Latest Updates
-
కీళ్ల నొప్పులు, జలుబును మాయం చేసే మునగాకు ఉలవల సూప్..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ పచ్చడి చేస్తే ఇంట్లో అందరూ ప్లేట్లు నాకేస్తారు.. బెండకాయ వంకాయ కాంబినేషన్ అదుర్స్! -
నల్ల దోసె.. చూస్తే షాక్, తింటే ఫిదా అవ్వాల్సిందే..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే దూదిలాంటి సగ్గుబియ్యం దోశ.. ఎలా చేయాలో తెలుసా? -
మీ నాలుక ఇలా ఉంటే మహారాజ యోగమే.. శాస్త్రం ఏం చెబుతోందంటే? -
మైదా బ్రెడ్ కు గుడ్ బై.. ఇంట్లోనే ఈజీగా రాగి బ్రెడ్ చేసుకోండిలా..ఆరోగ్యంతో పాటు అద్భుతమైన రుచి! -
దంతాలు డైమండ్స్ లా మెరవాలా? తేనెతో ఇలా చేయండి.. -
ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే సోయా సలాడ్..తింటే ఎముకలు ఉక్కులా, కండరాల పుష్ఠి! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. నోరూరించే సొరకాయ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇది రెగ్యులర్ ఉప్మా కానే కాదు.. చుక్క నూనె లేకుండా చల్లతో చేసే హెల్తీ ఉప్మా.!
ఒక్క చుక్క నూనె లేకుండా నోరూరించే కూరలు..మీ ఆరోగ్యం, దేశ ఆర్థిక వ్యవస్థ రెండింటికీ మేలు!
మన భారతీయ వంటగది అనగానే ముందుగా గుర్తొచ్చేది నూనె. ఏ కూర వండినా, తాలింపు వేయాలన్నా నూనె పడాల్సిందే. కొందరు అయితే కూరగాయలను పూర్తిగా నూనెలోనే మగ్గబెట్టి వండుతుంటారు. వంటకు రుచి రావాలంటే నూనె ఉండాల్సిందే అనేది మన ప్రగాఢ విశ్వాసం. కానీ మితిమీరిన నూనె వాడకం మన ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారుతోంది. గుండె జబ్బులు, అధిక బరువు వంటి అనేక సమస్యలకు ఇదే ప్రధాన కారణం. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం వంటల్లో వంటనూనెల వాడకాన్ని తగ్గించాలని ప్రజలకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు.

నూనె వాడకం తగ్గించడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, విదేశాల నుంచి వంటనూనెల దిగుమతి తగ్గి, మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది. అయితే నూనె లేకుండా వంట చేయడమా? అది సాధ్యమేనా? అని చాలామంది ఆశ్చర్యపోవచ్చు. కానీ కేవలం నీటిని ఉపయోగించి, ఒక్క చుక్క నూనె లేకుండా అత్యంత రుచికరమైన కూరలను వండుకోవచ్చు. జీరో ఆయిల్ వంటకాన్ని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.
నూనె లేకుండా కూరగాయలు వండే విధానం
తాలింపు: ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి బాండీ పెట్టుకోండి. అందులో నూనెకు బదులుగా అర టీస్పూన్ జీలకర్ర లేదా ఆవాలు వేసి సన్నని మంటపై పొడిగా వేయించండి. మంచి సువాసన వస్తున్నప్పుడు, అందులో 3-4 టేబుల్ స్పూన్ల నీళ్లు పోయండి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించండి. అడుగు అంటుతున్నట్లు అనిపిస్తే మధ్యమధ్యలో 1-2 టేబుల్ స్పూన్ల నీళ్లు చల్లుతూ ఉండండి.
కూరగాయల జోడింపు: ఉల్లిపాయలు, టమాటాలు ఉడికిన తర్వాత మీరు వండాలనుకుంటున్న ప్రధాన కూరగాయలను అందులో వేయాలి. బంగాళదుంపలు, కాలీఫ్లవర్, వంకాయ, క్యారెట్.. ఇలా మీకు నచ్చిన కూరగాయల ముక్కలన్నింటినీ అందులో వేసి బాగా కలపండి.

మసాలాల తయారీ: కూరగాయలు వేసిన తర్వాత కొద్దిగా నీళ్లు చల్లి, మూత పెట్టి మీడియం మంట మీద ఉడికించండి. కూరగాయలు సగం ఉడికిన తర్వాత తగినంత ఉప్పు వేయండి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో అర టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ కారం, అర టీస్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా తీసుకుని.. అందులో రెండు టీస్పూన్ల నీళ్లు పోసి పేస్ట్ లా కలపండి. ఈ మసాలా పేస్ట్ ను ఉడుకుతున్న కూరలో వేసి ముక్కలకు పట్టేలా బాగా కలపండి.
మగ్గబెట్టడం: మసాలాలు వేసిన తర్వాత మంటను పూర్తిగా తగ్గించండి. కూరగాయలు మసాలాలను పీల్చుకుని, పూర్తిగా ఉడికే వరకు మధ్యమధ్యలో కలుపుతూ ఉండండి. ఒకవేళ కూర మాడిపోతున్నట్లు అనిపిస్తే, వెంటనే కొద్దికొద్దిగా నీళ్లు చల్లండి. కూరగాయ ముక్క పూర్తిగా మెత్తబడి, ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి.
ఫైనల్ టచ్: చివరగా కూరపై సన్నగా తరిగిన తాజా కొత్తిమీర ఆకులను చల్లండి. అంతే గుమగుమలాడే నూనె లేని కూర సిద్ధం. వేడి వేడి అన్నం లేదా రోటీతో దీన్ని వడ్డించండి. దీన్ని రుచి చూస్తే ఇందులో నూనె వేయలేదని ఎవరూ కనిపెట్టలేరు. ఒకవేళ మీకు రుచి ఇంకాస్త అద్భుతంగా ఉండాలనిపిస్తే దింపే ముందు కేవలం అర టీస్పూన్ నెయ్యి లేదా వెన్న కలుపుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications