Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
మిగిలిపోయిన అన్నంతో 5 నిమిషాల్లోనే క్రిస్పీ పకోడీ..పాలకూర కలిపి ఇలా చేస్తే తిరుగుండదు
భారతీయులు అన్నంతో రకరకాల రుచికరమైన వంటకాలు తయారుచేస్తారు. మిగిలిపోయిన అన్నం పడేయకుండా తిరిగి ఉపయోగించడం వల్ల కొత్త పదార్థాల కొనుగోలుపై ఖర్చు తగ్గుతుంది. ఇది కుటుంబ బడ్జెట్ కు చాలా సహాయపడుతుంది. మిగిలిపోయిన వాటిని ఉపయోగించడం అనేది భారతీయ వంట సంస్కృతిలో ఒక భాగం. ఇది పాత తరాల నుండి నేర్చుకున్న ఒక తెలివైన పద్ధతి, ఇది ఆధునిక కాలంలో ఆహార వ్యర్థాలను తగ్గించడానికి ఒక మార్గంగా కూడా ఉపయోగపడుతుంది.
మిగిలిపోయిన అన్నంతో చేసే పకోడీలు చాలా రుచికరంగా ఉంటాయి. ఇది తక్కువ సమయంలో తయారు చేసుకోగలిగే ఒక స్నాక్, ముఖ్యంగా అకస్మాత్తుగా అతిథులు వచ్చినప్పుడు లేదా సాయంత్రం టీ సమయానికి ఇది పర్ఫెక్ట్. పిల్లలు సాధారణంగా కొత్త రుచులను ఇష్టపడతారు. అన్నం పకోడీలు క్రిస్పీగా, రుచికరంగా ఉంటాయి కాబట్టి పిల్లలు వాటిని ఇష్టపడతారు. దీనివల్ల అన్నం పట్ల వారికి ఉన్న అయిష్టతను కూడా తగ్గించవచ్చు. మిగిలిపోయిన అన్నంతో పకోడీలు ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-మిగిలిపోయిన అన్నం
-జీలకర్ర
-అల్లం
-కరివేపాకు
-పాలకూర
-కొత్తిమీర
-ఇంగువ
-ఆయిల్
-శెనగపిండి
-బియ్యపు పిండి
-ఉల్లిపాయ
-ఉప్పు
-కారం
తయారీ విధానం
ముందుగా ఓ గిన్నెలోకి మిగిలిపోయిన అన్నం 2 కప్పులు తీసుకోండి. అన్నంని గడ్డలు లేకుండా మెత్తగా చిదమాలి. చేతితో లేదా ఒక గరిటతో మెత్తగా చేసుకోవచ్చు. మరీ పేస్ట్లా కాకుండా కొద్దిగా అన్నం గింజలు ఉండేలా చూసుకోవాలి.
అన్నంని బాగా మాష్ చేసిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల శెనగపిండి,1 టేబుల్ స్పూన్ బియ్యపు పిండి, 1 ఉల్లిపాయ ముక్కలు, అర ఇంచు అల్లం తరుగు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర,అర టేబుల్ స్పూన్ కారం, సరిపడా ఉప్పు ,కరివేపాకు తరుగు, అర కప్పు పాలకూర తరుగు, కొద్దిగా కొత్తిమీర తరుగు, కొద్దిగా ఇంగువ వేసి మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి.
కలిపిన అన్నం మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా చేతిలోకి తీసుకొని చిన్న చిన్న ఉండలుగా రెడీ చేసుకోండి.
ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి వేడి చెయ్యాలి.
ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో రెడీ చేసి పెట్టుకున్న అన్నం ఉండలను ఒక్కొక్కటిగా వేయండి. మంటను మీడియంలో పెట్టి రెండు వైపులా బంగారు రంగులోకి మారి, క్రిస్పీగా అయ్యే వరకు వేయించాలి.
వేగిన పకోడీలను టిష్యూ పేపర్ వేసిన ప్లేట్ లోకి తీసి అదనపు నూనెను పీల్చుకోవడానికి అనుమతించండి. అంతే వేడి వేడి మిగిలిపోయిన అన్నం పకోడీలు రెడీ. పుదీనా చట్నీతో లేదా మీకు నచ్చిన చట్నీతో దీనిని ఆస్వాదించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications