Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
ప్రియుడితో శృంగారం..భర్తకు అడ్డంగా దొరికిన భార్య..చివరకి?
వివాహేతర సంబంధాలు పెట్టుకొని కట్టుకున్న భర్తను, కన్న బిడ్డలకు కూడా చంపుతున్న కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇటీవల సోషల్ మీడియా కూడా వివాహేతర సంబంధాలకు అడ్డాగా మారుతుంది. మొదట్లో మెల్లగా మేసేజ్..తర్వాత వీడియోకాల్స్..తర్వాత లైంగిక సంబంధాలు ఇలా వ్యవహారాలు నడుస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తి కోసం కట్టుకున్న భర్తను దారుణంగా చంపేసింది ఓ భార్య. ఈ దారుణ ఘటన ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది.
హర్యానా రాష్ట్రంలోని భివానీ సిటీకి చెందిన రవీనా,ప్రవీణ్ భార్యాభర్తలు. ఈ దంపతులకు 6ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. హాయిగా సాగిపోతున్న సంసారం. ప్రవీణ్ ఆటోరిక్షా నడుపుతుండేవాడు. అయితే రవీనాకి సోషల్ మీడియాలో వీడియోలు చేయాలని, బాగా ఫేమస్ అవ్వాలని ఇష్టం. అయితే ఇవన్నీ మనకొద్దు అని భర్త నచ్చజెప్పేవాడు. భర్త మాటలను కూడా పట్టించుకోకుండా ఇన్ స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో తన వీడియోలు పోస్ట్ చేస్తూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మారింది. రవీనాకి ఇన్ స్టాగ్రామ్ లో 34వేలమంది ఫాలోవర్స్, యూట్యూబ్ లో 5వేల మంది సబ్ స్కైబర్లు ఉన్నారు. ఎక్కువగా వీడియోలు కామెడీగా, ఫ్యామిలీ ఇష్యూస్ మీద ఉండేవి.

ఈ క్రమంలో మార్చి 25న షూట్ ఉందని చెప్పి రవీనా ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. తర్వాత ప్రవీణ్ కూడా ఇంటి నుంచి వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చి తలుపు తీయగా తన భార్య సురేష్ తో శృంగారం చేస్తూ కనిపించింది. తన భార్య మరో వ్యక్తితో శృంగారం చేయడం చూసి ప్రవీణ్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో రవీనా తన చున్నీని భర్త మెడకు బిగించి చంపేసింది. రాత్రి అయ్యేదాకా ఆగి ప్రియుడు సురేష్ సహాయంతో ప్రవీణ్ మృతదేహాన్ని 6 కి.మీ దూరం బైక్ మీద తీసుకెళ్లి డ్రైనేజ్ లో పడేశారు.
తర్వాత రోజు కుటుంబసభ్యులు ప్రవీణ్ ఏడి అని రవీనాని అడగినప్పుడు ఏమో నాకు తెలీదు అంటూ కూల్ గా సమాధానం చెప్పింది. అయితే మూడు రోజుల తర్వాత కుళ్లిపోయిన స్థితిలో ప్రవీణ్ మృతదేహం దగ్గర్లోని మురికికాలవ నుంచి బయటపడింది. దీంతో పోలీసులు దగ్గర్లోని సీసీటీవీ ఫుటేజిని పరిశీలించగా ఓ బైక్ మీద ముగ్గురు వెళ్లడం తిరిగి వెళ్లేటప్పుడు ఇద్దరే ఉండటం గుర్తించారు. ఆ ఇద్దరు రవీనా, సురేష్ గా గుర్తించి వారిని తమ స్టైల్ లో విచారించేసరికి నిజం ఒప్పుకున్నారు. ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే భర్తను హత్య చేయడానికి ముందునుంచే రవీనా తనను సింగిల్ మదర్ గా ఇన్ స్టాగ్రామ్ లో అందరికి పరిచయం చేసుకునేది.



Click it and Unblock the Notifications