Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
ధైర్య సాహసాలకు మరోపేరు మమతా దీదీ...!

ఈమె రెండు మార్లు రైల్వే శాఖ మంత్రిగాను, బొగ్గు, మానవ వనరుల అభివృధ్ధి, క్రీడలు, మహిళా శిశు సంక్షేమ మంత్రిగాను కేబినెట్ లో పదవీ భాధ్యతలు నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలకు సేకరించిన ప్రత్యేక ఆర్ధిక మండళ్ళకు వ్యతిరేకంగా వ్యవసాయదారుల తరపున పోరాటం సాగించి విజయం పొందారు.
1997వ సంవత్సరంలో మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీనుండి విడివడి ఆల్ ఇండియా త్రిణమూల్ కాంగ్రెస్ ను స్ధాపించి దానికి ఛైర్ పర్సన్ గా వ్యవహరించారు. 1999 వ సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వంలో రైల్వే శాఖా మంత్రిగా పదవి నిర్వహించారు. అక్టోబర్ 2005 లో ఆమె రాష్ట్రంలోని భూసేకరణ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని రైతుల తరపున అండగా నిలిచారు.2006 నవంబర్ లో బెనర్జీ సింగూరు లోని టాటా మోటార్ కార్ ప్రాజెక్టు భూముల సేకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడారు.
2009 పార్లమెంటరీ ఎన్నికలలో ఆమె యుపిఎ లో భాగస్వామ్య పార్టీగా చేరారు. కూటమి 26 సీట్లు గెలవడంతో ఆమె సెంట్రల్ కేబినెట్ లో రెండవ మారు రైల్వే మంత్రిగా చేరారు. 2011 లో బెనర్జీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో భారీ మెజారిటీతో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఓడించి 34 సంవత్సరాల కమ్యూనిస్టుల పాలనకు స్వస్తి చెప్పారు. పశ్చిమ బెంగాల్ కు ప్రస్తుత 11వ ముఖ్యమంత్రిగాను రాష్ట్రంలో మొదటి మహిళా ముఖ్యమంత్రిగాను పదవీ భాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో తొమ్మిది ప్రధాన శాఖలకు అధినేత్రిగా వ్యవహరిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజకీయాలలో అనేక విజయాలు సాధించి పాలన సాగిస్తూ మకుంటం లేని మహారాణిగా చెలామణి అవుతున్నారు. రాబోయే సంవత్సరాలలో మమత మరిన్ని విజయాలను సాధించి దేశ, రాష్ట్ర ప్రజల మన్ననలు పొందుతుందని ఆశిద్దాం!



Click it and Unblock the Notifications