Latest Updates
-
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు!
ఉత్తరాంధ్ర స్పెషల్ కిరిసి పాయసం..టేస్ట్ అదిరిపోద్ది అంతే..ఎలా చేసుకోవాలో చూడండి
పాయసం అనేది రుచికి, సంస్కృతికి, ఆరోగ్యానికి సమతుల్యతను అందించే అద్భుతమైన వంటకం. కిరిసి పాయసం అనేది ఉత్తరాంధ్ర ప్రాంతంలో, ముఖ్యంగా శ్రీకాకుళం,విజయనగరం జిల్లాల్లో ప్రసిద్ధి చెందిన ఒక సాంప్రదాయక, ప్రత్యేకమైన పాయసం. పండుగలు,ప్రత్యేక సందర్భాల్లో విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో దీనిని తప్పనిసరిగా చేస్తారు. కృష్ణా,గుంటూరు ప్రాంతాల్లో చేసే పాల తాలికలను ఇది పోలి ఉంటుంది. ఉత్తరాంధ్ర స్పెషల్ కిరిసి పాయసం మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవచ్చో ఇక్కడ చూడండి.
కిరిసి పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు
-పాలు
-బియ్యం
-చక్కెర
-పచ్చి కొబ్బరి
-నానబెట్టిన 1 టీస్పూన్ పాలు

కిరిసి పాయసం తయారీ విధానం
ఒక గ్లాసు బియ్యాన్ని కనీసం 2 గంటలు నానబెట్టాలి.
తర్వాత మిక్సీ గిన్నెలో నానబెట్టిన బియ్యం వేసి,ఇందులోనే అర గ్లాసు పాలలో గ్లాసున్నర నీళ్లు కలిపిన దాంట్లో సగం మిక్సీలో వేసి మొత్తం గ్రైండ్ చేసుకోవాలి.
గ్రైండ్ చేసిన పిండి మిశ్రమాన్ని ఓ గిన్నెలో వేసుకోండి. ఇందులోనే మిగిలిన పాలను కూడా వేసి ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకోవాలి. మంటను తక్కువలో ఉంచి దగ్గరగా అయ్యేదాకా కలుపుతూ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి.
ఇప్పుడు స్టవ్ మీద మరో గిన్నె పెట్టి అందులో 6 గ్లాసుల పాలు, 1 గ్లాసు చక్కెర, గుప్పెడు పచ్చి కొబ్బరి ముక్కలు వేసి స్టవ్ ఆన్ చేసి పాలను మరిగించాలి.
పాలు మరిగేలోగా కీర్సాట మెషీన్(వాంపూస వత్తుకోడానికి వాడేటువంటుది) కి ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టుకోండి.
ఉడికించిన పిండి మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా చేతుల్లోకి తీసుకొని కీర్సాట మెషీన్ లోని గుంటలో పెట్టి స్టవ్ మీద పాలలోనే నొక్కుకోవాలి. పాలు ఒక పొంగు వచ్చాక మళ్లీ ఇంకొంచెం పిండి మిశ్రమాన్ని మెషీన్ లో పెట్టి పాలలో వత్తుకోవాలి. దీనివల్ల ఒకటికొకటి అంటుకోకుండా పొడి పొడిగా వస్తాయి. మంటను మళ్లీ సిమ్ లో పెట్టేయాలి.
గరిట పెట్టకుండానే గుడ్డతో గిన్నెను పుట్టుకొని అటు ఇటూ తిప్పాలి. తర్వాత ఇందులో రెండు గంటల పాటు నానబెట్టిన 1 టీస్పూన్ పాలను వేసుకోవాలి. చాలా జాగ్రత్తగా గరిటతో కలబెట్టుకొని స్టవ్ ఆపేయండి. అంతే కిరిసి పాయసం రెడీ. వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications