Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
ఈ చలికాలంలో ఆరోగ్యాన్నిచ్చే అమృతం..ఇంట్లోనే స్వచ్ఛమైన పల్లీ బర్ఫీ చేసుకోండిలా
మీరు తీపి వంటకాలను ఇష్టపడేవారా? అయితే ఈ చలికాలంలో మీ జిహ్వ చాపల్యాన్ని తీర్చడమే కాకుండా, ఆరోగ్యానికి మేలు చేసే ఒక అద్భుతమైన స్వీట్ వేరుశెనగ బర్ఫీ. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మన శరీరం వెచ్చదనాన్ని కోరుకుంటుంది. ఆ వెచ్చదనాన్ని, తక్షణ శక్తిని అందించడంలో వేరుశెనగలు, నువ్వులు అద్భుతంగా పనిచేస్తాయి.
మార్కెట్లో రంగులు, రసాయనాలు కలిపిన స్వీట్ల జోలికి వెళ్లకుండా, కేవలం 15-20 నిమిషాల్లో తయారయ్యే హెల్తీ వేరుశెనగ బర్ఫీ ఇంట్లోనే చేసుకోండి. పిల్లల నుండి పండు ముసలి వారి వరకు ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా ఆస్వాదించే వేరుశెనగ బర్ఫీ..కేవలం రుచిలోనే కాదు, పోషకాల విషయంలోనూ రారాజు. మరి ఈ పోషకమైన వేరుశెనగ బర్ఫీని ఎలా తయారు చేయాలో, దీనికి కావాల్సిన పదార్థాలేంటో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
వేరుశెనగలు- 1 కప్పు
నువ్వులు- పావు కప్పు
బెల్లం తురుము- 1 కప్పు
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి - 1 టీస్పూన్
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి పాన్ పెట్టుకోండి. అందులో కొద్దిగా నెయ్యి వేసి వేడి అయ్యాక, వేరుశెనగలను వేయండి. మంటను తక్కువలో ఉంచి పల్లీలు దోరగా వేగి, మంచి సువాసన వచ్చేవరకు వేయించాలి. అవి వేగాక ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి.
-అదే పాన్ లో మరికొద్దిగా నెయ్యి వేసి నువ్వులను వేయండి. నువ్వులు త్వరగా వేగుతాయి కాబట్టి జాగ్రత్తగా చిటపటలాడే వరకు వేయించి పక్కన పెట్టండి.
-ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశెనగలు చల్లారిన తర్వాత వాటిపై ఉన్న పొట్టును పూర్తిగా తీసివేయాలి.
-ఇప్పుడు పొట్టు తీసిన వేరుశెనగలు, వేయించిన నువ్వులను ఒక మిక్సీ జార్ లోకి తీసుకోండి. వీటిని మరీ మెత్తని పిండిలా కాకుండా, కొంచెం బరకగా ఉండేలా పొడి చేసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో బెల్లం తురుము లేదా చక్కెర కొద్దిగా నీళ్లు పోసి తీగ పాకం వచ్చేలా మరిగించాలి. బెల్లం(చక్కెర) పూర్తిగా కరిగి, సిరప్ చిక్కగా మారుతున్నప్పుడు మంటను తగ్గించి, సిద్ధం చేసుకున్న వేరుశెనగ-నువ్వుల పొడిని ఇందులో వేసి బాగా కలపాలి. ఉండలు లేకుండా చూసుకోవాలి.
-ఈ మిశ్రమం దగ్గర పడుతున్నప్పుడు చివరగా రుచిని, సువాసనను పెంచడానికి యాలకుల పొడిని, మరొక చెంచా నెయ్యిని జత చేయండి. నెయ్యి వేయడం వల్ల బర్ఫీ మృదువుగా రావడమే కాకుండా, మంచి మెరుపుతో కనిపిస్తుంది. మిశ్రమం పాన్ నుండి విడిపోతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి.
-ఒక ప్లేట్ కి లేదా ట్రేకి నెయ్యి రాసి సిద్ధంగా ఉంచుకోండి. వేడివేడి మిశ్రమాన్ని ఆ ప్లేట్ లోకి తీసుకుని, సమంగా పరచండి. ఇది కొద్దిగా చల్లారి, గట్టిపడుతున్న సమయంలోనే చాకుతో మీకు నచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత ముక్కలను వేరు చేయండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications







