Latest Updates
-
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్!
కమ్మని నెయ్యి వాసనతో..వెన్నలా కరిగిపోయే పూర్ణం బూరెలు
పూర్ణం బూరెలు పేరు వినగానే చాలామందికి నోట్లో నీళ్లూరిపోతాయి. వేడివేడి బూరెను చేతిలోకి తీసుకుని, కొద్దిగా నెయ్యి వేసుకుని తింటుంటే కలిగే అనుభూతి వర్ణనాతీతం.
ఇందులో వాడే పదార్థాలు, తయారుచేసే విధానం అన్నీ ఆరోగ్యాన్ని, సంప్రదాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఎంచుకున్నవే. ఇది శక్తికి, ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి చిహ్నంగా పరిగణిస్తారు.
కావలసిన పదార్థాలు
పచ్చి శనగపప్పు- 1 కప్పు
బెల్లం తురుము - 1 కప్పు
పచ్చి కొబ్బరి తురుము - అర కప్పు
యాలకుల పొడి - అర టీస్పూన్
నెయ్యి - 1 టేబుల్ స్పూన్
నీళ్లు - 2 కప్పులు
రేషన్ బియ్యం (దోశ బియ్యం) - 1 కప్పు
మినపప్పు - అర కప్పు
ఉప్పు - చిటికెడు
పంచదార - 1 టీస్పూన్
నూనె లేదా నెయ్యి - సరిపడినంత
తయారీ విధానం
-ముందుగా పచ్చి శనగపప్పును శుభ్రంగా కడిగి, ఒక గంటపాటు నానబెట్టాలి.
-బియ్యం, మినపప్పును వేర్వేరుగా కడిగి, కనీసం 4-5 గంటల పాటు నానబెట్టాలి.
-తర్వాత కుక్కర్ లో నానిన పచ్చిశెనగపప్పు, 2 కప్పుల నీళ్లు పోసి 3-4 విజిల్స్ వచ్చేవరకు మెత్తగా ఉడికించాలి. చేత్తో నొక్కితే మెత్తగా అయ్యేలా ఉండాలి. కుక్కర్ లో నీళ్లు ఎక్కువగా ఉంటే, వాటిని వంపేసి పప్పును మాత్రం తీసుకోవాలి.
-ఇప్పుడు ఒక మందపాటి గిన్నెలో బెల్లం తురుము, రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి తక్కువ మంట మీద కరిగించాలి. బెల్లం పూర్తిగా కరిగాక, దానిని వడకట్టుకోవాలి.
-ఇప్పుడు వడకట్టిన బెల్లం పాకాన్ని మళ్లీ పొయ్యి మీద పెట్టి అందులో ఉడికించి పెట్టుకున్న శనగపప్పు ముద్దను వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని గరిటెతో మెదుపుతూ ఉండాలి. మిశ్రమం గిన్నె అంచుల నుండి విడివడి, ముద్దలా తయారవుతున్నప్పుడు అందులో పచ్చి కొబ్బరి తురుము, యాలకుల పొడి, నెయ్యి వేసి బాగా కలిపి స్టవ్ ఆపేయాలి.
-ఈ పూర్ణం మిశ్రమాన్ని ఒక పళ్లెంలోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇది మరింత గట్టిపడుతుంది. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని మిశ్రమాన్ని చిన్న చిన్న నిమ్మకాయ సైజు ఉండలుగా చేసుకోవాలి.
-ఇప్పుడు నానిన బియ్యం,మినపప్పులోని నీళ్లు వంపేసి, గ్రైండర్ లో ముందుగా మినపప్పును వేసి కొద్దికొద్దిగా నీళ్లు చల్లుకుంటూ మెత్తగా, వెన్నలా రుబ్బుకోవాలి. తర్వాత బియ్యాన్ని కూడా వేసి దోశ పిండి కంటే కొంచెం గట్టిగా, జారేలా రుబ్బుకోవాలి.
-రుబ్బిన రెండు పిండిలను ఒక గిన్నెలో వేసి, చిటికెడు ఉప్పు, ఒక టీస్పూన్ పంచదార వేసి బాగా కలపాలి. పిండి మరీ పలచగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. పూర్ణం ఉండకు పిండి బాగా పట్టేలా ఉండాలి. ఈ పిండిని కనీసం 2-3 గంటలు నాననిస్తే బూరెలు మృదువుగా వస్తాయి.
-ఇప్పుడు ఒక బాండీలో నూనె పోసి మీడియం మంట మీద వేడిచేయాలి. నూనె మరీ ఎక్కువగా కాగకూడదు.
-ముందుగా సిద్ధం చేసుకున్న పూర్ణం ఉండలను ఒక్కొక్కటిగా తీసుకుని రెడీ చేసుకున్న పిండిలో పూర్తిగా మునిగేలా ముంచి వేడెక్కిన నూనెలో వదలాలి.
-ఒక నిమిషం తర్వాత, గరిటెతో మెల్లగా తిప్పుతూ అన్ని వైపులా బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.
-వేగిన బూరెలను నూనె నుండి తీసి టిష్యూ పేపర్ పై వేస్తే అదనపు నూనె పీల్చుకుంటుంది. అంతే పూర్ణం బూరెలు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications







