Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
ధైర్య సాహసాలకు మరోపేరు మమతా దీదీ...!

ఈమె రెండు మార్లు రైల్వే శాఖ మంత్రిగాను, బొగ్గు, మానవ వనరుల అభివృధ్ధి, క్రీడలు, మహిళా శిశు సంక్షేమ మంత్రిగాను కేబినెట్ లో పదవీ భాధ్యతలు నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలకు సేకరించిన ప్రత్యేక ఆర్ధిక మండళ్ళకు వ్యతిరేకంగా వ్యవసాయదారుల తరపున పోరాటం సాగించి విజయం పొందారు.
1997వ సంవత్సరంలో మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీనుండి విడివడి ఆల్ ఇండియా త్రిణమూల్ కాంగ్రెస్ ను స్ధాపించి దానికి ఛైర్ పర్సన్ గా వ్యవహరించారు. 1999 వ సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వంలో రైల్వే శాఖా మంత్రిగా పదవి నిర్వహించారు. అక్టోబర్ 2005 లో ఆమె రాష్ట్రంలోని భూసేకరణ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని రైతుల తరపున అండగా నిలిచారు.2006 నవంబర్ లో బెనర్జీ సింగూరు లోని టాటా మోటార్ కార్ ప్రాజెక్టు భూముల సేకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడారు.
2009 పార్లమెంటరీ ఎన్నికలలో ఆమె యుపిఎ లో భాగస్వామ్య పార్టీగా చేరారు. కూటమి 26 సీట్లు గెలవడంతో ఆమె సెంట్రల్ కేబినెట్ లో రెండవ మారు రైల్వే మంత్రిగా చేరారు. 2011 లో బెనర్జీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో భారీ మెజారిటీతో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఓడించి 34 సంవత్సరాల కమ్యూనిస్టుల పాలనకు స్వస్తి చెప్పారు. పశ్చిమ బెంగాల్ కు ప్రస్తుత 11వ ముఖ్యమంత్రిగాను రాష్ట్రంలో మొదటి మహిళా ముఖ్యమంత్రిగాను పదవీ భాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో తొమ్మిది ప్రధాన శాఖలకు అధినేత్రిగా వ్యవహరిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజకీయాలలో అనేక విజయాలు సాధించి పాలన సాగిస్తూ మకుంటం లేని మహారాణిగా చెలామణి అవుతున్నారు. రాబోయే సంవత్సరాలలో మమత మరిన్ని విజయాలను సాధించి దేశ, రాష్ట్ర ప్రజల మన్ననలు పొందుతుందని ఆశిద్దాం!



Click it and Unblock the Notifications