Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
అనుకోకుండా అతిథులు వచ్చారా? 15 నిమిషాల్లో ఘీ మటర్ రైస్ చేసి పెట్టండి, ఫిదా అయిపోతారు!
మీ ఇంటికి ఎప్పుడైనా అనుకోకుండా అతిథులు వచ్చారా? లేదా పండుగలు, సెలవు దినాల్లో కుటుంబ సభ్యుల కోసం ఏదైనా స్పెషల్ గా వండాలనుకుంటున్నారా? రోజూ తినే మామూలు అన్నం కాకుండా, చూస్తేనే తినాలనిపించేలా, తింటే వహ్వా అనిపించేలా ఉండే వంటకం కోసం మీరు వెతుకుతున్నట్లయితే ఘీ మటర్ రైస్ బెస్ట్ ఆప్షన్(నెయ్యి బఠానీ అన్నం).
తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో తయారయ్యే ఈ వంటకం రుచిలో మాత్రం ఏదో ఖరీదైన హోటల్ లో లభించే రాజభోజనంలా ఉంటుంది. ఇది కేవలం రుచికరమైనది మాత్రమే కాదు, పోషక విలువలు నిండినది కూడా. పచ్చి బఠానీలలో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా శీతాకాలంలో దొరికే తాజా బఠానీలతో చేస్తే దీని రుచి రెట్టింపు అవుతుంది. ఘీ మటర్ రైస్ ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
బాస్మతి బియ్యం: 1 కప్పు
పచ్చి బఠానీలు: అర కప్పు
స్వచ్ఛమైన నెయ్యి: 2-3 టేబుల్ స్పూన్లు
బిర్యానీ ఆకు: 1
యాలకులు: 2
లవంగాలు: 4
దాల్చిన చెక్క ముక్క: చిన్న ముక్క
మిరియాల పొడి: కొద్దిగా
ఉప్పు: కొద్దిగా
జీడిపప్పు,బాదం: కొద్దిగా
నీరు: 2 కప్పులు
తయారీ విధానం
-ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి సుమారు 20 నుండి 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టండి.
-ఒక మందపాటి పాన్ లేదా కుక్కర్ తీసుకుని అందులో నెయ్యి వేడి చేయండి. నెయ్యి కరిగాక బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించండి. ఆ వెంటనే జీడిపప్పు, బాదం పలుకులు కూడా వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించండి.
-ఇప్పుడు పచ్చి బఠానీలను ఆ నేతిలో వేయండి. సుమారు 2-3 నిమిషాల పాటు బఠానీలను నేతిలో వేయించడం వల్ల అవి మృదువుగా మారి, నెయ్యి రుచిని గ్రహిస్తాయి.
-నానబెట్టిన బియ్యం నుండి నీటిని పూర్తిగా వడకట్టి, బియ్యాన్ని పాన్ లో వేయండి. రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు మిరియాల పొడి వేసి, బియ్యం విరిగిపోకుండా చాలా నెమ్మదిగా కలపండి.
-ఇప్పుడు 2 కప్పుల నీరు పోసి (లేదా మీ బియ్యానికి సరిపడా)ఒకసారి కలిపి మూత పెట్టండి. మంటను తక్కువలో ఉంచి ఉడికించండి. నీరంతా ఆవిరైపోయి, అన్నం 90 శాతం ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి, మూత తీయకుండా మరో 5 నిమిషాలు అలాగే ఉంచండి. దీనివల్ల అన్నం చక్కగా మగ్గుతుంది.
-వేడివేడి ఘీ మటర్ రైస్ ను ప్లేట్ లోకి తీసుకుని పక్కన దాల్ తడ్కా, వెజ్ కుర్మా, పన్నీర్ బటర్ మసాలా లేదా చల్లటి పెరుగు రైతాతో వడ్డించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












