Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్నెస్పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
షుగర్ వ్యాధి నుంచి కాపాడి,బరువు తగ్గించే ఆయుర్వేదిక్ రెసిపి..ఈజీగా ఎలా చేసుకోవాలంటే
భారతదేశంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో మినుములు ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. ఇడ్లీ, దోశ, వడల వంటి అనేక ప్రసిద్ధ వంటకాలలో మినుములను ప్రధానంగా ఉపయోగిస్తారు. అయితే ఈ మినుములతో తయారుచేసే పులగం, ఒక సాధారణ వంటకంలా కనిపించినా దాని రుచి, పోషక విలువలు అద్భుతం. ఇది ఒక సంప్రదాయ, సౌకర్యవంతమైన ఆహారం, ఇది సులభంగా జీర్ణమవుతుంది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. దీనిని మధ్యాహ్నా భోజనంలోకి లేదా రాత్రి డిన్నర్ లోకి ఎప్పుడు తిన్నా అద్భుతంగానే ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ఎంతో పుష్ఠినిస్తుంది. ఇది తక్కువ మసాలాలు కలిగి ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకు, వృద్ధులకు, అనారోగ్యంతో ఉన్నవారికి ఇది చాలా మంచి ఆహారం.
ముఖ్యంగా షుగర్ వ్యాధి నుంచి కాపాడటంలో ఇది చాలా మేలు చేస్తుంది. మినుములలోని ఫైబర్ రక్తంలో షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. ఇది గ్లూకోజ్ శోషణను నెమ్మదిస్తుంది..ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలలో ఆకస్మిక పెరుగుదలను నివారిస్తుంది. మినుములలోని ప్రోటీన్,ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి,అతిగా తినడాన్ని తగ్గిస్తాయి. దీంతో ఇది బరువు నియంత్రణలో లేదా తగ్గించడంలో సహాయపడుతుంది. మీ ఇంట్లోనే ఈజీగా మినుముల పులగం తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

మినుముల పులగం తయారీకి కావాల్సిన పదార్థాలు
-బియ్యం
-మినుములు
-మెంతులు
-వెల్లుల్లి
-మెంతులు
-ఉప్పు
-పచ్చి కొబ్బరి తురుము
-పచ్చిమిర్చి
-జీలకర్ర
-కరివేపాకు
-నువ్వుల నూనె
మినుముల పులగం తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి అందులో అరకప్పు పొట్టు మినపప్పు వేసి మంచి సువాసన వచ్చేదాకా తక్కువ మంట మీద వేయించి పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో 1 కప్పు కడిగిన బియ్యం, వేయించిన మినుములు, పొట్టు తీసిన 6-7 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, రుచికి సరిపడా ఉప్పు, మూడున్నర కప్పుల నీళ్లు పోసి మూతపెట్టి మీడియం మంట మీద 4 విజిల్స్ రానివ్వాలి.
-తర్వాత మూత తీసి మెత్తగా ఉడికిన పులగంలో అరకప్పు పచ్చి కొబ్బరి తురుము వేసి మొత్తాన్ని బాగా కలపండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఓ బాండీ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నువ్వుల నూనె పోసి వేడి చేసి ఇందులో 3 పచ్చిమిర్చి చీలికలు, అర టీస్పూన్ జీలకర్ర,రెండు రెమ్మల కరివేపాకు ఎర్రగా వేయించాలి.
-వేయించిన తాళింపుని పులగంలో వేసి కలపండి. అంతే ఆయుర్వేదిక్ పెసిపి మినుముల పులగం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications