Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
శ్రీరామనవమి స్పెషల్.. కేవలం 5 నిమిషాల్లో రాముడికి ఇష్టమైన పంచామృతం..ఎలా చేసుకోవాలంటే..
చైత్ర శుద్ధ నవమి అనగానే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది సీతారాముల కల్యాణం, శ్రీరాముని జన్మదినం. ఈ పవిత్రమైన రోజున దేశవ్యాప్తంగా రామనవమి పండుగను భక్తులు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా బాల రాముడు కొలువైన అయోధ్య నగరంలో నెలకొన్న ఉత్సాహం, పండుగ వాతావరణం కన్నుల పండువగా చూడముచ్చటగా ఉంటుంది.
శ్రీరామనవమి రోజున రాముడికి సమర్పించే అత్యంత ప్రధానమైన నైవేద్యం పంచామృతం. పంచామృతం అనగా అక్షరాలా ఐదు అమృతాల కలయిక. హిందూ పౌరాణిక గ్రంథాల ప్రకారం ఇందులో ఉపయోగించే ఐదు పదార్థాలు మానవ జీవితంలోని ఐదు విశిష్టమైన గుణాలకు ప్రతీకలుగా నిలుస్తాయి.

ఐదు అద్భుత మూలకాల కలయికతో తయారైన పంచామృతాన్ని దేవునికి భక్తితో నైవేద్యంగా సమర్పించడం వల్ల దేవతలు ప్రీతి చెందుతారు. అలాగే, ఈ ప్రసాదాన్ని భక్తులు స్వీకరించడం ద్వారా వారిలో పాజిటివ్ ఎనర్జీ వృద్ధి చెంది, జీవితంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని ప్రగాఢ విశ్వాసం. కేవలం ఐదు నిమిషాల్లో ఎంతో సులభంగా పంచామృతాన్ని ఎలా తయారు చేసుకోవచ్చో ఇక్కడ చూడండి.
పంచామృతం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు
పచ్చి ఆవు పాలు: 1 కప్పు
పెరుగు: అర కప్పు
స్వచ్ఛమైన తేనె: 1 టేబుల్ స్పూన్
ఆవు నెయ్యి: 1 టీస్పూన్
పంచదార లేదా పటిక బెల్లం: 2 టేబుల్ స్పూన్లు
తులసి ఆకులు: 5 నుంచి 7 వరకు
డ్రై ఫ్రూట్స్,మఖానా: తగినంత
పంచామృతం తయారీ విధానం
-పంచామృతం తయారీలో భక్తి, శుచి చాలా అవసరం. ముందుగా ఒక శుభ్రమైన పాత్రను తీసుకోండి. అందులో తాజా పెరుగు వేసి ఉండలు లేకుండా గరిటెతో తేలికగా చిలకాలి. ఆ తర్వాత అందులో పచ్చి ఆవు పాలు పోసి కలపాలి. ఇప్పుడు వరుసగా తేనె, పంచదార, స్వచ్ఛమైన నెయ్యి వేసి అన్నీ పాలల్లో బాగా కరిగేలా మిశ్రమాన్ని కలుపుకోవాలి. మరింత రుచి కోసం సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్, మఖానా ఇందులో కలుపుకోవచ్చు.
-ఇందులో అత్యంత ముఖ్యమైన ఘట్టం.. పవిత్రమైన తులసి ఆకులను వేయడం. హిందూ సంప్రదాయం ప్రకారం తులసి దళాలు లేని ఏ నైవేద్యాన్నీ శ్రీ మహావిష్ణువు స్వీకరించడు. శ్రీరాముడు సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తి అవతారమే కాబట్టి ఈ పంచామృతంలో తులసి ఆకులను తప్పనిసరిగా వేయాలి.
-అంతే దేవుడికి సమర్పించడానికి మధురమైన పంచామృతం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications