Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
దీపావళికి పొంగల్ ఇలా చేసుకోండి.. రుచి అదిరిపోతుంది.. ఎలా చేసుకోవాలంటే!
ఈ కార్తీక మాసంలో చాలా మంది మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సాంప్రదాయకమైన వంటలనే తింటూ ఉంటారు. కార్తీక మాసంలో పూజలో నైవేద్యం సమర్పించేందుకు వినియోగించడంతో పాటు వాటినే అల్పాహారంగా తింటూ ఉంటారు. అలాంటి వాటిల్లో ముఖ్యమైనది పొంగల్. చాలా ఇష్టంగా తినే ఈ పొంగల్ను ఇంట్లోనే ఎలా చేసుకోవాలి, ఇంట్లో చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఈ పొంగల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు
1. ఒక కప్పు రైస్
2. అర కప్పు పచ్చ పెసరపప్పు
3. ఒక టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు
4. రెండు పచ్చి మిర్చి
5. ఒక చిన్న అల్లం ముక్క పేస్ట్
6. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర
7. రెండు రబ్బల కరివేపాకులు
8. తగినంత జీడిపప్పు
9. 200 గ్రాముల నెయ్యి
10. తగినంత ఉప్పు

పొంగల్ తయారీ విధానం
ముందుగా ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకొని అందులో కొంత నెయ్యి వేసుకోవాలి. అలాగే కొంచెం నీళ్లు కూడా వేసుకొని రైస్, పచ్చ పెసర పప్పును కలిపి కొద్దీ సేపు పక్కకు నానబెట్టుకోవాలి. అవి నానాక.. అందులో రుచికి తగినంత ఉప్పు వేసుకొని.. కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి.
అనంతరం.. ఒక కడాయి తీసుకొని అందులో మిగిలిన నెయ్యిని వేసుకొని జీడిపప్పు, జీలకర్ర, నల్ల మిరియాలు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, కరివేపాకులు వేసుకోవాలి. వాటిని లేత బంగారు వర్ణంలో వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అనంతరం.. మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్లో జీడిపప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి. తరువాత ఆ జీడిపప్పు మిశ్రమంతో అన్నంని కలుపుకుంటే సరిపోతుంది పొంగల్ సిద్ధమైనట్లే.
ఆ వేడి వేడి పొంగల్ను ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని, పూజ చేసిన తరువాత నైవేద్యం సమర్పించి.. తరువాతం మనం తింటే ఆ రుచి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. వారు లొట్టలేసుకుని తినడంతో పాటు ఇంకోసారి కావాలి అని అడుగుతారు.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలన్నీ ఇంటర్నెట్లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటిని పాటించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది, అలాగే ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉండదు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications