Latest Updates
-
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా!
ధైర్య సాహసాలకు మరోపేరు మమతా దీదీ...!

ఈమె రెండు మార్లు రైల్వే శాఖ మంత్రిగాను, బొగ్గు, మానవ వనరుల అభివృధ్ధి, క్రీడలు, మహిళా శిశు సంక్షేమ మంత్రిగాను కేబినెట్ లో పదవీ భాధ్యతలు నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలకు సేకరించిన ప్రత్యేక ఆర్ధిక మండళ్ళకు వ్యతిరేకంగా వ్యవసాయదారుల తరపున పోరాటం సాగించి విజయం పొందారు.
1997వ సంవత్సరంలో మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీనుండి విడివడి ఆల్ ఇండియా త్రిణమూల్ కాంగ్రెస్ ను స్ధాపించి దానికి ఛైర్ పర్సన్ గా వ్యవహరించారు. 1999 వ సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వంలో రైల్వే శాఖా మంత్రిగా పదవి నిర్వహించారు. అక్టోబర్ 2005 లో ఆమె రాష్ట్రంలోని భూసేకరణ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని రైతుల తరపున అండగా నిలిచారు.2006 నవంబర్ లో బెనర్జీ సింగూరు లోని టాటా మోటార్ కార్ ప్రాజెక్టు భూముల సేకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడారు.
2009 పార్లమెంటరీ ఎన్నికలలో ఆమె యుపిఎ లో భాగస్వామ్య పార్టీగా చేరారు. కూటమి 26 సీట్లు గెలవడంతో ఆమె సెంట్రల్ కేబినెట్ లో రెండవ మారు రైల్వే మంత్రిగా చేరారు. 2011 లో బెనర్జీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో భారీ మెజారిటీతో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఓడించి 34 సంవత్సరాల కమ్యూనిస్టుల పాలనకు స్వస్తి చెప్పారు. పశ్చిమ బెంగాల్ కు ప్రస్తుత 11వ ముఖ్యమంత్రిగాను రాష్ట్రంలో మొదటి మహిళా ముఖ్యమంత్రిగాను పదవీ భాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో తొమ్మిది ప్రధాన శాఖలకు అధినేత్రిగా వ్యవహరిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజకీయాలలో అనేక విజయాలు సాధించి పాలన సాగిస్తూ మకుంటం లేని మహారాణిగా చెలామణి అవుతున్నారు. రాబోయే సంవత్సరాలలో మమత మరిన్ని విజయాలను సాధించి దేశ, రాష్ట్ర ప్రజల మన్ననలు పొందుతుందని ఆశిద్దాం!



Click it and Unblock the Notifications











