Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్నెస్పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
కరోనా రోగుల కామ కేళి... క్వారంటైన్ కేంద్రాల్లోనే కలయికలో పాల్గొంటున్నారట...!
అక్కడ కొందరు కామ కోరికలు తీర్చుకుంటున్నారని తాజాగా వెలుగులోకిచ్చింది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
కోవిద్-19 మహమ్మారి దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. ఇప్పటికే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు దాదాపు 35 లక్షలు దాటిపోయాయి. ఈ కరోనా భూతం కారణంగా దాదాపు 2 లక్షల మందికి పైగా బలయ్యారు.

ఈ కరోనా వైరస్ కలవరం అగ్రరాజ్యం అమెరికా నుండి పేద దేశాల వరకు చాలా ఎక్కువగా ఉంది. మన దేశంలో కూడా కరోనా వైరస్ మహమ్మారి చాప కింద నీరులా విస్తరించింది. ఇప్పటివరకు భారతదేశంలో దాదాపు 40 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దాదాపు వెయ్యి మందికి పైగా మన దేశంలో కూడా మరణించారు. ఇక మిగిలిన వారందరినీ క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే ఎవరైతే క్వారంటైన్ కేంద్రాల్లో ఉంటున్నారో.. వారంతా ఇతరులతో లైంగిక కోరికలు తీర్చుకుంటున్నారట..

దీంతో వీరిని ఎలా కంట్రోల్ చేయాలా అని వైద్య సిబ్బంది, ఉన్నతాధికారులు తెగమదనపడుతున్నారట. అంతేకాదు అక్కడున్న కేంద్రాల్లో కరోనా రోగులు ఇష్టమొచ్చిన విధంగా ప్రవర్తిస్తున్నారట. డాక్టర్ల సూచనను ఏ మాత్రం పట్టించుకోవడం లేదంట. ఇంతకీ ఇదంతా ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీని పూర్తి చూడాల్సిందే...

కరోనా కష్టాలు...
కరోనా వైరస్ కష్టాలు ప్రపంచంలో ప్రతి ఒక్కరినీ వెంటాడుతున్నాయి. ఈ వైరస్ ఏ సమయాన చైనాలోని వూహాన్ నుండి వచ్చిందో అప్పటి నుండే అందరికీ కష్టాలు మొదలయ్యాయి. అయితే చైనా దీన్ని అధిగమించేందుకు అనేక ప్రయత్నాలు చేసింది.

ఇతర దేశాలకు..
అయితే ఈ కరోనా వైరస్ ముందుగా స్పెయిన్, ఇటలీ వంటి దేశాలపై పంజా విసరగా ప్రస్తుతం అమెరికాతో పాటు మరి కొన్ని దేశాలలో విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలో భారతదేశంలో కూడా వేగంగా వ్యాపిస్తోంది. మన దేశంలో కూడా రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అయితే మన దేశంలో కరోనా నుండి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా మెరుగ్గానే ఉంటోంది.

క్వారంటైన్ కేంద్రాల్లో..
అయితే అన్ని దేశాల్లో ఒక రకంగా పరిస్థితులంటే... ఆఫ్రికా ఖండంలోని ఉగాండా దేశంలో మాత్రం కరోనా పరిస్థితులు భిన్నంగా ఉన్నాయంట. అక్కడి కరోనా రోగుల ప్రవర్తన వల్ల ఉన్నతాధికారుల మూడు చెరువుల నీళ్లు తాగినంత పనవుతోందట. కరోనా సోకిన రోగులు క్వారంటైన్ కేంద్రాల్లో తమకు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారట.

లైంగిక సంబంధాలు..
ఉగాండా దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన రోగులు క్వారంటైన్ కేంద్రాల్లోనే రెచ్చిపోతున్నారట. వారు ఆ గదులనే పడకగదులుగా మార్చుకుని లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నారట.

ఒంటరితనాన్ని భరించలేక..
అక్కడ క్వారంటైన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్న రోగులు తాము ఎలా అయినా బతుకుతామని, అయితే ఒంటరితనాన్ని మాత్రం భరించలేమని చెబుతున్నారంట. అందుకే అక్కడ వారంతా గుంపులు గుంపులుగా తిరుగుతూ వైద్య సిబ్బందిని హడలెత్తిస్తున్నారట.

చీకటి పడితే చాలు..
ఇక అక్కడ కాస్త చీకటి పడితే చాలు ఎదుటివారితో ఆకర్షితులై శారీరకంగా కలుస్తున్నారట. దీని గురించి వైద్య సిబ్బంది, డాక్టర్లు ఎంత చెప్పినా వారు అస్సలు పట్టించుకోవడం లేదట. ఇలా చేస్తే తాము కరోనాను కట్టడి చేయలేమని డాక్టర్లు చెబుతున్నా ఏ మాత్రం చెవికెక్కించుకోవడం లేదంట.

మార్పు రావడం లేదు..
ఇందుకు సంబంధించి ఆ దేశ ఆరోగ్య శాఖ కార్యదర్శి డయానా అట్విన్ ఇలా మాట్లాడారు. ‘కరోనా వైరస్ ను అరికట్టేందుకు మేం తీసుకుంటున్న చర్యలకు ఇలాంటి
ఘటనలు ఆటంకం కలిగిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఉగాండా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా ప్రజల్లో ఏ మాత్రం మార్పు రావడం లేదట.

పార్టీలు కూడా చేసుకుంటున్నారట..
ఇంకా కొందరు అయితే లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమిస్తూ రోడ్లపై తిరుగుతున్నారు. ఇంకా కొంత మంది బంధువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్లి సంబరాలు చేసుకుంటున్నారు. ఇలాంటి వాటి వల్లే కరోనా వైరస్ నివారణ చర్యలకు ఆటంకం కలుగుతుందని అధికారులు వాపోతున్నారు.



Click it and Unblock the Notifications