Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
దీపావళికి పొంగల్ ఇలా చేసుకోండి.. రుచి అదిరిపోతుంది.. ఎలా చేసుకోవాలంటే!
ఈ కార్తీక మాసంలో చాలా మంది మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సాంప్రదాయకమైన వంటలనే తింటూ ఉంటారు. కార్తీక మాసంలో పూజలో నైవేద్యం సమర్పించేందుకు వినియోగించడంతో పాటు వాటినే అల్పాహారంగా తింటూ ఉంటారు. అలాంటి వాటిల్లో ముఖ్యమైనది పొంగల్. చాలా ఇష్టంగా తినే ఈ పొంగల్ను ఇంట్లోనే ఎలా చేసుకోవాలి, ఇంట్లో చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఈ పొంగల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు
1. ఒక కప్పు రైస్
2. అర కప్పు పచ్చ పెసరపప్పు
3. ఒక టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు
4. రెండు పచ్చి మిర్చి
5. ఒక చిన్న అల్లం ముక్క పేస్ట్
6. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర
7. రెండు రబ్బల కరివేపాకులు
8. తగినంత జీడిపప్పు
9. 200 గ్రాముల నెయ్యి
10. తగినంత ఉప్పు
పొంగల్ తయారీ విధానం
ముందుగా ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకొని అందులో కొంత నెయ్యి వేసుకోవాలి. అలాగే కొంచెం నీళ్లు కూడా వేసుకొని రైస్, పచ్చ పెసర పప్పును కలిపి కొద్దీ సేపు పక్కకు నానబెట్టుకోవాలి. అవి నానాక.. అందులో రుచికి తగినంత ఉప్పు వేసుకొని.. కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి.
అనంతరం.. ఒక కడాయి తీసుకొని అందులో మిగిలిన నెయ్యిని వేసుకొని జీడిపప్పు, జీలకర్ర, నల్ల మిరియాలు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, కరివేపాకులు వేసుకోవాలి. వాటిని లేత బంగారు వర్ణంలో వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అనంతరం.. మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్లో జీడిపప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి. తరువాత ఆ జీడిపప్పు మిశ్రమంతో అన్నంని కలుపుకుంటే సరిపోతుంది పొంగల్ సిద్ధమైనట్లే.
ఆ వేడి వేడి పొంగల్ను ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని, పూజ చేసిన తరువాత నైవేద్యం సమర్పించి.. తరువాతం మనం తింటే ఆ రుచి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. వారు లొట్టలేసుకుని తినడంతో పాటు ఇంకోసారి కావాలి అని అడుగుతారు.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలన్నీ ఇంటర్నెట్లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటిని పాటించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది, అలాగే ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉండదు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












