Latest Updates
-
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు!
ఉత్తరాంధ్ర స్పెషల్ కిరిసి పాయసం..టేస్ట్ అదిరిపోద్ది అంతే..ఎలా చేసుకోవాలో చూడండి
పాయసం అనేది రుచికి, సంస్కృతికి, ఆరోగ్యానికి సమతుల్యతను అందించే అద్భుతమైన వంటకం. కిరిసి పాయసం అనేది ఉత్తరాంధ్ర ప్రాంతంలో, ముఖ్యంగా శ్రీకాకుళం,విజయనగరం జిల్లాల్లో ప్రసిద్ధి చెందిన ఒక సాంప్రదాయక, ప్రత్యేకమైన పాయసం. పండుగలు,ప్రత్యేక సందర్భాల్లో విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో దీనిని తప్పనిసరిగా చేస్తారు. కృష్ణా,గుంటూరు ప్రాంతాల్లో చేసే పాల తాలికలను ఇది పోలి ఉంటుంది. ఉత్తరాంధ్ర స్పెషల్ కిరిసి పాయసం మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవచ్చో ఇక్కడ చూడండి.
కిరిసి పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు
-పాలు
-బియ్యం
-చక్కెర
-పచ్చి కొబ్బరి
-నానబెట్టిన 1 టీస్పూన్ పాలు

కిరిసి పాయసం తయారీ విధానం
ఒక గ్లాసు బియ్యాన్ని కనీసం 2 గంటలు నానబెట్టాలి.
తర్వాత మిక్సీ గిన్నెలో నానబెట్టిన బియ్యం వేసి,ఇందులోనే అర గ్లాసు పాలలో గ్లాసున్నర నీళ్లు కలిపిన దాంట్లో సగం మిక్సీలో వేసి మొత్తం గ్రైండ్ చేసుకోవాలి.
గ్రైండ్ చేసిన పిండి మిశ్రమాన్ని ఓ గిన్నెలో వేసుకోండి. ఇందులోనే మిగిలిన పాలను కూడా వేసి ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకోవాలి. మంటను తక్కువలో ఉంచి దగ్గరగా అయ్యేదాకా కలుపుతూ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి.
ఇప్పుడు స్టవ్ మీద మరో గిన్నె పెట్టి అందులో 6 గ్లాసుల పాలు, 1 గ్లాసు చక్కెర, గుప్పెడు పచ్చి కొబ్బరి ముక్కలు వేసి స్టవ్ ఆన్ చేసి పాలను మరిగించాలి.
పాలు మరిగేలోగా కీర్సాట మెషీన్(వాంపూస వత్తుకోడానికి వాడేటువంటుది) కి ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టుకోండి.
ఉడికించిన పిండి మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా చేతుల్లోకి తీసుకొని కీర్సాట మెషీన్ లోని గుంటలో పెట్టి స్టవ్ మీద పాలలోనే నొక్కుకోవాలి. పాలు ఒక పొంగు వచ్చాక మళ్లీ ఇంకొంచెం పిండి మిశ్రమాన్ని మెషీన్ లో పెట్టి పాలలో వత్తుకోవాలి. దీనివల్ల ఒకటికొకటి అంటుకోకుండా పొడి పొడిగా వస్తాయి. మంటను మళ్లీ సిమ్ లో పెట్టేయాలి.
గరిట పెట్టకుండానే గుడ్డతో గిన్నెను పుట్టుకొని అటు ఇటూ తిప్పాలి. తర్వాత ఇందులో రెండు గంటల పాటు నానబెట్టిన 1 టీస్పూన్ పాలను వేసుకోవాలి. చాలా జాగ్రత్తగా గరిటతో కలబెట్టుకొని స్టవ్ ఆపేయండి. అంతే కిరిసి పాయసం రెడీ. వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications