Latest Updates
-
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి!
ఒకప్పుడు బడుల ముందు అమ్మే బెల్లం బోండాలు..రుచిలో దీన్ని మించిన స్నాక్ లేదు..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
ఇప్పుడంటే డెజర్ట్స్,కేకులు,ఐస్ క్రీమ్ లు వచ్చి ఫ్యాన్సీ ఫుడ్ మీద మోజు ఎక్కువైంది కానీ ఒకప్పుడు మన స్నాక్స్,డెజర్ట్స్ అన్నీ బెల్లం బోండాలే. కొన్నేళ్ల క్రితం వరకు స్కూల్స్ ముందు కూడా ఈ బెల్లం బోండాలు అమ్ముతుండేవాళ్లు. వీటిని వేడివేడిగా తింటే ఒక రుచి..చల్లారక తింటే మరో ఉంటుంది. బెల్లం బోండాలను తయారుచేసుకోవడం చాలా చాలా ఈజీ. క్షణాల్లోనే దీనిని తయారుచేసుకొని ఆస్వాదించచ్చు. మీ ఇంట్లోనే సింపుల్ గా బెల్లం బోండాలను తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
బెల్లం బోండాలు తయారీకి కావాల్సిన పదార్థాలు
-బెల్లం తరుము
-పెరుగు
-వంటసోడా
-బొంబాయి రవ్వ
-గోధుమ పిండి
-ఉప్పు
-సోంపు
-ఆయిల్
-నీళ్లు

బెల్లం బోండాలు తయారీ విధానం
-ముందుగా ఓ పెద్ద గిన్నె స్టవ్ మీద పెట్టి అందులో 200 గ్రాముల బెల్లం తరుము వేయండి. ఇందులోనే పావుకప్పు నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించాలి.
-బెల్లం కరిగిన తర్వాత గిన్నెను పక్కకుపెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి.
-ఇప్పుడు ఓ బౌల్ లో పావు కప్పు పెరుగు, 1 టీస్పూన్ వంటసోడా వేసి కలిపాక ఇందులో 2 టీస్పూన్ల బొంబాయి రవ్వ వేసి 5 నిమిషాలు వదిలేయండి. అప్పుడు సోడాతో కలిసిన పెరుగు పొంగుతుంది.
సమ్మర్ స్పెషల్ లడ్డు.. శరీర వేడిని తగ్గించి ఒంటికి చలువ..ఎలా చేసుకోవాలంటే..
-ఇప్పుడు అందులో పూర్తిగా చల్లారిన బెల్లం పాకాన్ని వడకట్టి పోయాలి. తర్వాత ఇందులోనే 400 గ్రాముల గోధుమపిండి, 1 టీస్పూన్ ఉప్పు, 1 టీస్పూన్ సోంపు వేసి కలపండి. ఉండలు లేకుండా కలుపుతూ మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా మొత్తం అరకప్పు నీళ్లు పోసుకొని కలపాలి. చేత్తోనే కొద్దిసేపు పిండిని బీట్ చేయాలి.
-కలుపుకున్న పిండిమీద మూతపెట్టి కనీసం అరగంట సేపు పక్కనపెట్టండి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేడి చేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పిండిని బోండాలుగా ఇందులో వేయాలి. బాగా కాల్చుకొని దించసుకోవాలి.
-వీటిని వేడి వేడిగా తింటే ఒకరకమైన టేస్ట్..చల్లారిన తర్వాత తింటే మరో టేస్ట్ ఉంటుంది. ఇవి 3 రోజులు దాకా పాడవకుండా ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications