Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
టమాటో ఎండు చేపల కూర.. వేడి వేడి అన్నంతో రుచి అద్భుతం!
మన తెలుగు రాష్ట్రాల్లో ఎండు చేపల గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. మన నానమ్మ, అమ్మమ్మల కలం నుంచి ఈ ఎండు చేపలతో కూరలు చేసుకుంటూ వస్తున్నాం. ఈ రుచి అమోఘంగా ఉంటుంది. అది కూడా టమాటోలతో ఎండు చేపల కూర చేసుకునే తింటే రుచి వేరే లెవెల్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎంతో సులభంగా క్షణాల్లోనే చేసుకునే ఈ కూరను వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అబ్బా.. భోజనం అదిరిపోతుంది. అయితే ఈ టమాటో ఎండు చేపల కూర ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
టమాటో ఎండు చేపల కూరకు కావాల్సిన పదార్థాలు
ఎండు చేపలు
టమాటోలు
ఉల్లిపాయలు
పచ్చి మిర్చి
అల్లం వెల్లుల్లి పేస్ట్
కారం
పసుపు
రుచికి సరిపడా ఉప్పు
కరివేపాకు
కొత్తిమీర
చింతపండు
ఆయిల్
టమాటో ఎండు చేపల కూర వండుకునే విధానం
ముందుగా ఎండు చేపలను శుభ్రంగా కడుక్కొని వేడి నీటిలో ఓ పది నిమిషాల పాటు బాగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, దానిపై ఒక కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో నూనె వేసుకోవాలి. అందులో ఎండు చేపలు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకులు వేసుకొని వాటి రంగు మారే వరకు వేయించుకోవాలి. ఆ తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వాటి పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తరువాత టమాటో ముక్కలు వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి.
టమాటోలు మెత్తగా ఉడికాక అందులో కారం, ఉప్పు, పసుపు వేసుకొని ఓ రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తరువాత ఎండు చేపల ముక్కలు కూడా వేసుకొని ఓ నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తరువాత అందులో కొంచెం నీళ్లు పోసుకొని మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో కొంచెం చింతపండు గుజ్జు వేసుకొని దగ్గరికి అయ్యేంత వరకు మరిగించుకోవాలి. కూర ఎండ్కి వచ్చే సమయంలో మసాలాలు, కొత్తిమీర చల్లుకొని ఇంకో రెండు నిమిషాల పాటు ఉడికించుకొని కూరను దించుకుంటే ఎంతో రుచికరమైన టమాటో ఎండు చేపల కూర సిద్ధమైట్లే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications











