంతులను కడిగి విడిగా కనీసం నాలుగు గంటలు నానబెట్టుకోవాలి.
-తర్వాత వీటన్నింటిని మిక్సీ గిన్నెలో వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని కనీసం 12 గంటలు పులియబెట్టాలి.
-తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసి కలిపి పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో 100 గ్రాముల ఎండుమిర్చి వేసి ఇందులోనే నిమ్మపండు సైజు అంత చింతపండు, 15 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా కల్లు ఉప్పు,కొంచెం నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
టేస్టీ సొరకాయ హల్వా..ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే..ఎలా చేసుకోవాలంటే
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి 75ml ఆయిల్ పోసి వేడి చేసి అందులో అర టీస్పూన్ ఆవాలు, రెండు రెబ్బల కరివేపాకు, మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఎర్ర కారం వేసి చట్నీని నూనె పైకి తేలేంతవరకు కలుపుతూ వేయించాలి.
-తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి వేడి చేసి మంట తగ్గించి దానిమీద పెద్ద గరిటతో పిండిని తీసుకొని దోశను పోయండి.
-దోశమీద ,దోశ అంచుల వెంట 2.5 టీస్పూన్ల ఆయిల్ పోసుకోండి. తర్వాత అట్టు మధ్యలో కొంచెం కారం చట్నీ, తర్వాత ఎగ్ కొట్టి వేసి దానిని బాగా పరిచి రెండు వైపులా బాగా కాల్చాలి. అంతే ఎగ్ కారం దోశ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications