Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్నెస్పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
బురదలో రొమాన్స్ : ఈ ఫొటో షూట్ ను చూసి తట్టుకోవడం కష్టం.. దీనిపై నెటిజన్లు ఏమంటున్నారంటే..
ప్రస్తుతం అంతా స్మార్ట్ ప్రపంచమే. వెడ్డింగ్ షూట్ కోసం ఒక్కొక్కరు ఒక్కో శైలిని అనుసరిస్తారు. అది జీవితాంతం గుర్తుండిపోవాలని ఆశిస్తుంటారు.
ఇంధ్రదనస్సులో ఏడు రంగులు.. ఈ ప్రపంచంలో ఏడు వింతలు.. సంగీతంలో ఏడు స్వరాలు.. వెంకన్న ఉండేది ఏడు కొండలు.. పెళ్లితో వేసేది ఏడు అడుగులు.. అలాంటి అద్భుతమైన వివాహ ఘట్టాన్ని అందరికీ గుర్తుండిపోయేలా జరుపుకోవాలని అందరూ అనుకుంటారు. అయితే కొందరు మాత్రమే వాటిని నెరవేర్చుకుంటారు.

ఇటీవల ఓ జంట 33 వేల అడుగుల ఎత్తులో విమానంలో ఉండగా బంధుమిత్రుల సమక్షంలో ఒక్కటయ్యింది. అయితే తాజాగా మన దేశంలోని ఓ జంట గాల్లో కాకుండా నేలపైనే అద్భుతమైన ఫొటో షూట్ చేసింది. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త వైరల్ అయిపోయాయి. వీటిని చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ వారు ఏమి చేశారు. ఎందుకని నెటిజన్లు వారిని పొగిడారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే...

మళయాళీ లవర్స్..
ప్రస్తుతం అంతా స్మార్ట్ ప్రపంచమే. వెడ్డింగ్ షూట్ కోసం ఒక్కొక్కరు ఒక్కో శైలిని అనుసరిస్తారు. అది జీవితాంతం గుర్తుండిపోవాలని ఆశిస్తుంటారు. అలాగే ఆలోచించారు ఈ కేరళ లవర్స్. వీరిని చూసి సామాన్యులు సైతం తాము కూడా ఫాలో అవుతామని కొందరు నెటిజన్లు చెబుతున్నారు.

‘మడ్ లవ్‘
ఇంతకుముందు కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ జంట పెళ్లి బట్టలతోనే నదిలో ఫొటో షూట్ కోసం దిగడం. అక్కడ వధూవరులిద్దరూ నదిలో పడిపోవడం.. ఆ వీడియో కాస్త వైరల్ అవ్వడం మనందరికీ తెలిసిందే.. అయితే ఇటీవల అదే కేరళ రాష్ట్రానికి చెందిన జోస్ - అనిషా జంట ‘మడ్ లవ్‘ థీమ్ తో వినూత్నంగా వెడ్డింగ్ ఫొటో షూట్ తీయించుకున్నారు.

లవ్లీ కపుల్..
అందరిలా వెడ్డింగ్ షూట్ చేస్తే కిక్ ఏముంటుంది. అందరి కంటే వెరైటీగా వెడ్డింగ్ ఫొటోషూట్ చేయాలనుకున్న ఆ జంట మోడ్రన్ దుస్తులతోనే బురదలోకి దిగింది..

నారు మళ్ల మధ్యలో..
రైతుల పొలంలోని నారు మళ్ల మధ్యలో బాగా బురదగా ఉన్న ప్రదేశంలో ఆ జంట ఒకరి కళ్లలో ఒకరు చూసుకుంటూ ప్రేమ పరవశంలో మునిగిపోయారు. ఒకరినొకరు గాఢంగా కౌగిలించుకుంటూ.. కిస్ లు పెట్టుకుంటూ ఫుల్లు ఎంజాయ్ చేశారు. ఈ ఫొటోలను ‘బినూ సీన్స్ ఫొటోగ్రఫీ‘ కంపెనీ వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. అవి కాస్త బాగా వైరల్ అయిపోయాయి.

ఇదే మొట్టమొదటిది..
ఈ సందర్భంగా ఈ ఫొటో షూట్ ఆ కంపెనీ వారు మాట్లాడుతూ తమ దగ్గరికి చాలా మంది కస్టమర్లు వస్తుంటారు. చాలా మంది చాలా రకాల వెరైటీ ఫొటో షూట్ లను అడుగుతుంటారు. అయితే ‘మడ్ లవ్‘ థీమ్ అనే ఫొటో షూట్ తొలిసారి అని చెప్పారు.

నెటిజన్ల ప్రశంసలు..
ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. కొందరేమో వారికి శుభాకాంక్షలు చెబుతూ ఫన్నీ మీమ్స్ ను జత చేయగా.. మరి కొందరు మంచి క్రియేటివిటీ అని అభినందించారు. ఇంకా కొందరు నెటిజన్లు అయితే తాము కూడా దీన్ని ఫాలో అవుతామని తమకు ఆ వెడ్డింగ్ ప్లానర్ మొబైల్ నంబర్ కావాలని అడుగుతున్నారు. దాంతో వందలాది మంది షేర్లు చేసుకుంటున్నారు.

తొలుత వద్దన్నారు..
ముందుగా ఇలా ఫొటో షూట్ అని చెబితే వారు వద్దన్నారంటా. అయితే వారిని అతి కష్టం మీద ఒప్పించి మరీ ఈ బురదలో ఫొటోషూట్ ఏర్పాటు చేశారు.



Click it and Unblock the Notifications