Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మేక పిచ్చల కూర..శక్తికి, తృప్తికి ఫర్ఫెక్ట్ రెసిపి,ఎలా చేసుకోవాలంటే..
మటన్ తో రకరకాల వెరైటీలు తయారుచేస్తుంటారు. మటన్ ఫ్రై, బోటీ, లివర్, తలకాయ, పాయ,మటన్ ముట్టీలు ఇలా ఇప్పటిదాకా అనేక రకాల వంటకాలను ఆస్వాదించి ఉంటారు. అయితే మీరు ఎప్పుడైనా మేక పిచ్చల కూర తిన్నారా? మేక పిచ్చల కూర అనేది తెలంగాణలో ఒక సాంప్రదాయ వంటకం. ఇది రుచికరమైనది మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. మేక పిచ్చలు ప్రోటీన్, ఐరన్, విటమిన్ B12 వంటి పోషకాలకు మంచి మూలం.
రోగనిరోధక శక్తిని, శరీరానికి కావలసిన శక్తిని అందించడంలో, రక్తహీనతను నివారించడంలో,ఎముకల ఆరోగ్యానికి మేలు చేయడంలో సహాయపడే మేక పిచ్చల కూరను ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకొని ఆస్వాదించవచ్చు. మేక పిచ్చల కూర తయారీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

మేక పిచ్చల కూర తయారీకి కావలసిన పదార్థాలు
మేక పిచ్చలు: 1 కేజీ
ఉల్లిపాయలు: 2
పచ్చిమిర్చి: 4
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2 టేబుల్ స్పూన్లు
టమోటాలు: 2
పసుపు: 1/2 టీ స్పూన్
కారం: 2 టీ స్పూన్లు
ధనియాల పొడి: 1 టీ స్పూన్
గరం మసాలా: 1/2 టీ స్పూన్
నూనె: 4 టేబుల్ స్పూన్లు
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర: కొంచెం
రంజాన్ స్పెషల్..దహీ చనా ఇలా చేసుకుంటే శరీరానికి కొత్త శక్తి,పూర్వీకుల్లా బలంగా ఉండొచ్చు
మేక పిచ్చల కూర తయారీ విధానం
-ముందుగా మేక పిచ్చలను శుభ్రంగా కడిగి, చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిని కొద్దిగా పసుపు, ఉప్పు వేసి ఉడికించుకోవాలి.
-తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేడి చేసి, ఉల్లిపాయ చీలికలు, పచ్చిమిర్చి చీలికలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
-తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
-సన్నగా తరిగిన టమోటా ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
-పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి.
-మసాలా నుండి నూనె వేరుపడే వరకు ఉడికించాలి.
- ఇప్పుడు ఉడికించిన పిచ్చల ముక్కలను మసాలాలో వేసి బాగా కలపాలి.
-తర్వాత కొద్దిగా నీరు పోసి, మూత పెట్టి 15-20 నిమిషాలు ఉడికించాలి. రుచికి తగినట్లుగా కారం, ఉప్పును సర్దుబాటు చేసుకోవచ్చు.
-నూనె పైకి తేలే వరకు ఉడికించాలి.
-చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications