Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
ఘుమఘుమలాడే గరం మసాలా..ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
భారతీయ వంటగదిలో మసాలా దినుసులకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. మన వంటకాల రుచి, సువాసన ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందడానికి ప్రధాన కారణం మనం వాడే ఈ మసాలాలే. వీటిలో గరం మసాలా రారాజు అని చెప్పవచ్చు. గరం అంటే వేడి అని, మసాలా అంటే దినుసుల మిశ్రమం అని అర్థం.
ఆయుర్వేదం ప్రకారం ఈ మసాలా శరీరంలో వేడిని పుట్టించి, జీవక్రియను మెరుగుపరుస్తుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. మార్కెట్లో దొరికే ప్యాకెట్ మసాలాల కంటే ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా తాజాదనంతో పాటు ఎక్కువ ఆరోగ్యాన్ని, రుచిని ఇస్తుంది. ఇంట్లోనే గరం మసాలా తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
ధనియాలు: అర కప్పు (50 గ్రా)
జీలకర్ర: పావు కప్పు
యాలకులు: 25
నల్ల యాలకులు: 5
లవంగాలు: 1 టేబుల్ స్పూన్
మిరియాలు: 1 టేబుల్ స్పూన్
దాల్చిన చెక్క: 3 అంగుళాల ముక్కలు 4-5
బిర్యానీ ఆకులు: 4-5
అనాస పువ్వు: 2
జాజికాయ: చిన్న ముక్క
జాపత్రి: 2-3 రేకలు
సోంపు: 1 టీస్పూన్
తయారీ విధానం
-ముందుగా మసాలా దినుసులన్నింటినీ శుభ్రం చేసుకోవాలి. రాళ్లు, మట్టి లేకుండా చూసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద మందపాటి బాండీ పెట్టి మంటను చాలా తక్కువలో ఉంచాలి. ముందుగా ధనియాలను వేసి 1-2 నిమిషాలు దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
-తర్వాత దాల్చిన చెక్క, నల్ల యాలకులు, అనాస పువ్వు, మిరియాలు, లవంగాలు వేసి వేయించాలి.
-చివరగా త్వరగా వేగిపోయే జీలకర్ర, పచ్చ యాలకులు, జాపత్రి, బిర్యానీ ఆకులను వేసి, సువాసన వచ్చే వరకు సుమారు 1 నిమిషం వేయించాలి. దినుసులను మాడనివ్వకూడదు. మాడితే మసాలా చేదుగా మారుతుంది. కేవలం వాటిలోని తేమ పోయి, నూనెలు బయటకు వచ్చేలా వేడెక్కితే చాలు.
-జాజికాయను వేయించాల్సిన అవసరం లేదు, దాన్ని చిన్న ముక్కలుగా చేసి నేరుగా గ్రైండర్ లో వేయవచ్చు.
-వేయించిన దినుసులన్నింటినీ ఒక ప్లేట్ లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.
-చల్లారిన దినుసులను మిక్సీ జార్ లో వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి. మధ్యలో ఆపి స్పూన్ తో కలుపుతూ గ్రైండ్ చేస్తే పొడి మెత్తగా వస్తుంది.
-మీకు బాగా మెత్తని పొడి కావాలంటే జల్లెడ పట్టవచ్చు. కాస్త బరకగా ఉంటేనే కూరల్లో రుచి బాగుంటుంది అనిపిస్తే అలాగే ఉంచేయొచ్చు.
-తయారైన గరం మసాలాను గాలి చొరబడని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. తడి తగలనివ్వకూడదు. ఇలా చేస్తే 3 నుండి 6 నెలల వరకు సువాసన పోకుండా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












