Latest Updates
-
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు!
సమీరా రెడ్డి చేసిన గోవా స్పెషల్ మ్యాంగో కొబ్బరి కర్రీ..అన్నంలోకి అమృతమే..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
ఎప్పుడూ తినేలా కాకుండా, ఈ వేసవిలో పండిన మామిడి పండ్లతో ఒక అద్భుతమైన వంటకాన్ని రుచి చూస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి ఒక అద్భుతమైన వంటకమే గోవా కొంకణి సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే ఘోటాచె ససావ్. దీనిని మామాడికాయ కొబ్బరి కర్రీ అని కూడా పిలుస్తారు. కొంకణి భాషలో ఘోటా అంటే అడవిలో దొరికే చిన్న సైజులో ఉండే పండిన మామిడి పండ్లు (రసాలు). ససావ్ అంటే ఆవాలు. ఆవాలు, కొబ్బరి ప్రధానంగా వాడతారు కాబట్టే దీనికి ఆ పేరు వచ్చింది. ఉల్లి, వెల్లుల్లి వాడకుండా కేవలం 30 నిమిషాల్లో దీన్ని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ నోరూరించే వంటకాన్ని ప్రముఖ నటి సమీరా రెడ్డి తన ఇన్ ప్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు.

బాలీవుడ్ తో పాటు దక్షిణాది సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సమీరా రెడ్డి.. ప్రస్తుతం గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉంటున్నారు. తన కుటుంబంతో కలిసి గోవాలో స్థిరపడిన ఆమె, ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సమీరా, బాడీ పాజిటివిటీ, మహిళల ఆత్మవిశ్వాసం పెంపొందించే మెసేజ్ లు ఇస్తుంటారు. అంతేకాకుండా, గోవా స్థానిక సంస్కృతిని, ఇలాంటి అద్భుతమైన వంటకాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అలా ఆమె పరిచయం చేసిన వంటకమే ఈ ఘోటాచె ససావ్.
మామిడికాయ కొబ్బరి కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు
-చిన్న సైజు పండిన మామిడి పండ్లు లేదా రసాలు
-పచ్చి కొబ్బరి
-ధనియాలు
-కరివేపాకు
-పసుపు
-కారం పొడి
-ఉప్పు
-ఆవాలు
-వంట నూనె
-నీళ్లు
మామిడికాయ కొబ్బరి కర్రీ తయారీ విధానం
-ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చి కొబ్బరి తురుము, కొద్దిగా ధనియాలు, చిటికెడు పసుపు, తగినంత కారం వేయండి. కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి బాండీ పెట్టి, కొద్దిగా నూనె వేడి చేయండి. నూనె వేడెక్కాక ఆవాలు వేసి చిటపటలాడనివ్వండి. ఆవాలు వేగిన తర్వాత కరివేపాకు వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించండి.
-ఇప్పుడు ముందుగానే తొక్క తీసి పెట్టుకున్న పండిన మామిడి పండ్లను అందులో వేయాలి. ఒక నిమిషం పాటు నూనెలో వాటిని మెల్లగా కలుపుతూ వేయించండి. ఆ తర్వాత అందులో పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. కొద్దిగా నీళ్లు పోసి, మూతపెట్టి మామిడి పండ్లు మెత్తబడే వరకు ఉడికించాలి.
-మామిడి పండ్లు ఉడికిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న కొబ్బరి పేస్ట్ ను అందులో వేసి బాగా కలపండి. తక్కువ మంట మీద మరో ఐదు నిమిషాల పాటు ఉడకనిస్తే చాలు.
-అంతే ఘుమఘుమలాడే గోవా స్పెషల్ మామిడికాయ కొబ్బరి కర్రీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications