షాపులో పనిచేసే కుర్రాడితో ఆంటీ ఎఫైర్..కనిపెట్టిన అంకుల్ ని ఏం చేసిందో తెలుసా

ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా వచ్చిన తర్వాత నుంచే ఇవి విపరీతంగా పెరిగిపోయాయి. వివాహేతర సంబంధాలు పెరిగినప్పటి నుంచి క్రైమ్స్ కూడా ఎక్కువయ్యాయి. వివాహేతర సంబంధాలకు అడ్డుగా ఉన్నారని భార్య..భర్తను చంపడం, భర్త..భార్యను చంపడం, కొంతమంది అయితే తమ వివిహేతర సంబంధాలకు అడ్డువస్తున్నారని పిల్లలను కూడా చంపేసిన ఘటనలు ఇటీవల కాలంలో చాలానే చూశాం. అయితే ఉత్తరప్రదేశ్ లో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను చంపి శవాన్ని ముక్కలుగా చేసి సిమెంట్ డ్రమ్ లో వేసిన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వేళ తాజాగా మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

రాజస్తాన్ రాష్ట్రంలోని జైపూర్ కి 16 కిలోమీటర్ల దూరంలోని సాంగనర్ టౌన్ లో నివసించే ధనలాల్ సైనీ,గోపాలీ దేవీ భార్యాభర్తలు. ధనలాల్ కూరగాయలు అమ్ముతుంటాడు. పెళ్లి తర్వాత అన్యోన్యంగా ఉండేవారు భార్యాభర్తలు. అయితే ఇదే సమయంలో గోపాలీదేవికి స్థానికంగా ఉన్న ఓ బట్టల షాపులో పనిచేసే దీన్ దయాలో అనే ఓ కుర్రాడితో పరిచయం ఏర్పడి క్రమంగా అది వివాహేతర సంబంధంగా మారింది. అయితే దీన్ దయాల్ గోపాలీ దేవీ వ్యవహారం ధనల్ లాల్ కి తెలిసిపోయింది. దీంతో భార్యను మందలించాడు. తీరు మార్చుకోవాలని హెచ్చరించాడు. ఈ క్రమంలో మార్చి 15న ఇంటికెళ్లిన ధనలాల్ తన భార్య ఇంట్లో లేకపోవడంతో ఆమె కోసం మెదట ఇంటి చుట్టుపక్కల గాలించాడు. తర్వాత ఆయనకు ఓ ఆలోచన వచ్చింది.

extramarital affair wife killed husband with lover help set body on fire

తన భార్య ఖచ్చితంగా దీన్ దయాల్ ని కలిసేందుకే వెళ్లి ఉంటది అని భావించి దీన్ దయాల్ పనిచేసే షాపుకి వెళ్లాడు. ఆ షాపులో దీన్ దయాల్ తో పాటు ఉన్న తన భార్యను చూసి ధన్ లాల్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎంత మంచిగా చూసుకున్నాను ఇలా చేప్తావా అది ఇదీ అంటూ భార్యతో గొడవపడ్డాడు. నాకు ఇష్టం వచ్చినవాడితో నేను పోతా నీకేంటీ అన్నట్లుగా గోపాలీ దేవీ వ్యవహరించింది. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో గోపాలీ దేవీ, దీన్ దయాల్ కలిసి ఎలాగైనా ధన్ లాల్ ని చంపేయాలని నిర్ణయించుకున్నారు.

తర్వాత గోపాలీదేవీ, దీన్ దయాల్ కలిసి..ధనలాల్ ని బట్టల షాపు పైన ఉన్న మరో ఖాళీ షాపులోకి రప్పించారు. వెంటనే ఐరన్ రాడ్డుతో ధనలాల్ తల పగలగొట్టారు. తీవ్ర గాయామైన ధనలాల్ ని మెడకు తాడు బిగించి గట్టిగా పట్టి చంపేశారు. ఆ తర్వాత శవాన్ని ఓ గోతాంలో వేసి దీన్ దయాల్ బండి మీద బీరుజీ టెంపుల దగ్గర్లోని నిర్మానుష్య ఏరియాకి తీసుకెళ్లారు. వీరు బండి మీద వెళ్తున్న దృశ్యం దగ్గర్లోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది.

ధనలాల్ ఐడెండిటీ,ఎవిడెన్స్ ని నాశనం చేసేందుకు ధనలాల్ శవంపై పెట్రోల్ పోసి తగలపెట్టారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా గోపాలీ దేవి తన ప్రియుడు దీన్ దయాల్ తో కలిసి అక్కడినుంచి వెళ్లిపోయింది. తర్వాత గోపాలీదేవీ ఆమె ప్రియుడు దీన్ దయాల్ ఇద్దరూ జైపూర్ పారిపోవాలని స్కెచ్ వేసుకున్నారు. అయితే ఈలోపు పోలీసులు రంగంలోకి దిగడంతో వీరి ఫ్లాన్ బెడిసికొట్టింది. వీరిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.

Story first published: Friday, March 21, 2025, 8:16 [IST]
Desktop Bottom Promotion