Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్తో చపాతీ కంటే సాఫ్ట్గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అనుకోకుండా అతిథులు వచ్చారా? 15 నిమిషాల్లో ఘీ మటర్ రైస్ చేసి పెట్టండి, ఫిదా అయిపోతారు!
మీ ఇంటికి ఎప్పుడైనా అనుకోకుండా అతిథులు వచ్చారా? లేదా పండుగలు, సెలవు దినాల్లో కుటుంబ సభ్యుల కోసం ఏదైనా స్పెషల్ గా వండాలనుకుంటున్నారా? రోజూ తినే మామూలు అన్నం కాకుండా, చూస్తేనే తినాలనిపించేలా, తింటే వహ్వా అనిపించేలా ఉండే వంటకం కోసం మీరు వెతుకుతున్నట్లయితే ఘీ మటర్ రైస్ బెస్ట్ ఆప్షన్(నెయ్యి బఠానీ అన్నం).
తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో తయారయ్యే ఈ వంటకం రుచిలో మాత్రం ఏదో ఖరీదైన హోటల్ లో లభించే రాజభోజనంలా ఉంటుంది. ఇది కేవలం రుచికరమైనది మాత్రమే కాదు, పోషక విలువలు నిండినది కూడా. పచ్చి బఠానీలలో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా శీతాకాలంలో దొరికే తాజా బఠానీలతో చేస్తే దీని రుచి రెట్టింపు అవుతుంది. ఘీ మటర్ రైస్ ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
బాస్మతి బియ్యం: 1 కప్పు
పచ్చి బఠానీలు: అర కప్పు
స్వచ్ఛమైన నెయ్యి: 2-3 టేబుల్ స్పూన్లు
బిర్యానీ ఆకు: 1
యాలకులు: 2
లవంగాలు: 4
దాల్చిన చెక్క ముక్క: చిన్న ముక్క
మిరియాల పొడి: కొద్దిగా
ఉప్పు: కొద్దిగా
జీడిపప్పు,బాదం: కొద్దిగా
నీరు: 2 కప్పులు
తయారీ విధానం
-ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి సుమారు 20 నుండి 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టండి.
-ఒక మందపాటి పాన్ లేదా కుక్కర్ తీసుకుని అందులో నెయ్యి వేడి చేయండి. నెయ్యి కరిగాక బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించండి. ఆ వెంటనే జీడిపప్పు, బాదం పలుకులు కూడా వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించండి.
-ఇప్పుడు పచ్చి బఠానీలను ఆ నేతిలో వేయండి. సుమారు 2-3 నిమిషాల పాటు బఠానీలను నేతిలో వేయించడం వల్ల అవి మృదువుగా మారి, నెయ్యి రుచిని గ్రహిస్తాయి.
-నానబెట్టిన బియ్యం నుండి నీటిని పూర్తిగా వడకట్టి, బియ్యాన్ని పాన్ లో వేయండి. రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు మిరియాల పొడి వేసి, బియ్యం విరిగిపోకుండా చాలా నెమ్మదిగా కలపండి.
-ఇప్పుడు 2 కప్పుల నీరు పోసి (లేదా మీ బియ్యానికి సరిపడా)ఒకసారి కలిపి మూత పెట్టండి. మంటను తక్కువలో ఉంచి ఉడికించండి. నీరంతా ఆవిరైపోయి, అన్నం 90 శాతం ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి, మూత తీయకుండా మరో 5 నిమిషాలు అలాగే ఉంచండి. దీనివల్ల అన్నం చక్కగా మగ్గుతుంది.
-వేడివేడి ఘీ మటర్ రైస్ ను ప్లేట్ లోకి తీసుకుని పక్కన దాల్ తడ్కా, వెజ్ కుర్మా, పన్నీర్ బటర్ మసాలా లేదా చల్లటి పెరుగు రైతాతో వడ్డించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications