Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
షుగర్ వ్యాధి నుంచి కాపాడి,బరువు తగ్గించే ఆయుర్వేదిక్ రెసిపి..ఈజీగా ఎలా చేసుకోవాలంటే
భారతదేశంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో మినుములు ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. ఇడ్లీ, దోశ, వడల వంటి అనేక ప్రసిద్ధ వంటకాలలో మినుములను ప్రధానంగా ఉపయోగిస్తారు. అయితే ఈ మినుములతో తయారుచేసే పులగం, ఒక సాధారణ వంటకంలా కనిపించినా దాని రుచి, పోషక విలువలు అద్భుతం. ఇది ఒక సంప్రదాయ, సౌకర్యవంతమైన ఆహారం, ఇది సులభంగా జీర్ణమవుతుంది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. దీనిని మధ్యాహ్నా భోజనంలోకి లేదా రాత్రి డిన్నర్ లోకి ఎప్పుడు తిన్నా అద్భుతంగానే ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ఎంతో పుష్ఠినిస్తుంది. ఇది తక్కువ మసాలాలు కలిగి ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకు, వృద్ధులకు, అనారోగ్యంతో ఉన్నవారికి ఇది చాలా మంచి ఆహారం.
ముఖ్యంగా షుగర్ వ్యాధి నుంచి కాపాడటంలో ఇది చాలా మేలు చేస్తుంది. మినుములలోని ఫైబర్ రక్తంలో షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. ఇది గ్లూకోజ్ శోషణను నెమ్మదిస్తుంది..ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలలో ఆకస్మిక పెరుగుదలను నివారిస్తుంది. మినుములలోని ప్రోటీన్,ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి,అతిగా తినడాన్ని తగ్గిస్తాయి. దీంతో ఇది బరువు నియంత్రణలో లేదా తగ్గించడంలో సహాయపడుతుంది. మీ ఇంట్లోనే ఈజీగా మినుముల పులగం తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
మినుముల పులగం తయారీకి కావాల్సిన పదార్థాలు
-బియ్యం
-మినుములు
-మెంతులు
-వెల్లుల్లి
-మెంతులు
-ఉప్పు
-పచ్చి కొబ్బరి తురుము
-పచ్చిమిర్చి
-జీలకర్ర
-కరివేపాకు
-నువ్వుల నూనె
మినుముల పులగం తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి అందులో అరకప్పు పొట్టు మినపప్పు వేసి మంచి సువాసన వచ్చేదాకా తక్కువ మంట మీద వేయించి పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో 1 కప్పు కడిగిన బియ్యం, వేయించిన మినుములు, పొట్టు తీసిన 6-7 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, రుచికి సరిపడా ఉప్పు, మూడున్నర కప్పుల నీళ్లు పోసి మూతపెట్టి మీడియం మంట మీద 4 విజిల్స్ రానివ్వాలి.
-తర్వాత మూత తీసి మెత్తగా ఉడికిన పులగంలో అరకప్పు పచ్చి కొబ్బరి తురుము వేసి మొత్తాన్ని బాగా కలపండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఓ బాండీ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నువ్వుల నూనె పోసి వేడి చేసి ఇందులో 3 పచ్చిమిర్చి చీలికలు, అర టీస్పూన్ జీలకర్ర,రెండు రెమ్మల కరివేపాకు ఎర్రగా వేయించాలి.
-వేయించిన తాళింపుని పులగంలో వేసి కలపండి. అంతే ఆయుర్వేదిక్ పెసిపి మినుముల పులగం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications







