Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
రాఖీ స్పెషల్ కాలా జామున్..లొట్టలేసుకుంటూ తింటారు..ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
రక్షా బంధన్ లేదా రాఖీ పూర్ణిమ సోదర,సోదరిల అనుబంధానికి ప్రతీక. ఈ ఏడాది రాఖీ పండుగను ఆగస్టు 9న జరుపుకుంటారు. ఈ పండుగ రోజున సోదరి ప్రేమతో కట్టే రాఖీకి ప్రతిఫలంగా సోదరుడు ఇచ్చే బహుమతులు, మిఠాయిల పంపిణీ ఒక సంప్రదాయం. ఈ సందర్భంలో ఇంటిలో తయారు చేసుకునే రుచికరమైన మిఠాయిలలో కాలా జామున్ ప్రత్యేకమైనది. సాధారణ గులాబ్ జామున్ కి ఇది ఒక భిన్నమైన రకం. దీనిని తయారు చేయడం కొంచెం కష్టమే అయినప్పటికీ దాని రుచి అద్భుతంగా ఉంటుంది. రాఖీ సందర్భంగా మీ ఇంట్లోనే ఈ రుచికరమైన కాలా జామున్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి
కాలా జామున్ తయారీకి కావలసిన పదార్థాలు
-పచ్చి కోవా
-మైదా పిండి
-కార్న్ ఫ్లోర్
-జాపత్రి పొడి
-ఆయిల్
-జాజికాయ పొడి
-ఆరెంజ్ ఫుడ్ కలర్
-పాల పిండి

కాలా జామున్ తయారీ విధానం
-ముందుగా పాకం తయారుచేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ మీద పాన్ పెట్టి అందులో అరకేజీ చక్కెర, ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి ఆముదం లాంటి జిగురు పాకం వచ్చేదాకా కలుపుతూ మరిగించి దించేయాలి. దీనికి సుమారు 12-15 నిమిషాలు పడుతుంది.
-తర్వాత ఓ బౌల్ లో పావు కేజీ పచ్చి కోవా, 50 గ్రాముల మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, పావు టీస్పూన్ జాపత్రి పొడి, 1 టేబుల్ స్పూన్ పాల పండి, కొద్దిగా జాజికాయ పొడి, చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ లో 1 టీస్పూన్ నీళ్లు వేసి కరిగించిన నీరు వేసి మొత్తం కలిసేలా వత్తుకోవాలి.
-పిండి ముద్ద దగ్గరకి చేరిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ చొప్పున కోవా ముద్దను తీసుకొని పగుళ్లు లేకుండా నున్నగా రోల్స్ చేసుకోవాలి. ఇలాగే పిండి మొత్తాన్ని చేసుకోవాలి.
-తర్వాత గులాబ్ జాములు మునిగేంతవరకు నూనె పోసి వేడి చెయ్యాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మంటను సిమ్ లో పెట్టి రెడీ చేసుకున్న పిండి ముద్దలను వేసి వేయించాలి. అవి బంగారు రంగులోకి మారిన తర్వాత మంటను పెంచి చాక్లెట్ కలర్ లోకి వచ్చుదాకా వాటిని వేయించుకోవాలి. జామూన్స్ పైకి తేలేదాకా గరిట పెట్టకూడదు..లేకుంటే విరిగిపోతాయ్.
-చాక్లెట్ బ్రౌన్ కలర్ లో వేగిన జామూన్స్ ని బాండీలో నుంచి తీసి రెడీ చేసుకున్న పాకంలో వేసి లైట్ గా కలిపి ఒక గంట సేపు వదిలేయాలి. అప్పుడు అవి సిరప్ ను బాగా పీల్చుకుని, మరింత రుచికరంగా తయారవుతాయి. అంతే కాలా జామున్ రెడీ.
-పండుగ రోజున ఇంటిలో తయారు చేసిన కాలా జామున్ తినడం మనసుకి సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications