Latest Updates
-
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం! -
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే.. -
స్నేహితురాలికి ఆశ్రయం ఇస్తే.. బాయ్ ఫ్రెండ్ వింత ప్రవర్తన..ప్రియురాలి ఆవేదన! -
బయట బండి మీద దొరికే రుచితో ఇంట్లోనే భేల్ పూరీ.. ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
ఇడ్లీ, దోసెల్లోకి ఈసారి వంకాయ చట్నీ రుచి చూడండి..లెక్కపెట్టకుండా తినేస్తారు
ఇలాంటి కూతురు ఎవ్వరికీ వద్దు: తప్పుడు పనికి అలవాటుపడ్డ కూతురు,చూసిన తండ్రిని దారుణంగా..
తండ్రికి కూతురుకి మధ్య ఉండే అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. కూతురికి తల్లికన్నా తండ్రితోనే ఎక్కవు అనుబంధం ఉంటుంది. తన గారాల పట్టీ,తన ఇంట్లీ మహాలక్ష్మీ అనుకుంటూ చిన్నప్పటి నుంచి గుండె మీద ఎక్కించుకొని తండ్రి ఆటలాడిస్తాడు. వయస్సుకి వచ్చాక తన కూతురు ఎలాంటి కష్టాలు పడకూడదు అని, తన కూతురికి మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయాలని ఎన్నో కలలు కంటుంటాడు తండ్రి. తన కూతురు ఏదైనా తప్పు చేసినా కూడా దానిని సరిదిద్ది ఆమె భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటాడు. ఓ తండ్రి ఇలాగే కోరుకోవడం ఆయన పాలిట మరణశాసనం అయింది.
కూతురు చేస్తున్న తప్పుడు పనులను చూస్తూ ఉండలేకపోయిన తండ్రి కూతురిని మందలించాడు. దీంతో ఆ కూతురు కోపంతో దారుణానికి ఒడిగట్టింది. తన అక్రమసంబంధానికి అడ్డొస్తున్నాడని గుండె మీద ఎక్కించుకొని ఆడించిన తండ్రిని గుండె మీద కూర్చొని గుద్ది చంపేసించింది. కన్నతండ్రినే ప్రియుడితో హత్య చేయించిన ఈ దారుణ ఘటన ఎక్కడ,ఎలా జరిగిందనే వివరాలను ఇప్పుడు చూద్దాం.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేటలో సూరా రాంబాబు అనే వ్యక్తి కాపురం ఉంటున్నాడు. ఈయనకు వెంకట దుర్గ అనే కూతురు ఉంది. వెంకట దుర్గకి కొత్తూరుకి చెందిన ముమ్మడివరపు సురేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. వెంకట దుర్గ, సురేష్ ఓపెన్ గా తిరుగూతూనే తమ వివాహేతర సంబంధం కొనసాగించారు. అయితే తన కూతురి వివాహేతర సంబంధం గురించి రాంబాబుకి తెలిసింది. ఇప్పటిదాకా జరిగిందేదో జరిగిపోయింది ఇక మీదట ఇలా చేయకు నీ కాపురాన్ని నాశనం చేసుకోకు అంటూ కూతురిని మందలించాడు. అయితే తన క్షేమం ఆలోచించే తండ్రి తనమీద కోప్పడ్డాడన్న విషయం మరిచిన దుర్గ పగతో రగిలిపోయింది. విషయాన్ని తన ప్రియుడు సురేష్ కి చెప్పి ఎలాగైనా తన తండ్రిని చంపేయాలని కోరింది. వీరిద్దరూ కలిసి ఓ పథకం వేశారు.

మార్చి 16వ తేదీన ఇంట్లో తండ్రి రాంబాబు నిద్రిస్తున్న సమయంలో తన ప్రియుడిని ఇంటికి పిలిచింది. సురేష్ తనతో పాటు తన స్నేహితుడైన తాటికొండ నాగార్జున అనే వ్యక్తిని కూడా దుర్గ ఇంటికి తీసుకెళ్లాడు. ముగ్గురూ కలిపి మంచంపై నిద్రపోతున్న రాంబాబు ఛాతిపై కూర్చొని గుండెమీద గట్టిగా పిడిగుద్దులు గుద్దుతూ గొంతు నులిమి హత్య చేశారు. తర్వాత సురేష్, నాగార్జున అక్కడి నుంచి వెళ్లిపోయారు. నిద్రలోనే తన తండ్రి చనిపోయినట్లు దుర్గ నాటకం మొదలుపెట్టింది. అయితే రాంబాబు సోదరుడు అంటే దుర్గ బాబాయికి అనుమానం వచ్చింది. తన సోదరుడు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు కంప్లెయింట్ చేశాడు. దుర్గపైనే అనుమానం ఉందని పోలీసులకు చెప్పాడు. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు రావడంతో తండ్రి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించకూడదంటూ దుర్గ అడ్డుపడింది. పోస్టుమార్టం చేస్తే హత్య అనే విషయం బయటకు వస్తుందనే ఉద్దేశంతో తన తండ్రి మృతదేహానికి పోస్టుమార్టం చేస్తే..తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగింది. దీంతో పోలీసులకు ఆమె తీరుపై అనుమానం కలిగింది.
పోస్టుమార్టం నివేదికలో రాంబాబుది హత్య అని తేలడంతో పోలీసుల అనుమానం మరింత పెరిగింది. దీంతో ఎలాగైనా తనని పట్టుకుంటారని భావించిన దుర్గ.. ప్రియుడు,అతడి ఫ్రెండ్ తో కలిసి వైజాగ్ పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు వీరిని పట్టుకొని అరెస్ట్ చేశారు. విచారణలో నేరం ఒప్పుకోవడంతో వీరిని రామచంద్రాపురం కోర్టుకి తరలించారు. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది.



Click it and Unblock the Notifications











