Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
నూనె చుక్క కూడా లేకుండా..నీటితోనే క్రిస్పీ పూరీలు..కొలెస్ట్రాల్ భయం లేకుండా కుమ్మేయండి
ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న ఆరోగ్య సమస్యల కారణంగా చాలామంది తమకు ఎంతో ఇష్టమైన పూరీలకు దూరంగా ఉంటున్నారు. నూనెలో డీప్ ఫ్రై చేసిన పూరీలు తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందని, బరువు పెరుగుతామని భయపడి.. అయిష్టంగానే రోటీ లేదా పుల్కాతో సరిపెట్టుకుంటారు.
కానీ మనసు మాత్రం ఆ క్రిస్పీ పూరీల వైపే లాగుతుంది. ఎప్పుడైనా కంట్రోల్ తప్పి రెండు పూరీలు లాగిస్తే.. ఆ తర్వాత అజీర్తి లేదా గ్యాస్ సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. కానీ ఆయిల్ చుక్క లేకుండా నీటితోనే క్రీస్పీ పూరీలు తయారుచేసుకోవచ్చని మీకు తెలుసా? అది సాధ్యమే. నూనె చుక్క వాడకుండా, నీటి సహాయంతో క్రిస్పీ పూరీలను ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో గోధుమ పిండిని తీసుకోండి. అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి, కొద్దికొద్దిగా నీరు పోస్తూ పిండిని కలపండి. పూరీ పిండి మరీ మెత్తగా కాకుండా, కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోవాలి.
-పిండిని బాగా పిసికిన తర్వాత, ఒక శుభ్రమైన తడి గుడ్డతో దానిని కప్పి సుమారు 10 నుండి 15 నిమిషాల పాటు పక్కన పెట్టండి. ఇలా చేయడం వల్ల పిండి నానుతుంది,పూరీలు బాగా వస్తాయి.
-నానిన పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. ఇప్పుడు చపాతీ కర్ర సహాయంతో వీటిని పూరీల్లా ఒత్తుకోండి. మరీ పల్చగా కాకుండా, కొంచెం మందంగా ఉండేలా చూసుకోండి.
-స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి పాన్ లేదా బాండీలో నీటిని మరిగించండి.
-నీరు బాగా మరుగుతున్నప్పుడు మీరు ఒత్తుకున్న పూరీలను ఒక్కొక్కటిగా ఆ నీటిలో వేయండి.పూరీలు ఒకదానికొకటి అతుక్కోకుండా చూసుకోండి. సుమారు 2-3 నిమిషాల పాటు వాటిని నీటిలో ఉడకనివ్వాలి.
-అవి ఉడికిన తర్వాత నీటిపైకి తేలడం మీరు గమనిస్తారు. అప్పుడు వాటిని మెల్లగా తీసి ఒక ప్లేట్ లో పక్కన పెట్టండి.
-ఇప్పుడు అదే వేడి నీటి గిన్నెపై ఒక చిల్లుల గిన్నెను లేదా చిల్లుల ప్లేట్ ఉంచండి. నీటిలో ఉడికించిన పూరీలను (ఒకేసారి 2-3 మాత్రమే) ఆ చిల్లుల గిన్నెపై ఉంచి, మూత పెట్టండి. సుమారు 2-3 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి. దీనివల్ల పిండి పూర్తిగా ఉడుకుతుంది. తర్వాత వాటిని వేరే ప్లేట్లోకి తీసుకోండి.
-ఇప్పుడు మీ ఎయిర్ ఫ్రైయర్ ను 180 డిగ్రీల వద్ద ప్రీ-హీట్ చేయండి. ఆవిరిలో ఉడికించిన పూరీలను ఎయిర్ ఫ్రైయర్ లో ఉంచి, సుమారు 4 నిమిషాల పాటు వేయించండి. కొద్దిసేపటికే పూరీలు నూనెలో వేయించినట్లే చక్కగా ఉబ్బి, బంగారు రంగులోకి మారి క్రిస్పీగా తయారవుతాయి.
-అంతే ఎంతో ఆరోగ్యకరమైన, నూనె లేని పూరీలు రెడీ. వీటిని మీకిష్టమైన ఆలుగడ్డ కూరతో లేదా చోలే మసాలాతో వేడివేడిగా వడ్డించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications