Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
ఇడ్లీ, దోశ, అన్నం దేనికైనా సరే ఈ ఒక్క చట్నీ చాలు.. నెల రోజులు నిల్వ ఉంటుంది
ఉదయం టిఫిన్ లోకి కాస్త భిన్నంగా, కారంగా, పుల్లగా, తియ్యగా.. ఇలా అన్ని రుచుల సమ్మేళనంతో నోరూరించే కారం చట్నీని ప్రయత్నించండి. ఇది కేవలం రుచిలోనే కాదు, నిల్వ ఉండటంలోనూ దీనికి సాటి లేదు. ఈ చట్నీ పది రోజుల నుంచి నెల రోజుల వరకు తాజాగా ఉంటుంది.
ఈ చట్నీ ఇది వేడి వేడి ఇడ్లీ, మెత్తటి దోశలతోనే కాదు.. పూరీ, చపాతీ, ఊతప్పం వంటి వాటితో కూడా అద్భుతంగా ఉంటుంది. వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ చట్నీ కలుపుకుని తిన్నా అద్భుతంగా ఉంటుంది. కారం చట్నీ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
కారం తక్కువగా ఉండే కశ్మీరీ ఎండు మిరపకాయలు- 10
గుంటూరు మిర్చి- 10
చింతపండు - నిమ్మకాయంత
సాంబార్ ఉల్లిపాయలు- 25
వెల్లుల్లి రెబ్బలు - 20
నువ్వుల నూనె - రెండున్నర టేబుల్ స్పూన్లు
ఆవాలు - అర టీస్పూన్
మినపప్పు - అర టీస్పూన్
బెల్లం పొడి - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
వేడి నీళ్లు - అర కప్పు
తయారీ విధానం
-ముందుగా రెండు రకాల ఎండు మిరపకాయల తొడిమలు తీసి ఒక గిన్నెలోకి తీసుకోండి. అందులోనే చింతపండు కూడా వేసి అర కప్పు వేడి నీళ్లు పోసి పది నిమిషాల పాటు నానబెట్టండి.
-పది నిమిషాల తర్వాత నానబెట్టిన మిరపకాయలు, చింతపండును నీళ్లతో సహా మిక్సీ గిన్నెలో వేయండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా జతచేసి మెత్తని పేస్టులా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టి అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేసి వేడిచేయండి. నూనె వేడెక్కాక అందులో ఆవాలు వేయండి. అవి చిటపటలాడుతుండగా మినపప్పు కూడా వేసి దోరగా వేయించుకోవాలి.
-పోపు వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, సాంబార్ ఉల్లిపాయ ముక్కలు వేసి, పచ్చి వాసన పోయి బంగారు రంగులోకి మారేంత వరకు బాగా వేయించాలి.
-ఉల్లిపాయలు వేగాక అందులోనే ముందుగా గ్రైండ్ చేసుకున్న మిరపకాయల పేస్టును వేయండి. మిక్సీ జార్ లో కొద్దిగా నీళ్లు పోసి, దాన్ని కూడా కడాయిలో వేసి బాగా కలపాలి.
-ఇప్పుడు మూత పెట్టి మంటను తగ్గించి 5 నిమిషాల పాటు ఉడికించండి. తర్వాత మూత తీసి కలపండి. చట్నీలోని నీరంతా ఇగిరిపోయి, నూనె పైకి తేలుతున్నప్పుడు, బెల్లం పొడి వేసి కలపాలి. మరో ఐదు నిమిషాలు మూత లేకుండా ఉడికించాలి.
-చట్నీ చిక్కబడి మంచి పరిమళం వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. చివరగా మిగిలిన 1 టేబుల్ స్పూన్ పచ్చి నువ్వుల నూనెను పైన వేసి కలపండి. ఇది చట్నీకి అదనపు రుచిని, సువాసనను ఇవ్వడమే కాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి సహాయపడుతుంది.
-అంతే ఘుమఘుమలాడే కారం చట్నీ రెడీ. దీన్ని చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో భద్రపరుచుకుంటే నెల రోజుల పాటు దీని రుచిని ఆస్వాదించవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications